అన్వేషించండి

JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Anantapuram News: రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. త్రీ వీలర్స్ నిషేధించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

JC Prabhakar Reddy Comments On Three Wheelers: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. వాటిని నిషేధించాలని అన్నారు. మైనర్లు, డ్రైవర్లు మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయితే వాటిపై అధికారులు కన్నెతి చూడడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తారని మండిపడ్డారు. అనంతపురం (Anantapuram) జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతదేహాలను ఆయన పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

ఘోర ప్రమాదంలో 8 మంది మృతి

కాగా, అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు శనివారం ఉదయం గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని ఆటోలో తిరుగు పయనమవుతుండగా.. ఆటో తలగాసిపల్లి సమీపంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆటోలో పరిమితికి మించి కూలీలను తరలిస్తుండగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అటు, ఘటన జరిగిన ప్రాంతంలో వేగ నిరోధకాలు ఉన్నా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

శోకసంద్రమైన గ్రామం

మరోవైపు, ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. పోస్టుమార్టం  అనంతరం మృతదేహాలను ఆదివారం గ్రామానికి తరలించారు. అధికారులు, పోలీసులు స్వగ్రామానికి వెళ్లారు. మృతదేహాలను ఒక్కసారిగా గ్రామంలోకి తీసుకురావడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు, రోడ్డు ప్రమాద ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో ఉరవకొండ పీఎస్ క్రీడా మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటోలకు జరిమానా విధించారు.

రోడ్డు ప్రమాద ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిందన్నారు. మృతి చెందిన కుటుంబంలోని పిల్లల చదువులకు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Divvela Madhuri: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
అమరావతిలో వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం చేసి, ప్రారంభించిన మంత్రి నారాయణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Palnadu Double Murder: ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
ఇద్దరు అన్నదమ్ములను వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు.. పల్నాడులో దారుణం
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం
Bigg Boss 9 Emmanuel: చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
చేజేతులా బిగ్ బాస్ టైటిల్ పోగొట్టుకున్న ఇమ్మానుయేల్.. ఎక్కడ పొరబాటు చేశాడంటే..!
Ramya Krishnan : తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
తలైవాతో నీలాంబరి - 'నరసింహ' మూవీలో ఐకానిక్ సీన్... థియేటర్‌లో ఎంజాయ్ చేసిన రమ్యకృష్ణ
Christmas 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ ట్రెడీషన్స్ ఇవే.. ఇండియాలో ఇవి బాగా హైలెట్​ అయ్యాయి, ఎందుకంటే
Embed widget