అన్వేషించండి

TTD Supreme Court : శ్రీవారి పూజల్లో లోపాలంటూ పిటిషన్ -సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు !

పూజాధికాల విషయంలో టీటీడీ తప్పులు చేస్తే శ్రీవెంకటేశ్వరుడు క్షమించరని సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం పూజాధికాలు నిర్వహించలేదంటూ ఓ భక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి నిర్వహిస్తున్న వివిధ రకాల సేవలు ఆగమ శాస్త్రం ప్రకారం జరగడం లేదంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవారి భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో హిందూయేతరుల నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలన్న నిబంధనలను పాటించడం లేదని కూడా పేర్కొన్నారు. పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వచ్చింది. వెంటనే కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని పిటిషనర్‌ బెంచ్‌ను కోరారు. అయితే ఈ అంశంపై చీఫ్ జస్టిస్ పిటిషనర్‌తో తెలుగులో మాట్లాడారు.  టీటీడీలో తప్పులు జరిగితే వేంకటేశ్వరస్వామి ఎవరినీ ఉపేక్షించరని వ్యాఖ్యానించారు.

Also Read :  అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... ఈ ఏడాది ఏకాంతంగానే సేవలు..

" మీరు వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఓపిగ్గా ఉండాలి. ప్రతి రోజూ పిటీషన్‌ను లిస్ట్‌ చేయమని రిజిస్ట్రీపై ఒత్తిడి తీసుకురాకూడదు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా బాలాజీ భక్తులమే''నని చెప్పారు. పిటీషన్‌ను వచ్చే బుధవారం లిస్ట్‌ చేస్తూ.. ఫిర్యాదుపై స్పందించాలని  తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఆదేశించారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో కొట్టి వేయడంతో సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్‌లో హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్‌పై అప్పట్లో విచారణ జరిగింది. విచారణలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోలేదని.. ఇది తమ పరిధి కాదని అభిప్రాయపడింది. ఆలయంలో జరిగే పూజల ప్రక్రియలో ఎవరూ జోక్యం చేసుకోలేరని వ్యాఖ్యానించింది. 

 Also Read: Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ ఛైర్మన్‌


ఆగమశాస్త్ర నిబంధనల మేరకు తిరుమలలో కైంకర్యాలు జరపడంతో పాటు హిందూయేతరుల నుంచి డిక్లరేషన్‌ తీసుకునేలా టీటీడీని ఆదేశించాలని ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా కోర్టుల్లో పిటిషన్ లు వేస్తున్నారు. పూజాది, ఆర్జితోత్సవాల తీరు సరిగా ఉండటం లేదని పూజలు, ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతున్నారు.  హైకోర్టులో జరిగిన విచారణలో టీటీడీ కమిటీ పూజాదికాల్లోకి జోక్యం చేసుకోదదని తెలిపారు. పురాణాల ప్రకారం స్వామివా రు కొన్ని లక్షల ఏళ్ల క్రితమే అక్కడకు వచ్చారని... అక్కడ పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలో ఆయనే నిర్ణయించారని.. వైఖానస మహర్షి వీటిని గ్రంథాల్లో పొందుపరిచారని ... ఏ కమిటీ వచ్చినా శాస్త్ర ప్రకారం పూజలు జరగాల్సిందేనన్నారు. పిటిషనర్‌ చెబుతున్నట్లుగా ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని వాదించారు. విచారణ తర్వాత పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 

Also Read: TTD Board : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?

ఇప్పుడు ఆ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం పూజలు ఎలా చేస్తారన్న విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అయితే వివరాలు సమర్పించాలని టీటీడీని కోరింది. తుదపరి విచారణ అక్టోబర్ ఆరో తేదీన జరగనుంది. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget