అన్వేషించండి

RGV compliant to DGP : ఆర్జీవీ తలకు రూ. కోటి వెల కట్టిన కొలికపూడి - డీజీపీకి ఫిర్యాదు చేసిన సినీ దర్శకుడు !

RGV : కొలికపూడి శ్రీనివాసరావుపై ఏపీ డీజీపీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశారు. తన తలకు రూ. కోటి వెల కట్టాడని.. చర్యలు తీసుకోవాలన్నారు.


Ram Gopal Varma :   వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.  
సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ చానల్ కార్యక్రమంలో మాట్లాడారు.  ఈ వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మొదట సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసిన ఆయన తర్వాత డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు  చేశారు.  

తనను   చంపేందుకు రూ. కోటి ఆఫర్ ప్రకటించిన కొలికపూడి శ్రీనివాసరావుపై, ఆయనను రెచ్చగొట్టేలా మాట్లాడిన యాంకర్ సాంబశివరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోాలని కోరారు.  టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’ చుట్టూ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా ఈ సినిమా తెరకెక్కించారని, ఆ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పై నిరసనలు, డెబిట్ లు జరుగుతూ వస్తున్నాయి.

ఈక్రమంలోనే ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ లో అమరావతి ఉద్యమం నేత కొలికిపూడి శ్రీనివాసరావు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ తల తీసుకువస్తే కోటి రూపాయల నజరనా ఇస్తానంటూ కొలికిపూడి శ్రీనివాసరావు పదేపదే మాట్లాడారు. ఇక ఈ విషయం పై ఆర్జీవీ రెస్పాండ్ అవుతూ నేడు డిజిపి కార్యాలయానికి చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోలికపూడి శ్రీనివాసరావు పై డిజిపికి ఫిర్యాదు చేశారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం సినిమా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ నారా లోకేశ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలంటూ నారా లోకేశ్ కోర్టును కోరారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. ఆర్జీవి వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేశ్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా చూపించారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు.  
 
 సోమవారం డిసెంబర్ 25న వ్యూహం సినిమా పై నిరసన తెలియజేస్తూ.. ఆర్జీవీ ఆఫీస్ వద్ద కొంతమంది వర్మ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆ ఈ విషయం పై కూడా ఆర్జీవీ టీం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆర్జీవీ దగ్గర పని చేస్తున్న కారు డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. డిసెంబర్ 25 రాత్రి దాదాపు 12-15 మంది వ్యక్తులు గుంపుగా వచ్చి రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ వద్ద దిష్టిబొమ్మని దహనం చేశారని కంప్లైంట్ పేర్కొన్నాడు. ఆ వచ్చినవారంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ అనుచరులని, ఆ మొత్తం దాడి సీసీటీవీ, సెల్ ఫోన్స్ చిత్రీకరణ అయ్యిందని, వాటిని కూడా పోలీసులకు సబ్మిట్ చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
India vs Bangladesh: ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
ఈ బంగ్లా జట్టుతో అంత ఈజీ కాదు , తొలి టెస్టుకు సర్వం సిద్ధం
Embed widget