అన్వేషించండి

Annavaram Temple: అన్నవరం దేవస్థానంలో ఏం జరుగుతోంది? వివాదం ఎక్కడ మొదలైంది? పవన్‌ విమర్శలకు కారణమేంటి?

కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో శుభకార్యాలు నిర్వహించుకునే భక్తులపై మరింత భారం పెరిగేలా దేవస్థానం అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి..

కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరంలో రోజూ భారీ సంఖ్యలో భక్తు వస్తూ మొక్కులు తీర్చుకుంటా ఉంటారు. శుభకార్యాలు జరిపించుకొని వెళ్తుంటారు. అలాంటి దేవాలయం విషయంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయం వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.  

భక్తులపై మరింత భారం పెరిగేలా దేవస్థానం అధికారుల నిర్ణయాలు ఉంటున్నాయని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. శుభకార్యాల కోసం పురోహితులు, భజంత్రీలు, అలంకరణ ఏర్పాట్లు ఇలా అన్నీ వేలం పాట ద్వారా కాంట్రాక్టుదారునికి అప్పగించే చర్యలపై ఆరోపణలు వెల్లువెత్తాయి.  దీన్నే తణుకు వారాహి బహిరంగ సభ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రస్తావించారు. అన్నవరం విషయంలో తీసుకున్న చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, హిందూ ధర్మం జోలికి వస్తే సహించేది లేదని గట్టిగానే హెచ్చరించారు..

అన్నవరం పుణ్యక్షేత్రంలో దేవస్థానం తీసుకున్న నిర్ణయం పూర్తిగా వ్యాపార దృక్పథంలో తీసుకున్నదేనని భక్తులు మండిపడుతున్నారు. రత్నగిరిలో వివాహాలు, ఉపనయనాలు ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు సౌకర్యాలను కాంట్రాక్టుదారుడు సమకూర్చేలా రూల్ తీసుకురాబోతున్నారు. స్వామి సన్నిధిలో నిర్వహించే శుభకార్యాలకు భజంత్రీలు, పురోహితులు, అలంకరణ మండపం, భోజనాలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే సమకూర్చేలా కసరత్తు ప్రారంభించారు. దీని అమలుకు టెండర్లు పిలిచారు. 

ఈ ప్రక్రియలో భక్తుల నుంచి వసూళ్లు చేసిన సొమ్మును కాంట్రాక్టుదారునికి దేవస్థానం చెల్లిస్తుంది. ఇందులో భాగంగానే జూన్‌ నెలలో ఇప్పటికే డోలు, సన్నాయి మేళం ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు వేలం పాట నిర్వహించారు. దీనికి రూ.2.16 కోట్లు మేర చెల్లించేందుకు కాంట్రాక్టుదారుడు ముందుకు వచ్చాడు. 

ఈ ప్రణాళికలో భాగంగా పురోహితులు ఏర్పాటుకు టెండర్లు నిర్వహించారు. పలు కారణాలతో దాన్ని రద్దు చేశారు. ఈ చర్యలే ప్రస్తుతం తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. 

ఈ విధానంలో పెరగనున్న భారం.. 

అన్నవరం పుణ్యక్షేత్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకుంటే ఫుణ్యఫలం అనేది భక్తుల నమ్మకం. అందుకే రత్నగిరిలో ప్రతీ ఏటా వేల వివాహాలు, ఉపనయనాలు, వ్రతాలు, ఇతర శుభకార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటి నిర్వహణకు పురోహితులు ప్రధాన భూమిక పోషిస్తారు. అన్నవరం కొండపై శుభాకార్యాలు చేసుకునేవారు పురోహితులను బయట నుంచి తెచ్చుకుంటే వివాహానికి రూ.5,000, ఉపనయనాలకు రూ.2,000 చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇదే తరహాలో పూర్తి స్థాయి సన్నాయి మేళానిరి రూ.12,000, సగం సన్నాయి మేళానికి రూ.6,000 చొప్పున రేటు నిర్ణయించారు. అదే బయట నుంచి గనుగ సన్నాయి మేళాన్ని తెచ్చుకుంటే అదనంగా రూ.3,000 వసూలు చేయాలని నిర్ణయించారు. 

ఇదంతా సమర్పణ పేరిట అదనపు వసూళ్లు చేస్తుండగా ఆధ్యాత్మిక కోణంలో చూడాల్సిన దేవస్థానం అధికారులు వ్యాపార దృక్పథంలో చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

కచ్చితత్వం కోసమే అంటున్న అధికారులు..

రత్నగిరి కొండపై జరుగుతోన్న వివాహాల విషయంలో కచ్చితత్వం కోసమే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అసలు కొండపై ఎంత మంది పురోహితులు ఉన్నారు, ఇతర పురోహితులు కొండపైకి ఎంత మంది వస్తున్నారన్న విషయంలో స్పష్టత కోసమేనని అంటున్నారు. కొండపై జరుగుతున్న కొన్ని వివాహాలు వివాదస్పద మవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవలే ఓ బాలిక వివాహం గురించి జిల్లా కలెక్టరు సైతం ఆరా తీశారని చెబుతున్నారు. స్థానిక పురోహితులు, సన్నాయి మేళాలను ప్రోత్సహించాలనేది కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇది భారంగా మారతుందంటున్న నేపథ్యంలో బయట పురోహితులను తీసుకువస్తే వసూలు చేయాలనుకున్న రూ.5,000కు బదులు కేవలం రూ.1500 మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌ ఆజాద్‌ తెలిపారు.

పురోహితుల ఏర్పాటుకు వేలంపాట తగదు...
అన్నవరం దేవస్థానంలో శుభకార్యాలు చేయించేందుకు పురోహితుల కోసం కాంట్రాక్టుదారుని ద్వారా ఏర్పాటు చేయాలనుకోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు అన్నారు. వేలం పాట నిర్వహించి కాంట్రాక్టుదారుని ద్వారా పురోహితులను ఏర్పాటు చేయడం విరమించి గత విధానాన్ని అమలు చేయాలని ఆలయ ఈవోకు వారంతా కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. శ్రీసత్యదేవ వ్రత పురోహిత సంఘం మాత్రం దేవస్థానం ప్రవేశపెట్టిన విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నామని తెలిపింది. అన్నవరం దేవస్థానంలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునేందుకు పురోహితులను ఏర్పాటు చేయడానికి దేవస్థానం విధానం ద్వారా మేలే జరుగుతుందన్నారు. టెండరు విధానంలో అర్ధమైన పురోహితులు, వైదిక సిబ్బందిని సమకూర్చుకోవడంలో తప్పుపట్టడానికి ఏమీ లేదని సంఘ అధ్యక్షుడు నాగాభట్ల రవిశర్మ స్పష్టం చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget