అన్వేషించండి

AP Govt Vs Ragurama : ఎంపీ లాడ్స్ నిధులతో చర్చిల నిర్మాణమా ? రఘురామ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగిన కేంద్రం !

బాపట్ల ఎంపీ తన ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చి నిర్మాణానికి ఇచ్చారన్న ఫిర్యాదుపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. ఈ ఫిర్యాదును రఘురామకృష్ణరాజు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ ఎంపీ లాడ్స్ నిధులను మత సంబంధిత కార్యక్రమాలకు వాడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. లేఖతో పాటు రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదును కూడా జత చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
AP Govt Vs Ragurama :  ఎంపీ లాడ్స్ నిధులతో చర్చిల నిర్మాణమా ? రఘురామ ఫిర్యాదుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగిన కేంద్రం !

Also Read : పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !

ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులను కేటాయిస్తుంది. ప్రతి ఏడాది ఈ నిధులను ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చు. అయితే ఈ నిధులను ఉపయోగించాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అభివృద్ధి పేరుతో చర్చిల నిర్మాణానికి ఇవ్వకూడదు. ఇలా బాపట్ల నియోజకవర్గంలో ఎంపీ చర్చిల నిర్మాణానికి ఎంపీ లాడ్స్ ఇచ్చారని రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 

Also Read : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఓపెన్ ఛాలెంజ్... అలా చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం...!

ఎంపీ లాడ్స్ నిధులు నేరుగా ఎంపీ ఖాతాకు జమ కావు. రాష్ట్ర ప్రణాళిక విభాగం తరపున మంజూరు అవుతాయి. ఈ కారమంగా రఘురామ ఫిర్యాదు మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించి రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి లేఖ పంపింది. ఎంపీలకు కేటాయించిన నిధులతో బాపట్లలో చర్చికి రూ.86 లక్షలు ఖర్చు చేశారన్న  ఫిర్యాదుపై పూర్తి స్థాయి వివరాలు పంపాలని కోరింది. చాలాచోట్ల ఇదే తరహాలో ఖర్చు చేశారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో  రాష్ట్ర స్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులనూ ఈ అంశంపై వివరణ అడిగింది. 

 Also Read: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం

ఎంపీ లాడ్స్ నిధులు మత సంస్థలకు ఖర్చు చేయరాదని..మత సంస్థల పునర్నిర్మాణం, మరమ్మతుకూ వాడకూడదని నిబంధనలు  స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని కేంద్ర గణాంక శాఖ స్పష్టం చేసింది. ఇలా ఖర్చు చేసి ఉన్నట్లయితే సదరు ఎంపీపై చర్యలు తీసుకుని నిధులను రికవరీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణను బట్టి తదుపరి కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో చర్చిలకు ప్రభుత్వ పరంగా నిధులు ఖర్చు పెడుతున్నారని కొంత కాలంగా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణ రాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది. 

Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on PM Modi | రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్న రేవంత్ రెడ్డి | ABPPawan Kalyan From Pithapuram | Public Opinion | పిఠాపురం గుండె చప్పుడు ఏంటీ..? | ABP DesamPithapuram MLA Candidate Tamanna Simhadri | పవన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్ తమన్నాను దింపింది ఎవరు.?Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Embed widget