అన్వేషించండి

Chanderababu : చంద్రబాబు మరో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా - మళ్లీ నవంబర్ 7న !

చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ నవంబర్ 7వ తేదీకి వాయిదా పడింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ఈ పిటిషన్ దాఖలు చేశారు.


Chanderababu :  ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు.  ఈ కేసులో ఇవాళ్టి వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా విచారణను నవంబర్‌ 7కు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు తెలిపింది. ముందస్తు  బెయిల్ పొడిగించినట్లయింది. విచారణ సమయంలో.. సుప్రీంకోర్టులో 17ఏ సెక్షన్ వర్తింపుపై తీర్పు రానుందని.. అందులో తమకు అనుకూలంగా తీర్పు వస్తే..ఈ కేసుకు కూడా వర్తిస్తుందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ విచారణపై గతంలో హైకోర్టు స్టే విధించింది. ఏసీబీ కోర్టులో విచారణపై స్టేను నవంబర్‌ 7 వరకు హైకోర్టు పొడిగించింది.

ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై విచారణ వాయిదా          

ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉంది. అయితే.. మంగళవారం నాడు ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను శుక్రవారం నాటికి వాయిదా వేసింది. అంతేకాదు.. విచారణ జరిగేదాకా బాబును అరెస్ట్ అరెస్ట్‌ చేయొద్దని సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీకి కోర్డు సూచించింది. ఇప్పుడు అదే అంశాన్ని మెమో ద్వారా ఏసీబీ కోర్టుకు సీఐడీ తెలిపింది.  

చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై విచారణ జరపనున్న ఏసీబీ కోర్టు            

చంద్రబాబు హెల్త్‌ బులిటెన్‌ పిటిషన్‌పై కూడా నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనున్నది. బాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హెల్త్ బులెటెన్ విషయంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ వేయాలని సీఐడీని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. నిన్న సాయంత్రం సీఐడీ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.  

గవర్నర్ ను కలవనున్న టీడీపీ నేతలు                                        

మరో వైపు   రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను  టీడీపీ నేతల బృందం  బుధవారం  సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌  , నాయకుల గృహనిర్బంధం అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు టీడీపీ నేతలు వివరించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో తొలిసారిగా గవర్నర్‌ను టీడీపీ నేతలు కలుస్తున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో యనమల రామకృష్ణుడు  , వర్లరామయ్య  , గద్దె రామ్మోహన్ , బోండా ఉమా  .. గవర్నర్‌ను కలువనున్నారు
 


 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget