అన్వేషించండి

CM Jagan Review : కరవు ప్రాంతాల్లో చెరువులు కాల్వలతో అనుసంధానం-సీఎం జగన్

CM Jagan Review : రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వలతో అనుసంధానం చేయాలని సీఎం జగన్ సూచించారు.

CM Jagan Review : ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్‌టర్నెల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్స్‌(EAP)పై సీఎం జగన్ శుక్రవారం సమీక్షించారు.  న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో- ఆపరేషన్‌ ఏజెన్సీ, ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల ఆర్థికసాయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులను సీఎం జగన్ సమీక్షించారు. మొత్తం 10 ప్రాజెక్టులకు రూ. 25,497.28 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.  ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ఈఏపీ ప్రాజెక్టులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని కరవు ప్రాంతాల్లో చెరువులను కాల్వలతో అనుసంధానం చేయాలని సూచించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.  

చెరువులు కాల్వలతో అనుసంధానం 

అవసరమైన చోట చెరువులు లేకపోతే కొత్త చెరువులు తవ్వాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు అందేలా కాల్వలతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. చెరువుల నిర్మాణంతో భూగర్భజలాలు పెరుగుతాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. చెరువు కింద చక్కగా భూములు సాగు అవుతుందని, వ్యవసాయం అభివృద్ధి చెందితే ఉపాధి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయన్నారు. ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల సాయంతో ఇలాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. 

పోర్టుల వద్ద ల్యాండ్ బ్యాంక్ 
 
పనులు మధ్యలో నిలిచిపోయిన బ్రిడ్జ్ లు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీల పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో మూడు పోర్టులు నిర్మిస్తున్నామని, ఈ పోర్టుల చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పోర్టుల పరిధిలో ల్యాండ్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోర్టు ఆధారితంగా అభివృద్ధి జరుగుతుందని అధికారులతో సీఎం జగన్‌ అన్నారు. 

ఈ నెల 22న కుప్పం పర్యటన 

సీఎం జగన్ ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ... ముందుగా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను లక్ష్యంగా చేసుకుంది. కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం సీటు సాధించాలనే పట్టుదలతో ఉంది. చంద్రబాబు స్థానాన్ని కైవసం చేసుకుంటే టీడీపీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థి భరత్ ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని సీఎం జగన్ ప్రకటించేశారు. ఈ పరిస్థితుల మధ్య సీఎం హోదాలో తొలిసారి కుప్పం పర్యటనకు వెళ్తుండడంపై ఈ పర్యటనపై సర్వత్రా ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల చంద్రబాబు పర్యటనలో కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. అన్న క్యాంటీన్ ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయగా, వైసీపీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. 

Also Read : Minister Gudivada Amarnath : ఏ క్షణంలోనైనా విశాఖ నుంచి పాలన, మూడు రాజధానులపై కొత్త బిల్లు- మంత్రి గుడివాడ అమర్ నాథ్

Also Read : బెజవాడలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్, ఇందులో కీలక పాత్ర ఆయనదేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం

వీడియోలు

Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam
రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Samantha Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
భర్త రాజ్ నిడిమోరుతో సమంత... ఈ ఫోటోలు ఇంతకు ముందుకు చూసి ఉండరు
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Nizamabad husband: భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
భార్యకు అక్రమ సంబంధం - న్యాయం చేయాలని భర్త ధర్నా - మగవాళ్లకు ఇలాంటి కష్టాలే వస్తాయా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Embed widget