అన్వేషించండి

Kakinada PDS Rice Issue: కాకినాడను వీడ‌ని పిడిఎస్ బియ్యం భూతం..! దీని గురించి మళ్లీ రగడ ఎందుకు జరుగుతుంది..? 

Kakinada PDS Rice Issue: కాకినాడ కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చినా అడ్డుక‌ట్టవేయ‌లేక‌పోతోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Kakinada PDS Rice Issue: కాకినాడ అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది బీచ్ అనుకుంటారంతా... లేదా పోర్ట్ అనుకుంటారు.. కానీ రాజ‌కీయ విమ‌ర్శ‌లప‌రంగా వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది కాకినాడ పోర్ట్ కేంద్రంగా న‌డిచే అక్ర‌మ పీడీఎస్ బియ్యం మాఫీయా గురించే. సంవ‌త్స‌రాల కాలంగా వేళ్లూనుకుపోయిన ఈ మాఫియాను అడ్డుక‌ట్ట వేయాలంటే కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటేనే త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్న వాద‌ను ఎక్కువ‌గా వినిపిస్తుంటాయి. ఎంద‌కంటే గ‌త వైసీపీ పాల‌న‌లో ఈ మాఫికా కార్య‌క‌లాపాల‌కు గేట్లు ఎత్తేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. వైసీపీ నేత‌లే టార్గెట్‌గా అప్ప‌ట్లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు కీల‌క ఆరోప‌ణ‌లు చేస్తూ అధికారంలోకి రాగ‌నే మీ తాట తీస్తామ‌ని హెచ్చరించారు. కానీ కూటమి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి 15 నెల‌ల స‌మ‌మం గ‌డుస్తున్నా కాకినాడ పోర్టు కేంద్రంగా న‌డుస్తోన్న పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణా మాత్రం ఏమాత్రం అడ్డుక‌ట్ట‌ప‌డ‌లేద‌న్న‌ది ప‌లువురి మాట‌గా వినిపిస్తోంది. తాజాగా ఇదే విష‌యాన్ని ఇటీవలే అమ‌రావ‌తి జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల సద‌స్సులో ఏపీ డిప్యూటీ సీఎం సంధించిన‌ ప‌లు ప్ర‌శ్న‌లు ప‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి. కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్‌ను పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేశారు. ఇది రాజ‌కీయంగా ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం అయ్యారా అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి. 

ప‌వ‌న్ ఎందుకు ఇలా ప్ర‌శ్నించారు..?

ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో కాకినాడ కేంద్రంగా జ‌రుగుతోన్న అక్ర‌మ బియ్యం ర‌వాణా విష‌యంలో కీల‌కంగా వ్యాఖ్యానించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని హెచ్చ‌రించారు కూడా. అయితే కూట‌మి ప్ర‌భుత్వం కోలువు తీరింది.. ఒకసారి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ పోర్టులో త‌నిఖీలు చేశారు. సివిల్ స‌ప్లై మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా ప‌లుసార్లు పోర్టులో త‌నిఖీలు చేసి కొంత స‌రుకును సీజ్‌కూడా చేయించారు. కానీ ప్ర‌స్తుతం వినిపిస్తోన్న మాట కాకినాడ కేంద్రంగా సాగుతోన్న పీడీఎస్ అక్ర‌మ ర‌వాణా విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏమాత్రం అడ్డుక‌ట్ట‌వేయ‌లేక‌పోయింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తోన్నాయి.. ఈ కార‌ణ‌మే ఇటీవ‌ల జ‌రిగిన క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ప్ర‌శ్న‌లు సంధించార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మికి చెందిన నేత‌లు, అధికారులు, పీడీఎస్ అక్ర‌మ ర‌వాణా మాఫియాతో క‌లిసిపోయార‌ని కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లు.. స‌మాధానాలే క‌ర‌వు..

పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా ఎందుకు పెరిగింది? గత ఐదు సంవత్సరాల్లో కాకినాడ పోర్ట్ కేంద్రంగా పిడిఎస్ బియ్యం నమూనా పేరుతో ఎగుమతులు జ‌రుగుతున్నాయి. రేషన్ డీలర్లు, మిల్లర్లు, స్మగ్లర్ల మధ్య నెట్‌వర్క్ ఏర్పడి రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరలో బియ్యం కొని, తిరిగి మిల్లింగ్ చేసి, పెద్దలకి అధిక ధరకు అమ్ముతున్నారని విచారణల్లో తేలితే ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు..? ప్రభుత్వ నేతలు, కొన్ని పోలీసు అధికారులు నుంచి కూడా మద్దతు ఉన్నట్లు ఆరోపణలు రావ‌డం వెనుక వాస్త‌వం ఎంత‌.? 2024లో కాకినాడ పోర్ట్ ద్వారా సుమారు 13 లక్షల మెట్రిక్ టన్నులపైగా బియ్యం ఎగుమతి అయినట్లు అధికార లెక్కలు చూపిస్తున్నాయి. ఇందులో అక్ర‌మ పీడీఎస్ బియ్యం వాటా ఎంత‌.? ఇలా అనేక ప్ర‌శ్నలు సామాన్యుల నుంచి వినిపిస్తున్నాయంటున్నారు.

చ‌ర్య‌లు చేప‌ట్ట‌నా వారి ప‌ని వారిదేనా...

కాకినాడ పోర్టు కేంద్రంగా పీడీఎస్ బియ్యం అక్ర‌మ ర‌వాణాపై జ‌రుగుతోన్న చ‌ర్చ అటుంచితే కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక దీనిసై దృష్టిసారించి చర్యలు ప్రారంభించార‌నే చెప్ప‌వ‌చ్చు. కాకినాడ పోర్టుపై నియంత్రణ, అక్రమ బియ్యం రవాణా నిరంత‌ర నిఘా.. అధిక చెక్‌పాయింట్లు త‌నిఖీలు.. అధికారుల నిరంత‌ర త‌నిఖీల ద్వారా బియ్యం సంబంధిత గోదాములు, లారీలు సీజ్ చేస్తోంది.. ఇటీవలే 85 కేసులు కాకినాడలో న‌మోద‌య్యాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డ తొలినాళ్ల‌లో చూపిన ఉత్సాహం నీరుకారిపోయింద‌ని, ప్ర‌స్తుతం కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం అక్ర‌మ ఎగుమ‌తులు ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని, కానీ ప‌ట్టించుకునే నాధులే క‌ర‌వ‌య్యార‌ని మాత్రం దీనిపై పెద‌వి విరుస్తున్నారు.. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
Viral Video: త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!
త్రివిక్రమ్‌ డైలాగ్స్‌కు AI విజువలైజేషన్! నవ్వు ఆపుకోలేకపోయిన చంద్రబాబు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget