Breaking News: దసరా తర్వాతే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలు... ఈసీ స్పష్టం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఈ నెల 21 లేదా 22 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయిదు లేదా ఏడు రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఇంకా రావాల్సిఉంది. ఈ నెలలో అసెంబ్లీ సమావేశాల్లోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికలు నిర్వహించాలని పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 11 ఎమ్మెల్సీల ఖాళీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. రాజకీయ సమ్మేళనం..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. రాజకీయ సమ్మేళనం అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. వైఎస్ సేవలు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఏపీ సీఎం జగన్, షర్మిల ఎదిగిన కాంగ్రెస్ కొమ్మని నరకాలని చూస్తున్నారని విమర్శించారు. తండ్రి ఆత్మీయ సమ్మేళనానికి రాని కొడుకు ఉంటాడా? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ బతికి ఉంటే విజయమ్మ తెలంగాణకు వచ్చేవారు కాదని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని సమర్థిస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లాలని అనుకుంటే వెళ్లండి కానీ వెన్నుపోటు పొడవద్దని హితవు పలికారు.
ఊడిన రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు.. తప్పిన ముప్పు
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో శనివారం పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్ బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 30 మంది ప్రయాణీకులున్నారు.






















