అన్వేషించండి

Minister Botsa On Pawan : పవన్ లాంటి వ్యక్తుల్ని చూస్తుంటే రాజకీయాలపై విరక్తి వస్తుంది- మంత్రి బొత్స

Minister Botsa On Pawan : పవన్ లాంటి వ్యక్తుల్ని చూస్తుంటే రాజకీయాలపై విరక్తి కలుగుతోందని మంత్రి బొత్స అన్నారు. పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Minister Botsa On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే రెచ్చగొట్టడం కాదని పవన్ కు హితవుపలికారు. పవన్‌ కల్యాణ్‌కు సబ్జెక్ట్‌తో పాటు పార్టీ విధానం కూడా లేదని విమర్శించారు. వచ్చే తరాలకు అసలు పవన్ కల్యాణ్ ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం అంటే పవన్ కు తెలియదన్నారు. కేఏ పాల్‌కు పవన్‌ కల్యాణ్‌కు ఏం తేడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  రాజ్యాంగం విలువలు తెలిస్తే అలాంటి సన్నాసి మాటలు మాట్లాడరని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఎంతమేర లబ్ది చేకూరిందో తెలుసుకోవాలని సూచించారు. డీబీటీ ద్వారా పేదలకు ఎన్ని నిధులను అందిస్తున్నామో పవన్ తెలుసుకోవాలని హితవుపలికారు. ఇవేం తెలుసుకోకుండా వాళ్లని కొడతా, వీళ్లని కొడతా అంటే సరిపోతుందా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.  వైసీపీ విధానం వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అన్నారు. మూడు రాజధానులు, 26 జిల్లాలే తమ విధానమన్నారు.  ఐదుకోట్ల ప్రజల అభివృద్ధి లక్ష్మమని ఇంతకు ముందే చెప్పామన్నారు. పవన్ లాంటి వ్యక్తులను చూస్తుంటే తనకు రాజకీయాలపై విరక్తి కలుగుతోందని మంత్రి బొత్స అన్నారు.  చంద్రబాబు, పవన్‌లకు ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే చాలని, వాళ్లదంతా దోపిడీ విధానం అని విమర్శించారు.  

పవన్ సన్నాసి మాటలు 

పవన్‌ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స అన్నారు. పవన్‌ కల్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అలాగే పవన్ కూడా ఎగిరెగిరిపడుతున్నారన్నారు.  గణతంత్ర దినోత్సవం నాడు ఎవరైనా హుందాగా మాట్లాడుతారని, సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నారని పవన్ పై మంత్రి బొత్స మండిపడ్డారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 60 వేల కోట్లు జమచేసిందన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కల్యాణ్ కు ఏం బాధ అన్నారు. వాక్ స్వాతంత్రం ఉందని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. పవన్ ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మంత్రి బొత్స ప్రశ్నించారు. 

ఉగాది నుంచి విశాఖలో పాలన 

 వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తన విధానంపై ఇంతకు ముందే స్పష్టంగా చెప్పామన్నారు.  మళ్లీ చెబుతున్నామన్నారు. పవన్ కల్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద బండి కొనుక్కుని ఉంటారని వారాహిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ లాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలు అంటే విరక్తి వస్తోందని మంత్రి బొత్స అన్నారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది దోపిడీ విధానమని, వైసీపీది అభివృద్ధి విధానం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ పై ఒత్తిడి చేస్తున్నామన్నారు. కేబినెట్ మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి కుదరదు అనరుగా అన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget