అన్వేషించండి

Kakinada PDS Rice Issue: కాకినాడను వీడ‌ని పిడిఎస్ బియ్యం భూతం..! దీని గురించి మళ్లీ రగడ ఎందుకు జరుగుతుంది..? 

Kakinada PDS Rice Issue: కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చినా అడ్డుక‌ట్టవేయ‌లేక‌పోతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Kakinada PDS Rice Issue: కాకినాడ అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది బీచ్ అనుకుంటారంతా... లేదా పోర్ట్ అనుకుంటారు.. కానీ రాజ‌కీయ విమ‌ర్శ‌లప‌రంగా వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది కాకినాడ పోర్ట్ కేంద్రంగా న‌డిచే అక్ర‌మ పీడీఎస్ బియ్యం మాఫీయా గురించే. సంవ‌త్స‌రాల కాలంగా వేళ్లూనుకుపోయిన ఈ మాఫియాను అడ్డుక‌ట్ట వేయాలంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటేనే త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్న వాద‌ను ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. ఎంద‌కంటే గ‌త వైసీపీ పాల‌న‌లో ఈ మాఫికా కార్య‌క‌లాపాల‌కు గేట్లు ఎత్తేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. వైసీపీ నేత‌లే టార్గెట్‌గా అప్ప‌ట్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు కీల‌క ఆరోప‌ణ‌లు చేస్తూ అధికారంలోకి రాగ‌నే మీ తాట తీస్తామ‌ని హెచ్చరించారు. కానీ కూటమి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి 15 నెల‌ల స‌మ‌మం గ‌డుస్తున్నా కాకినాడ పోర్టు కేంద్రంగా న‌డుస్తోన్న పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా మాత్రం ఏమాత్రం అడ్డుక‌ట్ట‌ప‌డ‌లేద‌న్న‌ది ప‌లువురి మాట‌గా వినిపిస్తోంది. తాజాగా ఇదే విష‌యాన్ని ఇటీవలే అమ‌రావ‌తి జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల సద‌స్సులో ఏపీ డిప్యూటీ సీఎం సంధించిన‌ ప‌లు ప్ర‌శ్న‌లు ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి. కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్‌ను పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇది రాజ‌కీయంగా ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం అయ్యారా అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. 

ప‌వ‌న్ ఎందుకు ఇలా ప్ర‌శ్నించారు..?

ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో కాకినాడ కేంద్రంగా జ‌రుగుతోన్న అక్ర‌మ బియ్యం ర‌వాణా విష‌యంలో కీల‌కంగా వ్యాఖ్యానించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని హెచ్చ‌రించారు కూడా. అయితే కూట‌మి ప్ర‌భుత్వం కోలువు తీరింది.. ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ పోర్టులో త‌నిఖీలు చేశారు. సివిల్ స‌ప్లై మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ప‌లుసార్లు పోర్టులో త‌నిఖీలు చేసి కొంత స‌రుకును సీజ్‌కూడా చేయించారు. కానీ ప్ర‌స్తుతం వినిపిస్తోన్న మాట కాకినాడ కేంద్రంగా సాగుతోన్న పీడీఎస్ అక్ర‌మ ర‌వాణా విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏమాత్రం అడ్డుక‌ట్ట‌వేయ‌లేక‌పోయింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి.. ఈ కార‌ణ‌మే ఇటీవ‌ల జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌శ్న‌లు సంధించార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మికి చెందిన నేత‌లు, అధికారులు, పీడీఎస్ అక్ర‌మ ర‌వాణా మాఫియాతో క‌లిసిపోయార‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లు.. స‌మాధానాలే క‌ర‌వు..

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఎందుకు పెరిగింది? గత ఐదు సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్ కేంద్రంగా పిడిఎస్ బియ్యం నమూనా పేరుతో ఎగుమతులు జ‌రుగుతున్నాయి. రేషన్ డీలర్లు, మిల్లర్లు, స్మగ్లర్ల మధ్య నెట్‌వర్క్ ఏర్పడి రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరలో బియ్యం కొని, తిరిగి మిల్లింగ్ చేసి, పెద్దలకి అధిక ధరకు అమ్ముతున్నారని విచారణల్లో తేలితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు..? ప్రభుత్వ నేతలు, కొన్ని పోలీసు అధికారులు నుంచి కూడా మద్దతు ఉన్నట్లు ఆరోపణలు రావ‌డం వెనుక వాస్త‌వం ఎంత‌.? 2024లో కాకినాడ పోర్ట్ ద్వారా సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నులపైగా బియ్యం ఎగుమతి అయినట్లు అధికార లెక్కలు చూపిస్తున్నాయి. ఇందులో అక్ర‌మ పీడీఎస్ బియ్యం వాటా ఎంత‌.? ఇలా అనేక ప్ర‌శ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయంటున్నారు.

చ‌ర్య‌లు చేప‌ట్ట‌నా వారి ప‌ని వారిదేనా...

కాకినాడ పోర్టు కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై జ‌రుగుతోన్న చ‌ర్చ అటుంచితే కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక దీనిసై దృష్టిసారించి చర్యలు ప్రారంభించార‌నే చెప్ప‌వ‌చ్చు. కాకినాడ పోర్టుపై నియంత్రణ, అక్రమ బియ్యం రవాణా నిరంత‌ర నిఘా.. అధిక చెక్‌పాయింట్లు త‌నిఖీలు.. అధికారుల నిరంత‌ర త‌నిఖీల ద్వారా బియ్యం సంబంధిత గోదాములు, లారీలు సీజ్ చేస్తోంది.. ఇటీవలే 85 కేసులు కాకినాడలో న‌మోద‌య్యాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ తొలినాళ్ల‌లో చూపిన ఉత్సాహం నీరుకారిపోయింద‌ని, ప్ర‌స్తుతం కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం అక్ర‌మ ఎగుమ‌తులు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని, కానీ ప‌ట్టించుకునే నాధులే క‌ర‌వ‌య్యార‌ని మాత్రం దీనిపై పెద‌వి విరుస్తున్నారు.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
వేట్లపాలెం ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, పక్కా ఇళ్లు- నలుగురు అధికారులపై వేటు!
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?
UTS మొబైల్ యాప్‌లో ట్రైన్ టికెట్ తీసుకుంటున్నారా.. యాప్ మూసేస్తున్న రైల్వే.. వాలెట్ లోని డబ్బులు ఏమవుతాయి..?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
CM Revanth Reddy : 99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
99 రోజుల పాటు అలుపెరుగని పరుగే - కలెక్టర్లకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
Iran Israel War 2026:వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
వార్‌ అంటే ఏంటీ? ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడి సైనిక చర్యనా? యుద్ధమా? 
Embed widget