అన్వేషించండి

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాధనాన్ని సాక్షి పత్రిక కొనుగోలు కోసం వాలంటీర్లకు ఇస్తున్నారని ఈనాడు యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది.

 

Supreme Court Notice To CM Jagan :  వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు ఇచ్చి, సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని సుప్రీం కోర్టులో ఈనాడు దినపత్రిక పిటిషన్ దాఖలు చేసింది.  వాలంటీర్లకు పత్రిక కొనుగోలు చేసేందుకు డబ్బులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలిపవేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో ఈనాడు యాజమాన్యం కోరింది.  దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈనాడు యాజమాన్యం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా  ఏ పత్రికను కొనుక్కోవాలనే స్వేచ్చ వ్యక్తికి లేదా అని సీజేఐ ప్రశ్నించారు. అయితే వాలంటీర్లు అందరూ ప్రభుత్వ సపోర్టర్లు అని వారికి పత్రిక కొనుగోలు కోసం ప్రజాధనం ఇవ్వడం ఆర్టికల్ 19(1)(a)ను ఉల్లంఘించినట్లేనని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈనాడు పత్రికపై ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు చేస్తూంటారని ఆ పత్రికను చదవొద్దని పిలుపునిస్తూంటారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పత్రికను కొనుగోలు చేయడానికి రూ. రెండు వందలు ఇవ్వడాన్ని ఎలా వ్యతిరేకిస్తారని సీజేఐ ప్రశ్నించారు. ఈ ధనం అంతా నేరుగా సాక్షి ఖాతాలోకి పోతోందని రోహత్గీ వివరించారు. అయితే ఖచ్చితంగా సాక్షి పేపరే కొంటున్నారని చూపించాలని సీజేఐ రోహత్గీని కోరారు. రోహత్గీ కొన్ని ఆధారాలను సీజేఐ ముందు ఉంచారు. అంటే  ప్రజాధనాన్ని సాక్షి పేపర్ కు ప్రయోజనం కల్పించేందుకు ఉపయోగిస్తున్నారా అని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యాజ్యంలో  సీఎం జగన్‌ను పార్టీగా ఇంప్లిడీ చేయడం ఎందుకని సీజేఐ ప్రశ్నించారు. సాక్షిపత్రికకు సీఎం జగనే ఓనరని రోహత్గీ సీజేఐకి తెలిపారు. దీంతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన సీజేఐ తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది. 

విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే   పేపర్ కొనాలని వలంటీర్లకు నెలకు రూ.200 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ  రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారందరితో బలవంతంగా సాక్షి దినపత్రికనే కొనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ జీవోపై ఈనాడు యాజమాన్యం కొంత కాలం కిందట హైకోర్టులో పిటిషన్ వేసింది.  సీఎం జగన్‌ కుటుంబ యాజమాన్యంలోని ‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకొనేందుకే ఈ జీవోను తెచ్చారని వాదించింది. తనకు ఆర్థిక నష్టం కలిగించే ఆ జీవోను రద్దుచేయడంతోపాటు, ఆ పత్రిక సర్క్యులేషన్‌ను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) పరిగణించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
 
ఫలానా పత్రిక కొనుగోలు చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో వాదించారు.  ప్రభుత్వ పథకాలపై ఉద్యోగులకు అవగాహన పెరగాలనే ఉద్దేశంతో పత్రికల కొనుగోలుకు రూ.200 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.  విస్తృత వినియోగంల  ఉన్న పత్రికను కొనుగోలు చేయాలని మాత్రమే జీవోలో పేర్కొన్నామని..  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ తర్వాత ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది. దీంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు

వీడియోలు

Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MI vs DC Highlights: కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
కెప్టెన్ హర్మన్ ప్రీత్ విధ్వంసం..ఢిల్లీపై 50 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
Hindu Killed in Bangladesh: బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
బంగ్లాదేశ్ లో మరో హిందువు హత్య- తీవ్రంగా కొట్టి, ఆపై విషం తాగాలని బలవంతం చేశారు
Vaa Vaathiyaar Release Date : సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
సంక్రాంతికి 'వా వాతియార్' - కార్తీ కొత్త మూవీ రిలీజ్ డేడ్ ఫిక్స్... అన్నగారు వచ్చేస్తున్నారు...
Bhu Bharati Registration Scam: భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు నమోదు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
భూభారతి రిజిస్ట్రేషన్ అక్రమాలపై కేసు.. సీఎస్ సహా పలువురికి లోకాయుక్త కీలక ఆదేశాలు
Tata Punch Facelift Features: సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
సంక్రాంతి కానుకగా వస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్- మార్పులు చూసి కొనేయండి
Hyderabad Cyber ​​Crime: ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
ట్రేడింగ్ పేరిట రెండున్నర కోట్ల మోసం - నిండా మునిగిన మాజీ ఐపీఎస్ భార్య
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Embed widget