అన్వేషించండి

Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !

ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసుల విచారణ జరగనుంది. త్వరగా విచారించాలని ఏపీ ప్రభుత్వ లాయర్ ధర్మాసనాన్ని కోరారు.


Supreme Court Amaravati Case :  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల విచారణను ఫిబ్రవరి 23న  చేపడతామని  జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డికి తెలిపింది.  రాజధాని అమరావతి కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం ఉదయం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది మరోసారి విజ్ఞప్తి చేశారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్‌ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం వెల్లడించింది.మామూలుగా అయితే జనవరి 31వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. కానీ ఆరోజు బెంచ్ మీదకు రాలేదు. తర్వాత ఏడో తేదీన విచారణకు లిస్ట్ అయినట్లుగా కంప్యూటర్ జనరేటెడ్ లిస్టింగ్ కనిపించింది.

అయితే అమరావతి రాజధాని కేసులు  తక్షణమే విచారించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు ఏపీ ప్రభుత్వం శనివారం లేఖ రాసింది.  ఈ మేరకు వెంటనే మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలంటూ రిజిస్ట్రారుకు సుప్రీంకోర్టులోని అడ్వకేట్ ఆన్‌రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీ   లేఖ పంపారు. ఈనెల 6న మెన్షన్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రారును నజ్కీ అభ్యర్థించారు. కానీ మెన్షన్ కాకపోవడంతో ఏపీ న్యాయవాది ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరుగుతున్న ఈ వ్యాజ్యంలో నవంబర్ 28న జరిగిన విచారణలో ఈ ఏడాది జనవరి 31కి వాయిదా పడింది. అయితే 31న బెంచ్ సమావేశం కాకపోవడంతో విచారణ జరగలేదు.  

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని ఆరు నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది.   తదుపరి విచారణ ఏడో తేదీన జరుగుతుందని సుప్రీంకోర్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.  మస్తాన్ వలీ అనే  వ్యక్తి కూడా ఏపీ రాజధాని అంశంపై మరో పిటిషన్ దాఖలు చేశారు. శివరమకృష్ణన్ కమిటీ నివేదిక ప్రకారం రాజధాని ఖరారు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ  పిటీషన్ ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని, దీన్ని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ పైనా ఒకే సారి విచారణ జరగనుంది. 

మూడు  రాజధానుల అంశం ఏపీలో రాజకీయంగా కలకలం రేపుతోంది. గత గత ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని ఖరారు చేసింది. ప్రస్తుత సీఎం జగన్ అప్పట్లో ప్రతిపక్ష నేతగా .. అమరావతిని స్వాగతించారు. ఎన్నికల ప్రచారంలోనూ అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత  మూడు రాజధానులని ప్రకటించారు. ఇప్పుడు విశాఖ రాజధానిగా చెబుతున్నారు. 29వేల మంది రైతుల భవిష్యత్ తో సుప్రీంకోర్టు తీర్పు ముడి పడి ఉండటంతో...  అందరి దృష్టి సుప్రీంకోర్టు వైపు ఉంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: త్వరలో అమరావతి గెజిట్ -  సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం -  రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
త్వరలో అమరావతి గెజిట్ - సమస్యలు 6 నెలల్లో పరిష్కరిస్తాం - రైతులకు కేంద్రమంత్రి పెమ్మసాని హామీ
India vs South Africa 2nd TestHighlights: మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
మూడో సెషన్లో టీమిండియా కం బ్యాక్.. ఫలించిన కొత్త బంతి వ్యూహం.. మెరిసిన కుల్దీప్ యాదవ్
Maoists surrender: మావోయిస్టులకు  మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ - తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది లొంగుబాటు !
Nagarjuna Akkineni: అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
అన్నపూర్ణకు డిప్యూటీ సీఎం... తెలంగాణ అభివృద్ధికి నాగార్జున సాయం కోరిన బట్టి
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Mangli Bayilone Ballipalike Song : మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
మంగ్లీ 'బాయిలోనే బల్లి పలికే' ఫుల్ సాంగ్ - ట్రెండింగ్ ఫోక్ లిరిక్స్ చూశారా?
Byju Ravindran: బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్  - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
బైజూస్ రవీంద్రన్‌కు అమెరికా కోర్టు భారీ షాక్ - అప్పులోళ్లకు 1 బిలియన్ డాలర్లు వెంటనే చెల్లించాలని ఆదేశం
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
Embed widget