అన్వేషించండి

Konaseema: కోనసీమ రైల్వే కల నెరవేరేనా? 24 ఏళ్ల నిరీక్షణకు తెర.. కోర్టు స్టేలు తొలగింపుతో పనులు పునఃప్రారంభం!

Konaseema: కోర్టు కేసులు తొలగిపోవడంతో కోనసీమ రైల్వే లైన్ పనుల్లో కదలిక వచ్చింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది.

Konaseema: కోనసీమ వాసులకు గుడ్ న్యూస్‌. అప్పుడెప్పుడో 2000లో ప్రారంభమైన ప్రాజెక్టు ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. కోర్టు కేసులు ఇతర సమస్యలతో మూలనపడిన రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా సాగుతందని ప్రజలు భావిస్తున్నారు. కోనసీమ రైల్వేలైన్‌ నిర్మాణానికి 2000లో శంకుస్థాపన చేశారు. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ కోస్తా రైల్వే లైన్ నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొలి అలైన్‌మెంట్‌ 2001లో వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పనులు కూడా మొదలయ్యాయి. వివిధ కారణాలతో అక్కడి నుంచి ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతో ప్రక్రియ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

రైల్వేలైన్‌ భూసేకరణ, రీ అలైన్‌మెంట్‌ సర్వేల విషయంలో చాలా మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తక్కువ పరిహారం ఇచ్చారని మరింత కావాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. పరిహారంలో జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని పాతికేళ్లుగా పోరాడుతున్నారు. దీంతో పనులపై ఇన్ని రోజులు కోర్టులు స్టే విధించాయి. ఇన్ని రోజులు విచారణ తర్వాత కోర్టులు ఆ స్టేలను ఎత్తివేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. 

Image

102.507 కిలోమీటర్ల పొడవుతో రైల్వేలైన్‌ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇందులో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు అంటే దాదాపు 45కిలోమీటర్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా యాభై కిలోమీటర్లకు పైగా లైన్ నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి నర్సాపురం ఉన్న భూసేకరణ సమస్యతో పనులకు ఆటంకం ఏర్పడింది. కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడి నుంచి నర్సాపురం వరకు చేపట్టాల్సిన భూసేకరణే ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది.  

ఏదోలా చేసి పనులు పూర్తి చేయాలని 2016 నుంచి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. పదేళ్లుగా గోదావరి మూడు నదీపాయలపై పిల్లర్ల పనులు పూర్తి చేశారు. మిగతా పనులకు టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. కానీ పనుల్లో మాత్రం వేగం కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం ఈ రైల్వేలైన్‌ కోసం కావాల్సిన భూసేకరణకు చర్యలు చేపట్టింది. 2024 ఫిబ్రవరిలో 50 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో భూసర్వే కూడా చేపట్టారు. కానీ పనుల్లో పురోగతి కనిపించలేదు. 

కోర్టు కేసులతోపాటు అలైన్‌మెంట్‌లో వచ్చిన సమస్యలు కూడా పనులు జాప్యానికి కారణంగా చెప్పవచ్చు. 216 బైపాస్‌ నిర్మాణం కారణంగా రైల్వే ట్రాక్‌కు ఆనుకొని రోడ్డు వెళ్తోంది. దీని వల్ల రైల్వేట్రాక్ నిర్మాణం సరికాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. రోడ్డు దిగిన వెంటనే ట్రాక్ దాటాల్సి ఉందని ఇది భవిష్యత్‌లో ప్రమాదాలకు కారణమవుతుందని కూడా తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అంచనా వేశారు. 
ఈ సమస్యలు గుర్తించి అలైన్మెంట్ మార్చారు. బైపాస్‌ స్టార్ట్ కాక మందే రైల్వేలైన్ వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని ప్రకారం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్లాన్ ప్రకారం రెండు చోట్ల మాత్రమే 216 జాతీయ రహదారి మీదుగా రైల్వేలైన్ వెళ్తుంది. 

ఇప్పుడు కొత్త అలైన్మెంట్‌కు ఆమోదం, కోర్టు కేసులో ఎత్తివేయడంతో అధికారులు పనులు వేగం పెంచారు.  భూసేకరణ ప్రక్రియ వేగం పెంచారు. ఈ సేకరణ పూర్తి అయితే పెండింగ్ పనులు పూర్తి కావడానికి ఎంతో సమయం పట్టదని అధికారులు అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget