అన్వేషించండి

JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Anantapuram News: రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. త్రీ వీలర్స్ నిషేధించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించారు.

JC Prabhakar Reddy Comments On Three Wheelers: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలేనని.. వాటిని నిషేధించాలని అన్నారు. మైనర్లు, డ్రైవర్లు మద్యం మత్తులోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అయితే వాటిపై అధికారులు కన్నెతి చూడడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రెండు రోజులు హడావుడి చేసి వదిలేస్తారని మండిపడ్డారు. అనంతపురం (Anantapuram) జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతదేహాలను ఆయన పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సరిపోదని.. బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

ఘోర ప్రమాదంలో 8 మంది మృతి

కాగా, అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు శనివారం ఉదయం గార్లదిన్నె మండలం తిమ్మంపేటలోని ఓ అరటి తోటలో పనికి వెళ్లారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో పనులు ముగించుకుని ఆటోలో తిరుగు పయనమవుతుండగా.. ఆటో తలగాసిపల్లి సమీపంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిని దాటుతుండగా ప్రమాదానికి గురైంది. ధర్మవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొనగా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఆటోలో పరిమితికి మించి కూలీలను తరలిస్తుండగా ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది. అటు, ఘటన జరిగిన ప్రాంతంలో వేగ నిరోధకాలు ఉన్నా బస్సు డ్రైవర్ బ్రేక్ వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

శోకసంద్రమైన గ్రామం

మరోవైపు, ఈ ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన 8 మంది మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. పోస్టుమార్టం  అనంతరం మృతదేహాలను ఆదివారం గ్రామానికి తరలించారు. అధికారులు, పోలీసులు స్వగ్రామానికి వెళ్లారు. మృతదేహాలను ఒక్కసారిగా గ్రామంలోకి తీసుకురావడంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు, రోడ్డు ప్రమాద ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ ఆదేశాలతో ఉరవకొండ పీఎస్ క్రీడా మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక లోడుతో వెళ్తున్న ఆటోలకు జరిమానా విధించారు.

రోడ్డు ప్రమాద ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిందన్నారు. మృతి చెందిన కుటుంబంలోని పిల్లల చదువులకు బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read: Divvela Madhuri: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Effect On Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
విశాఖ ఉక్కుకు ఇరాన్‌ వార్‌ సెగ! పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ మూతపడుతుందా? 
Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
US Donald Trump: భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
భారత్‌, చైనాతో సహా 16 దేశాలపై మరోసారి ఫోకస్ చేసిన ట్రంప్! సుంకాలు విధించేందుకు దర్యాప్తు ప్రారంభం!
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ రివ్యూ... పవన్ సినిమా టాకేంటి?
TDP MLAs: భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
భారీ మెజార్టీనే టీడీపీకి సమస్య- దారి తప్పిన ఎమ్మెల్యేలు - చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారా?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్
Curd Poha: పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
పొయ్యి వెలిగించకుండా చిటికెలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఇదే! రుచి, ఆరోగ్యం, ఆదాయం మూడు గుణాల అటుకుల పెరుగు!
Embed widget