అన్వేషించండి

 Floods in AP: ధవలేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ.. అప్రమత్తమైన అధికారులు!

Floods in AP: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదల వల్ల ధవలేశ్వరం కాటన్ బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది. అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 

Floods in AP: ఎగువ ప్రాంతాల్లో కరుస్తున్న భారీ వర్షాల వల్ల ధవలేశ్వరం ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 18 అడుగుల స్థాయికి పైగా వరద ప్రవహిస్తోంది. దీంతో 19,54, 822 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న జలాశయంలోకి వదులుతున్నారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. దిగువ ప్రాంతాలైన కోనసీమ జిల్లా పరిధిలోని లంక గ్రామాలన్నీ వరద ముంపు ముప్పులోకి వెళ్తున్నాయి.  

పొంగిపొర్లుతున్న నదులు..

పైనుంచి పొడుస్తున్న వరదతో గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో నదీ పరివాహక గ్రామాలన్నింటిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 75కు పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లంక గ్రామాలన్నింటిని ఈ శిబిరాలకు తరలించే ఏర్పాటు చేస్తున్నారు. వరద ప్రభావిత అన్ని గ్రామలను ఖాళీ చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలోనే..!

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట వారిధిపై వరద ఉద్ధృతి పెరిగింది. మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇలాగే జరిగితే... ఈరోజే వరద నీరు పాత బ్రిడ్జ్ ను తాకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ అయోధ్య లంక, పుచ్చల లంక, పెద్దమల్లం లంక, అనగార లంక , మర్రిమూల లంక గ్రామాలు  జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

గంటల పాటు శ్రమించి 500 గేదెలను ఒడ్డుకు...

లంక గ్రమాలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రజలంతా పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. అయితే తమకు జీవనోపాధి కల్పించే పశువులను ఎలాగైనా సరే కాపాడుకోవాలనున్న ప్రజలు.. వరద ప్రవాహంలోనే తిరుగుతు 500 గేదెలను ఒడ్డుకు చేర్చారు. గంటల పాటు శ్రమించి తమతు జీవనోపాధి కల్పించే పశువులను కాపాడుకున్నారు. 

ప్రజలంతా అప్రమత్తంగా ఉండండి.. 

కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాలను జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి జోగి రమేష్ పరిశీలించారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండల పరిధిలోని ముంపు గ్రామాలను ఆయన స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఎంపీ చింతా అనురాధ తదితరులతో కలిసి నావపై వెళ్లి పరిశీలన చేశారు. అయినవిల్లి ఎదురు బిడిం కాజ్వే పై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని... అది త్వరలో కార్యరూపం దాల్చనుందని తెలిపారు. వరద ముంపుకు గురైన వరద బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. అదే విధంగా ముమ్మిడివరం నియోజక వర్గంలోని పలు వరద ముంపు గ్రామాలను మంత్రి జోగి రమేష్ సందర్శించారు. 

 వరద ప్రభావం తగ్గేవరకు ప్రజలంతా పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అక్కడ భోజనంతో పాటు అన్ని రకాల వసతులు ఉంటాయన్నారు. ముఖ్యంగా వైద్య శిబిరాలను వరద ప్రభావం తగ్గినా కొనసాగిచాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ... ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget