అన్వేషించండి

Chandrababu: ప్రజల డేటా ప్రైవేటు సంస్థలకు, ఈసీకి అన్ని ఆధారాలు ఇచ్చాం, హైలెవల్ కమిటీ కోరాం - ఢిల్లీలో చంద్రబాబు

అధికార వైఎస్ఆర్ సీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నికల యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయడానికి వీలుపడడం లేదని చంద్రబాబు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్‌ని కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా చంద్రబాబు సోమవారం (ఆగస్టు 28) మధ్యాహ్నం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలిశారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అధికార వైఎస్ఆర్ సీపీ నాయకుల రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎన్నికల యంత్రాంగం స్వతంత్రంగా పనిచేయడానికి వీలుపడడం లేదని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను విడుదల చేయడానికి ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించాలని కోరారు. 2024లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఈసీ తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇప్పటికే 60 లక్షలకు పైగా ఓట్లను వైఎస్ఆర్‌ సీపీ నేతలు తొలగించారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ సీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఓట్లను తొలగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

హైలెవల్ కమిటీ వేయాలని కోరాం - చంద్రబాబు

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ మొత్తం ఏపీకి వచ్చి పరిస్థితులను పరిశీలించాలని ఈసీని కోరినట్లుగా చెప్పారు. తాము ఇచ్చిన డేటాను విశ్లేషించి, ఎన్నికలు సజావుగా జరిగేలా ఎలాంటి మోసం జరిగేందుకు వీలు లేని ఒక మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా చంద్రబాబు వివరించారు. ‘‘అవసరమైతే హైపవర్ కమిటీని, వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను ఏర్పాటు చేయాలని సూచించాం. రిమోట్ టెక్నాలజీ ద్వారా ఓట్లను తొలగిస్తున్నారు. బోగస్ ఓట్లు చేరుస్తున్నారు. ఈ డేటా అంతా ప్యూరిఫై అయ్యాకే ఎన్నికలకు పోవాలని తేల్చి చెప్పాం. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. ఓటర్ల పేర్లు, డోర్ నెంబర్లు, గ్రామాల వివరాలను ఈసీకి అందించాం. వ్యక్తిగత డేటాను వాలంటీర్లకు ఇస్తున్న విషయాన్ని వారికి చెప్పాం. ఓటర్ల వ్యక్తిగత డేటాను ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు’’ అని చంద్రబాబు మాట్లాడారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి సరికొత్త ప్రతిపాదన పెట్టానని చంద్రబాబు అన్నారు. ఆధార్ కార్డును ఓటర్ కార్డును అనుసంధానించాలని ఆయన ఈసీని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆధార్ కార్డును ఓటర్ కార్డును అనుసంధానిస్తే తాను సంతోషిస్తానని మీడియాతో చంద్రబాబు అన్నారు. తద్వారా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని, నకిలీ ఓట్లను నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఒక పార్టీ ఓట్లను తొలగించాలన్న అలోచన, ఇంతవరకు ఏ పార్టీకి రాలేదని అన్నారు. వైసీపీ చాలా దారుణాలు చేసిందని, వాటన్నింటిని సాక్ష్యాధారాలతో ఈసీకి సమర్పించామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడిచేసి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారని తెలిపారు. టీడీపీ ఓట్లను భారీ ఎత్తున తొలగించారన్న చంద్రబాబు.. ఓటర్ల జాబితాలో వైసీపీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.

మరోవైపు, చంద్రబాబు ఫిర్యాదుకు పోటీగా వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా సీఈసీని కలవనున్నారు. చంద్రబాబు హాయాంలోనే నకిలీ ఓటర్లను చేర్చారని వాటిని తొలగిస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. అవన్నీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే చేర్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget