అన్వేషించండి

Andhra Volunteers: వలంటీర్లను పూర్తిగా రోడ్డున పడేసిన ఏపీ ప్రభుత్వం - రూ. 10వేలు చేస్తామన్న హామీ చెత్తబుట్టలోకే - జగనూ సైలెంట్ !

TDP promise: ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ ఓ సంచలనం. టీడీపీ వచ్చాక పూర్తిగా తీసేశారు.కానీ కొనసాగిస్తామని నెలకు పదివేలు ఇస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వైసీపీ ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.
  • వాలంటీర్లపై వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని టీడీపీ ఆరోపించింది.
  • టీడీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను కొనసాగించలేదు.
  • వాలంటీర్ల కాంట్రాక్ట్ గడువు వైసీపీ పాలనలోనే ముగిసింది.

TDP  volunteers promise: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ తెచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఓ సంచలనం. పూర్తిగా యాభై ఇళ్లకు ప్రభుత్వం తరపున అధికార పార్టీ ప్రతినిధిగా వాలంటీర్ వ్యవహరించేవారు. అనేక సార్లు వివాదాస్పదమయింది.ఆ వాలంటీర్లు వైసీపీకి ఓట్లేసేలా ఓటర్లను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.  చివరికి ఇప్పుడు వాలంటీర్లు లేరు. ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు. కానీ గత ప్రభుత్వంలోనే వారి గడువు ముగిసిపోయింది. మళ్లీ కొనసాగిస్తూ జీవో జారీ చేయలేదు. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు వారిని ఉద్యోగాల నుంచి తీసేయబోమని ..పదివేలు జీతం ఇస్తామని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు వారికి అన్యాయం జరుగుతోంది. 

యాభై ఇళ్లకో వాలంటీర్ ను ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం 

 ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రామ/వర్డ్ వాలంటీర్లు' వ్యవస్థ ప్రతి 50 ఇళ్లకు   ఒక వాలంటీర్‌ను కవర్ చేసేలా రూపొందించారు.  2019లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ వ్యవస్థ, ప్రభుత్వ సేవలు డోర్‌ డెలివరీ కోసమని ప్రకటించారు.  అయితే పార్టీ పనులు, కుటుంబాల సమాచారం ఎక్కువగా సేకరించారని ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లు హాట్ టాపిక్ అయ్యారు. ఆ సమయంలో ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకుండా వారిని తప్పించారు. ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు..  టీడీపీ వస్తే వాలంటీర్లను తీసేయబోమని జీతం పెంచుతామని..  వారికి యాభై వేల వరకూ సంపాదించుకోవడానికి ఉపాధి చూపిస్తామని ప్రకటించారు. కానీ టీడీపీ గెలిచిన తర్వాత అసలు వాలంటీర్లను పట్టించుకోలేదు. 

వారంతా వైసీపీ కార్యకర్తలు కావడంతో టీడీపీకి వ్యతిరేకత

వాలంటీర్లు అందరూ వైసీపీకి  ప్రైవేటు సైన్యంలా పనిచేశారని టీడీపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. వాలంటీర్లు అంతా తమ పార్టీ వారేనని వైసీపీ నేతలు చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో మెజార్టీ వాలంటీర్లు అందరికీ ఐదు వేలు పార్టీ తరపున ఇచ్చారు.  టీడీపీ వస్తే వాలంటీర్లు ఉండరని అంటున్నారు.   ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నించారు. వారిని కొనసాగించడం అంటే.. వైసీపీ కార్యకర్తలకు ప్రజల్ని అప్పగించడమేనని అనుకున్నారు. అందుకే ముందుగా ఇచ్చిన హామీని కూడా పట్టించుకోకుండా.. వాలంటీర్లను పక్కన పెట్టేశారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో వారు చేయించే పనులు చేస్తున్నారు. 

జగన్ హయాంలోనే ముగిసిపోయిన వాలంటీర్ల కాంట్రాక్ట్

ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో వాలంటీర్లపై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. వారిని తీసేశారని మండిపడింది. కానీ  ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చే సరికే వాలంటీర్లు ఎవరూ లేరని తమ ప్రభుత్వం ఎవరినీ తొలగించలేదని శాసనండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. వారి నియామక ఉత్తర్వులకు సంబంధించిన సమయం ముగిసిపోయినా వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు.  పొడిగింపు కోసం గత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో ఎవరూ అధికారికంగా వాలంటీర్లుగా లేరు. దాంతో ప్రభుత్వం కూడా వారిని కొనసాగించలేదు. 

పట్టించుకోని వైసీపీ - వాలంటీర్ల వల్లే ఓడిపోయామన్న భావన 

వాలంటీర్ల దురదృష్టం ఏమిటంటే.. వారి కోసం వైసీపీ కూడా పోరాడటం లేదు. ప్రభుత్వం వాలంటీర్లను కొనసాగించలేదు. వారికి తమ మద్దతు ఉంటుందని వైసీపీ నేతలు కూడా చెప్పడం లేదు. వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు  చాలా ఆశలు చూపించారు.  రాజకీయ నేతల్ని చేస్తానన్నారు.  ఇతర పనులు చేయకుండా ఐదు సంవత్సరాల పాటు వాలంటీర్లుగా పని చేయడం వల్ల..  జీవితంలో ఎదిగే అవకాశాన్ని కోల్పోయారు. మరి ఇప్పుడు వారి కోసం  వైసీపీ  మాట్లాడటం లేదు. అదే సమయంలో చాలా మంది వైసీపీ నేతలు..  తాము  వాలంటీర్ల వల్లే ఓడిపోయామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తాము వస్తే మళ్లీ వాలంటీర్లవ్యవస్థ తెస్తామని చెప్పలేకపోతున్నారు.అందుకే వారికి రెండు పార్టీల వైపు నుంచి అన్యాయం జరుగుతోంది.  


 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget