అన్వేషించండి

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజాధనాన్ని సాక్షి పత్రిక కొనుగోలు కోసం వాలంటీర్లకు ఇస్తున్నారని ఈనాడు యాజమాన్యం పిటిషన్ దాఖలు చేసింది.

 

Supreme Court Notice To CM Jagan :  వాలంటీర్లకి నెలకి 200 రూపాయలు ఇచ్చి, సాక్షి పేపర్ని కొనిపించడం అధికార దుర్వినియోగం అని సుప్రీం కోర్టులో ఈనాడు దినపత్రిక పిటిషన్ దాఖలు చేసింది.  వాలంటీర్లకు పత్రిక కొనుగోలు చేసేందుకు డబ్బులు మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలిపవేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో ఈనాడు యాజమాన్యం కోరింది.  దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈనాడు యాజమాన్యం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా  ఏ పత్రికను కొనుక్కోవాలనే స్వేచ్చ వ్యక్తికి లేదా అని సీజేఐ ప్రశ్నించారు. అయితే వాలంటీర్లు అందరూ ప్రభుత్వ సపోర్టర్లు అని వారికి పత్రిక కొనుగోలు కోసం ప్రజాధనం ఇవ్వడం ఆర్టికల్ 19(1)(a)ను ఉల్లంఘించినట్లేనని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈనాడు పత్రికపై ఎల్లో జర్నలిజం అంటూ విమర్శలు చేస్తూంటారని ఆ పత్రికను చదవొద్దని పిలుపునిస్తూంటారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. అయితే పత్రికను కొనుగోలు చేయడానికి రూ. రెండు వందలు ఇవ్వడాన్ని ఎలా వ్యతిరేకిస్తారని సీజేఐ ప్రశ్నించారు. ఈ ధనం అంతా నేరుగా సాక్షి ఖాతాలోకి పోతోందని రోహత్గీ వివరించారు. అయితే ఖచ్చితంగా సాక్షి పేపరే కొంటున్నారని చూపించాలని సీజేఐ రోహత్గీని కోరారు. రోహత్గీ కొన్ని ఆధారాలను సీజేఐ ముందు ఉంచారు. అంటే  ప్రజాధనాన్ని సాక్షి పేపర్ కు ప్రయోజనం కల్పించేందుకు ఉపయోగిస్తున్నారా అని సీజేఐ ప్రశ్నించారు. ఈ వ్యాజ్యంలో  సీఎం జగన్‌ను పార్టీగా ఇంప్లిడీ చేయడం ఎందుకని సీజేఐ ప్రశ్నించారు. సాక్షిపత్రికకు సీఎం జగనే ఓనరని రోహత్గీ సీజేఐకి తెలిపారు. దీంతో నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన సీజేఐ తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది. 

విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే   పేపర్ కొనాలని వలంటీర్లకు నెలకు రూ.200 మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ  రూ.200 అలాట్ చేశారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారందరితో బలవంతంగా సాక్షి దినపత్రికనే కొనిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ జీవోపై ఈనాడు యాజమాన్యం కొంత కాలం కిందట హైకోర్టులో పిటిషన్ వేసింది.  సీఎం జగన్‌ కుటుంబ యాజమాన్యంలోని ‘సాక్షి’ పత్రిక సర్క్యులేషన్‌ను పెంచుకొనేందుకే ఈ జీవోను తెచ్చారని వాదించింది. తనకు ఆర్థిక నష్టం కలిగించే ఆ జీవోను రద్దుచేయడంతోపాటు, ఆ పత్రిక సర్క్యులేషన్‌ను ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ (ఏబీసీ) పరిగణించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
 
ఫలానా పత్రిక కొనుగోలు చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదని ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో వాదించారు.  ప్రభుత్వ పథకాలపై ఉద్యోగులకు అవగాహన పెరగాలనే ఉద్దేశంతో పత్రికల కొనుగోలుకు రూ.200 ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.  విస్తృత వినియోగంల  ఉన్న పత్రికను కొనుగోలు చేయాలని మాత్రమే జీవోలో పేర్కొన్నామని..  హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ తర్వాత ప్రభుత్వ వాదననే హైకోర్టు సమర్థించింది. దీంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Embed widget