అన్వేషించండి

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

హోటల్ నిర్వాహకురాలిపై దాడి చేసిన మహిళా సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు డీజీపీకి లేఖ రాసింది.


FIR On Srikalahasti CI :  హోటల్ సమయానికి మూయలేదంటూ శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ ఓ మహిళపై దాడి చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనలో తక్షణం సీఐ అంజూయాదవ్‌పై కేసు పెట్టి .. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశిస్తూ లేఖ పంపింది. మహిళపై అంజూయాదవ్ దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత వంగలపూడి అనిత ట్విట్టర్‌లో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మకు ఫిర్యాదు చేశారు.  వీడియోలు, బాధితురాలి వాంగ్మూలాన్ని చూసిన రేఖా శర్మ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. 

మహిళపై దాడి చేసిన తర్వాత సీఐ గతంలో వ్యవహరించిన విధానం కూడా సోషల్ మీడియాలో ఒక్క సారిగా వైరల్ అయింది. తోటి పోలీసుల్ని కూడా ఆమె అసభ్యంగా తిడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ కేసులో బాధితురాలిపైనే రివర్స్‌లో అక్రమ మద్యం కేసు నమోదు చేశారు. కానీ సీఐ అంజూయాదవ్‌పై పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర మహిళా కమిషన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో  జాతీయ మహిళా కమిషన్  ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌సీడబ్ల్యూ ఆదేశాల మేరకు పోలీసులు సీఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంది. 

 బాధిత మహిళ శ్రీకాళహస్తిలో ఓ హోటల్‌ నిర్వహిస్తున్నారు.  మహిళ దగ్గరకు వెళ్లిన సీఐ అంజూ యాదవ్ ఆమె భర్త ఆచూకీ అడిగారు. అయితే మహిళ తెలియదని చెప్పడంతో ఆమెపై సీఐ అంజూ యాదవ్ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మహిళపై అమానుషంగా దాడి చేశారు. ఆమె చీర ఊడిపోతున్న సీఐ స్పందించలేదు. మహిళను బలవంతంగా జీప్ ఎక్కించి రాత్రి సమయంలో పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అకారణంగా సీఐ తనపై దాడి చేశారని బాధిత మహిళ అంటున్నారు. తన కుమారుడు వేడుకున్నా సీఐ పట్టించుకోకుండా దాడి చేశారని బాధితురాలు ఆవేదన చెందారు. సీఐ కొంతకాలంగా తమ కుటుంబాన్ని వేధిస్తోందని బాధిత మహిళ ఆరోపించారు. 

ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై తరచూ విమర్శలు వస్తున్నాయి. కొంత మంది  పట్టపగలు హత్యాయత్నాలు చేసినా వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చేలా చేస్తున్నారని కానీ కొంత మందిపై తప్పుడు కేసులు పెట్టి అర్థరాత్రుళ్లు కూడా అరెస్ట్ చేసి కొడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బాధితుల్లో మహిళలు కూడా ఉంటూండటంతో . ఏపీలో ఎవరికీ రక్షణ లేదని వారు మండి పడుతున్నారు. ఈ కేసులో పోలీసులు అంజూయాదవ్‌పై చర్యలు తీసుకుంటారా లేదా అన్నదానిపై ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు జాగ్రత్తగా ఉంటారా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget