అన్వేషించండి

CM Jagan : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం, ప్రతి కమతానికి యూనిక్ ఐడెంటిటీ నంబర్- సీఎం జగన్

CM Jagan : సమగ్ర భూ సర్వే చేపట్టి రైతులకు భూహక్కు పత్రాలు అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 2023 చివరి నాటికి సర్వే పూర్తి చేస్తామన్నారు.

CM Jagan : ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపణీ కార్యక్రమం చేపట్టంది ప్రభుత్వం. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 'జగనన్న భూహక్కు- భూరక్ష' పథకం రెండో దశను సీఎం జగన్ ప్రారంభించారు. ఇక్కడ నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతో భూముల సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రాజకీయమంటే జవాబుదారీతనమన్న సీఎం జగన్... ప్రజలకు మంచి చేస్తేనే ఆదరిస్తారని మర్చిపోకూడదని సీఎం జగన్ అన్నారు. తాను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానన్నారు. మీ ఇంటిలో మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండని సీఎం జగన్‌ కోరారు.  

2023 చివరి భూ సర్వే పూర్తి 

 2023 చివరి నాటికి రాష్ట్రమంతటా భూ సమగ్ర సర్వే పూర్తిచేస్తామని సీఎం జగన్ తెలిపారు. భూవివాదాల్లో ఎక్కువ సివిల్‌ కేసులే అన్న సీఎం జగన్... సరైన వ్యవస్థ లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని గుర్తుచేశారు. ఆ పరిస్థితులను మార్చాలని సర్వే చేపట్టామన్నారు. రాష్ట్రం మొత్తం భూములకు కొలతలు వేసి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మార్కింగ్‌ చేశామన్నారు. ప్రతి కమతానికి గుర్తింపు సంఖ్య ఇస్తామన్నారు. హద్దు రాళ్లు కూడా పాతి రైతులకు భూహక్కు పత్రం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో భూసర్వే చేపడుతున్నామన్నారు. 17 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో భూములు సర్వే చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రెండేళ్ల కింద ప్రారంభించిన ఈ కార్యక్రమం తొలిదశలో రెండు వేల రెవెన్యూ గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశామన్నారు. ఇప్పటి వరకూ 7,92,238 మంది రైతులకు భూహక్కు పత్రాలు అందజేశామని తెలిపారు. ఫిబ్రవరిలో రెండో దశలో 4 వేల గ్రామాల్లో సర్వే నిర్వహిస్తామన్న సీఎం జగన్... మే 2023 కల్లా 6 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాలు, ఆగస్ట్‌ 2023 నాటికి 9 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామని సీఎం జగన్‌ వెల్లడించారు.

మామ పార్టీ కబ్జా 

తనకు తాను పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అంటారని సీఎం జగన్ అన్నారు. కూతురునిచ్చిన మామ పార్టీని కబ్జా చేస్తే వాళ్లను చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని ఆరోపించారు. మోసం చేసే చంద్రబాబులాంటి వ్యక్తులు మళ్లీ అధికారం రాకూడదన్నారు. పరాయి వాడి ఆస్తిని ఆక్రమిస్తే కబ్జాదారుడంటారని, పరాయి స్త్రీ మీద కన్నేసి అపహరిస్తే రావణుడు అంటారన్నారు. రావణుడిని సమర్థించినవాళ్లను రాక్షసులు అంటున్నామన్నారు. దుర్యోధనుడులాంటి చంద్రబాబును సమర్థించే వారిని దుష్టచతుష్టయం అంటారని విమర్శించారు. మామకు వెన్నుపోటుపొడిచి సీఎం కుర్చీని లాక్కున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు.  

పాలనలో విప్లవాత్మక మార్పులు 

వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలన వ్యవస్థల్లో సంచలన మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుకు పెంచామన్నారు. కుప్పం సహా 25 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామన్నారు. మూడు ప్రాంతాలు బాగుపడేలా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలుంటే ఇప్పుడు మరో 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తు్న్నామని వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget