అన్వేషించండి

AP CM Chandrababu: దటీజ్ చంద్రబాబు - వైసీపీ అధినేత జగన్‌కు, ఏపీ సీఎంకు ఎంత తేడా? టీడీపీ పోస్ట్ వైరల్

Andhra Pradesh News: స్కూల్ విద్యార్థులకు అందించే జగనన్న విద్యార్థి కానుకలో మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్నా అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని తెలుగుదేశం పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Chandrababu ordered to distribute school children kits with Jagan picture on it | అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరొస్తుందని, వైఎస్ జగన్ తన హయాంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టే  అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృథా అవకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. 

ప్రజాధనం వృధా అవకూడదని ఆలోచించే చంద్రబాబుకు, మాజీ సీఎం చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందని టీడీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. తన పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని, పగ ప్రతీకారాలకు తావులేదని, తుగ్లక్ నిర్ణయాలు అసలే ఉండవని చంద్రబాబు చెప్పారు. తాను చెప్పిన మాట మేరకు.. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడని భావించి జగన్ బొమ్మ ఉన్న స్కూల్  కిట్స్ ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారని పేర్కొంటూ ఓ న్యూస్ క్లిప్‌ను టీడీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

AP CM Chandrababu: దటీజ్ చంద్రబాబు - వైసీపీ అధినేత జగన్‌కు, ఏపీ సీఎంకు ఎంత తేడా? టీడీపీ పోస్ట్ వైరల్

ముగిసిన సెలవులు, ఇక స్కూల్స్ రీఓపెన్

వేసవి సెలవులు ముగిసి, ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు జూన్ 13న తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో స్కూల్ విద్యార్థులకు అమలవుతోన్న పథకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో తీసేశారు. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తెలిసిందే. ఆఖరికి  పిల్లలకిచ్చే చిక్కీపై సైతం అప్పటి సీఎం జగన్ బొమ్మ వేయించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. గత ప్రభుత్వ పథకాలు కొన్ని రద్దు చేయడంతో పాటు మరికొన్ని పథకాలకు ముందు వైఎస్సార్ పేరు, జగనన్న అని పేర్లు చేర్చారు.  

వైసీపీ సర్కార్ అమలు చేసిన రెండు పథకాలకు జగన్ పేరును తొలగించాలని కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై జగన్ బొమ్మలకు సైతం స్వస్తి పలకాలని సూచించారు. స్కూల్ విద్యార్థులకు సంబంధించిన సామాగ్రిని అందజేసే స్కీమ్ ‘జగనన్న విద్యార్థి కానుక’. ఈ జగనన్న స్కూల్ కిట్‌లో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, బుక్స్, బెల్టు, షూస్, సాక్సులు, యూనిఫాం ఇస్తారని తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం జగనన్న విద్యార్థి కానుక పేరును ‘స్టూడెంట్ కిట్’ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. సర్వ శిక్షా అభియాన్ ఇప్పటికే దీనిపై మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. 

ఇకనుంచి గోరుముద్ద పథకం 
గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ‘జగనన్న గోరుముద్ద’ లో సైతం టీడీపీ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రభుత్వం పనిచేయాలి కానీ మన పేరును ప్రతి విషయాల్లోనూ తగిలించకూడదని భావించి ఈ పథకం నుంచి ‘జగనన్న’ అనే పదాన్ని తొలగించారు. ఇక నుంచి విద్యార్థులకు ఆదివారం తప్పా, మిగతా 6 రోజులు గుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించే పథకాన్ని ‘గోరుముద్ద’గా వ్యవహరించరున్నారు. విద్యార్థులకు అందించే చిక్కీ మీది కవర్ పై మాజీ సీఎం జగన్ బొమ్మ ఉండేది. జగన్ ఫొటో తొలగించి, ఏపీ ప్రభుత్వ రాజముద్రతో పిల్లలకు చిక్కీలు సరఫరా కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget