అన్వేషించండి

Central Ministers: కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తెలుగు రాష్ట్రాల ఎంపీలు - లక్ష్యాలు నెరవేరుస్తామన్న కేంద్ర మంత్రులు

Telugu States MPs: తెలుగు రాష్ట్రాల ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారికి అధికారులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Telugu States Mps Takes Charge As Central Ministers: తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఢిల్లీలోని వారి వారి ఛాంబర్లలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు (Rammohan) పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు, తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (KishanReddy) కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంత్రులకు అధికారులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా రామ్మోహన్ నాయుడు రికార్డు సృష్టించారు. అటు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎలాంటి ఆడంబరం లేకుండా సాదాసీదాగా బాధ్యతలు స్వీకరించారు.

భోగాపురం ఎయిర్ పోర్టుపై

కేబినెట్‌లో అత్యంత చిన్న వయసులో నాపై ప్రధాని మోదీ తనపై బాధ్యత పెట్టారని.. ఇది యువతపై ప్రధానికి ఉన్న నమ్మకం అని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిరాజు హయాంలో ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు పునాది పడిందని.. గత ఐదేళ్లలో అక్కడ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు పూర్తి చేసి విమానాలను ల్యాండ్ చేస్తాం. 'పౌర విమానయాన శాఖ ఇచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నాం. సాంకేతిక వినియోగంతో పౌర విమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. సామాన్యుడికి ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ తీసుకువస్తాం. ప్రయాణికునికి భద్రత, సౌకర్యంగా ఉండేలా చూస్తాం. ఎయిర్‌పోర్టులను పర్యావరణ హితంగాచేయడానికి చర్యలు చేపడతాం. సామాన్య ప్రయాణికుడికి విమానయానం అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తాం. టైర్ 2, టైర్ 3 నగరాలకు విమానాశ్రయాలు తీసుకొస్తాం. రాజమహేంద్రవరం, కడప, కర్నూలు ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి అక్కడ విమానయాన శాఖ కార్యక్రమాలు ప్రోత్సహిస్తాం.' అని రామ్మోహన్ పేర్కొన్నారు.

'బొగ్గు ఉత్పత్తి పెంచుతాం'

మరోవైపు, తెలంగాణకు చెందిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి (Kishan Reddy) కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా గురువారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. 'అన్ని రాష్ట్రాల్లో గత పదేళ్లలో ప్రధాని మోదీ విద్యుత్​ కొరతకు చెక్​ పెట్టారు. ఆయన నాయకత్వంలో గత పదేళ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరెంట్​ వస్తోంది. దానికి ప్రధానమైన కారణం.. బొగ్గు. దీని ద్వారానే ఈ రోజు ఎక్కువ శాతం విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేలా దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్​ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తాం. అధికారులందరితో కలిసి టీమ్​ వర్క్​‌తో పనిచేసి భారత్​‌ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తా.' అని కిషన్ రెడ్డి తెలిపారు.

కేంద్ర మంత్రిగా బండి సంజయ్

అటు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగద్గురు శంకరాచార్య, హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయనకు సహచర మంత్రులు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Target KCR : కేసీఆర్ చుట్టూ కేసులు, విచారణల వల - బీఆర్ఎస్‌కు మరింత గడ్డు కాలం తప్పదా ?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget