అన్వేషించండి

Rammohan Naidu: రాజ్యసభలో సుధామూర్తి సూటిప్రశ్న, స్పష్టమైన సమాధానంతో ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు

Rajya Sabha MP Sudhamurthy | రాజ్యసభ ఎంపీ సుధామూర్తి రాజ్యసభలో రెండు అంశాలపై ప్రశ్నలు అడిగారు. వాటికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టంగా బదులిచ్చి ఆకట్టుకున్నారు.

న్యూఢిల్లీ:  దేశంలో మరిన్ని సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి, విజయపురకు విమానాలు ఎప్పుడు వస్తాయని రాజ్యసభలో ప్రశ్నించారు. రాజ్యసభలో సుధామూర్తి మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో ఫేమస్ టూరిస్ట్ స్పాట్ విజయపుర. పర్యాటకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్ట్ సిద్ధం చేశారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వంతో నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ సందర్భంగా ఓ విషయం అడుగుతున్నాను. విజయపురకు విమానాలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి. నేను ఎప్పుడు అడిగినా త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు. ఈసారి అలా కాదు. కచ్చితంగా దీనిపై మాకు సమాధానం కావాలి. 

54 సివిల్ ఏవియేషన్ కాలేజీలు ఉన్నాయి. 140 కోట్ల భారతీయులకు ఇది చాలా తక్కువ అని నా అభిప్రాయం. దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో సివిల్ ఏవియేషన్ కాలేజీలు, కేంద్రాలు లేవు. దీనిపై కేంద్రం ఫోకస్ చేయాలి. ఇది మా రిక్వెస్ట్’ అని సుధామూర్తి రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. సుధామూర్తి అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించి ఇచ్చిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంటోంది. 

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇది తిరుపతికి సంబంధించిన విషయం. అయితే సుధామూర్తిగారు విజయపుర పేరును ఇక్కడ ప్రస్తావించారు. విజయపురకు త్వరలోనే విమానాలు వస్తాయి. ఇదే ఏడాది అది అమలు చేస్తాం. కావాలంటే లిఖిత పూర్వకంగా మీకు సమాధానం ఇస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సాధ్యం చేస్తాం. సివిల్ ఏవియేషన్ కాలేజీలు 54 మాత్రమే ఉన్నాయి. అందులో పైలట్లతో పాటు మెయింటనెన్స్ ఇంజినర్లకు ట్రైనింగ్ ఇస్తారు. మరో 3 కాలేజీకు అప్రూవల్ వచ్చింది. మరో 9 ఏవియేషన్ కాలేజీల కోసం కేంద్రం చర్యలు ప్రారంభించింది. ప్రతి ఏడాది 1500కు పైగా పైలట్లు శిక్షణ తీసుకుంటున్నారు. దేశంలో మరికొన్ని కాలేజీలు అవసరం ఉంది కనుక ఎవరైనా ప్రైవేట్ సంస్థలు ఇందుకోసం ముందుకొస్తే కేంద్రం వారికి సహకారం అందిస్తుంది. 

వచ్చే 5 ఏళ్లలో దేశంలో 50 ఎయిర్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. 10 ఏళ్లలో 100, 20 ఏళ్లలో 200 విమానాశ్రయాలు నిర్మించి విమాన సర్వీసులు అందించాలని కేంద్రం భావిస్తోంది. కానీ విమానాశ్రయాలతో పాటు అక్కడ పార్కింగ్, ఆ స్థాయిలో స్థలం సేకరణ లాంటి చాలా అంశాలు ఆలోచించాలి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సుధామూర్తి గారితో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు ఇస్తాం. సెషన్స్ లో మరోసారి ఈ విషయం ప్రస్తావన అవసరం లేదని’ రామ్మోహన్ నాయుడు ఎంపీ సుధామూర్తి అడిగిన ప్రశ్నకు ఇచ్చి రిప్లై అందర్నీ ఆకట్టుకుంటోంది. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget