అన్వేషించండి

Raghurama : ఇకపై జగన్‌పై మాట్లాడను - రఘురామ కీలక వ్యాఖ్యలు

Andhra Politics : జగన్ గురించి ఇక వ్యక్తిగతంగా మాట్లాడబోనని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ ను ప్రజలు పట్టించుకోవడం లేదని ప్రజల దృష్టి తమపై ఉందన్నారు.

TDP MLA Raghuramakrishna Raju  :  మాజీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను జగన్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడబోనని ప్రకటించారు. భీమవరంలో మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీగా మారినప్పటి నుండి రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై విమర్శలు గుప్పించేవారు. ఇప్పుడు హఠాత్తుగా ఇకపై జగన్ గురించి మాట్లాడబోనని ఆయన ప్రకటించడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే దీనికి ఆయన తన వివరణ ఇచ్చారు. 

జగన్ మా మంచో చెడో చేయాల్సింది చేశాడు వెళ్లిపోయాడని ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరన్నారు. ప్రజల దృష్టి ఇప్పుడు టీడీపీ పాలనపై ఉంటుందన్నారు. హామీలను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారని  అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.  జగన్ పై కానీ, వైసీపీ పైన కానీ ప్రజల దృష్టి ఉండదన్నారు. తాను మళ్లీ విమర్శలు చేస్తే ప్రజల దృష్టి అటు మళ్లుతుందని.. అలా  ఉండకూడదు రఘురామ స్పష్టం చేశారు.  ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు, బాధ్యతను కట్టబెట్టారని  చంద్రబాబు చెప్పారని రఘురామ గుర్తు చేసుకున్నారు.  

ఎమ్మెల్సీలతో జగన్ భేటీ - మండలిలో టీడీపీకి చుక్కలు చూపించాలని సూచన !

టీడీపీ నేతలు దాడులు  చేయవద్దని..  తప్పు చేసిన వాళ్లను చట్టప్రకారం శిక్షించాలన్నారని చంద్రబాబు చెప్పారని రఘురామ అన్నారు.  అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.  ఆసుపత్రి నివేదిక ప్రకారం తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. అలాంటిది నాను నేనే న్యాయం చేసుకోకుంటే సామాన్యులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతుందని  దీనిని దృష్టిలో ఉంచుకునే పోలీసులకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు.  ఒకటి రెండు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుందని  ఆశాభావం  వ్యక్తం చేశారు.  ఈ విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి సూచనల మేరకో తాను ఫిర్యాదు చేయలేదన్నారు.                                            

దటీజ్ చంద్రబాబు - వైసీపీ అధినేత జగన్‌కు, ఏపీ సీఎంకు ఎంత తేడా?

ఏపీలో హింస జరుగుతోందని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను కూడా రఘురామ కొట్టి పడేశారు.  ఇద్దరు వ్యక్తలు కొట్టుకుంటే దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి చంపేస్తూన్నారని హడావిడి చేస్తున్నారని విమర్శించారు. పందాలు కాసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని.. దానిని వైసీపీ ప్రభుత్వం రాలేదని చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఈ ఆత్మహత్యలకు జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి విజయంలో  క్షత్రియుల పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు. క్షత్రియులకు ఎవరో ఒకరికి ఎదో ఒక పదవి ఇస్తారని అనుకుంటున్నానని రఘురామ నమ్మకం వ్యక్తం చేశారు.                

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
Tirumala News: పిల్లల్ని కారులో పెట్టి లాక్ చేసిన పెద్దలు - ఘోరం జరిగిపోయేదే - తిరుమలలో దేవుడే కాపాడాడు !
పిల్లల్ని కారులో పెట్టి లాక్ చేసిన పెద్దలు - ఘోరం జరిగిపోయేదే - తిరుమలలో దేవుడే కాపాడాడు !
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై KTR ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై KTR ఒత్తిడి!
Tesla Car: భారతీయ రోడ్లపై టెస్లా ప్రత్యక్షం, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలక్ట్రిక్ కారు ట్రయల్‌ రన్‌
భారతీయ రోడ్లపై టెస్లా ప్రత్యక్షం, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలక్ట్రిక్ కారు ట్రయల్‌ రన్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి -   మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
సీఐడీ ఎదుటకు సాక్షిగా విజయసాయిరెడ్డి - మధ్యాహ్నం 2 గంటలకు హాజరు - మొత్తం చెప్పేస్తారా?
Tirumala News: పిల్లల్ని కారులో పెట్టి లాక్ చేసిన పెద్దలు - ఘోరం జరిగిపోయేదే - తిరుమలలో దేవుడే కాపాడాడు !
పిల్లల్ని కారులో పెట్టి లాక్ చేసిన పెద్దలు - ఘోరం జరిగిపోయేదే - తిరుమలలో దేవుడే కాపాడాడు !
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై KTR ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై KTR ఒత్తిడి!
Tesla Car: భారతీయ రోడ్లపై టెస్లా ప్రత్యక్షం, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలక్ట్రిక్ కారు ట్రయల్‌ రన్‌
భారతీయ రోడ్లపై టెస్లా ప్రత్యక్షం, ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఎలక్ట్రిక్ కారు ట్రయల్‌ రన్‌
Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
Arjun Son Of Vyjayanthi Review - 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రివ్యూ: కమర్షియల్ టెంప్లేట్‌లో తీసిన సినిమా... మదర్ & సన్‌ సెంటిమెంట్ హిట్ ఇస్తుందా?
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రివ్యూ: కమర్షియల్ టెంప్లేట్‌లో తీసిన సినిమా... మదర్ & సన్‌ సెంటిమెంట్ హిట్ ఇస్తుందా?
Kesari Chapter 2 Reaction: కేసరి చాప్టర్ 2 రిలీజ్ - ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా?
కేసరి చాప్టర్ 2 రిలీజ్ - ప్రేక్షకులకు అక్షయ్ కుమార్ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా?
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
Embed widget