అన్వేషించండి

East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

East Godavari: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీళ్లంతా కూలీ చేసుకునే కుటుంబాన్ని పోషించేవారుగా గుర్తించారు.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద ప్రమాదానికి గురైంది.


East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

జీడిగింజలతో వెళ్తున్న  వాహనం బోల్తాపడడంతో అందులో ఉన్న వారంతా ప్రమాదంలో చిక్కుకున్నారు. బయటకు రాలేక ఊపిరి ఆడక మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో పది మంది ప్రయాణికులు ఉన్నారు. వెనక ఉండి ప్రయాణిస్తున్న వారు మృతి చెందారు.


East Godavari : జీడిగింజల బస్తాల్లో ఇరుక్కొని ఏడుగురు మృతి-తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం

వెనుక ఉన్నవారంతా బస్తాల మధ్య ఇరుక్కొని ఊపిరి ఆడకపోవడంతో మృతి చెందారు. క్యాబిన్‌లో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా ఉన్నారు.  ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కొవ్వూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ మధ్యవయసులో ఉన్న వాళ్లే. ఆయా కుటుంబాలకు వీళ్లే ప్రధాన జీవనాధారం. 

ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:- 
తాడి కృష్ణ(45), ముసలయ్య(35), బొక్కా ప్రసాద్(32), తమ్మి రెడ్డి సత్యనారాయణ (45), కత్తివ సత్తిపండు (40), డీ వెంకటరావు(40), పెనుగుర్తి చిన్న కత్తివ కృష్ణ(40), 

ఈ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందివ్వాలి అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటనగా అభివర్ణించారు. ప్రమాదంలో కష్ట జీవులు చనిపోవడం దురదృష్టకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని ధైర్యం ఇచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu News: చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
చంద్రబాబును ఆకాశానికెత్తేసిన నార్వే మాజీ మంత్రి - సీఎం రిప్లై ఏంటంటే
Poonam Kaur: త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్‌ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
త్రివిక్రమ్‌పై మా అసోసియేషన్‌కు పూనమ్ ఫిర్యాదు - గురూజీని ప్రశ్నించండి... సినీ పెద్దలకు నటి రిక్వెస్ట్‌
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామా - లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పణ
Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?
Viral News: దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
దొంగకు దేహశుద్ధి చేసి పులిహోర తినిపించారు - నల్గొండ జిల్లాలో ఘటన, వైరల్ దృశ్యాలు
What is Kejriwal strategy : రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
రాజీనామాతో కేజ్రీవాల్ మరోసారి తప్పిదం చేస్తున్నారా ? రాజకీంగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారా ?
Devara: దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
దేవర మేనియా - అక్కడ భారీగా మిడ్‌నైట్ బెనిఫిట్‌ షోలకు ప్లాన్‌, టికెట్‌ రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే!
Telugu News: మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
మేకపాటి విరాళానికి రాజకీయం అడ్డంకి- చంద్రబాబుకు స్పీడ్ పోస్టు- తెలంగాణలో మాత్రం నేరుగా అందజేత!
Embed widget