అన్వేషించండి

Konaseema: కోనసీమ రైల్వే కల నెరవేరేనా? 24 ఏళ్ల నిరీక్షణకు తెర.. కోర్టు స్టేలు తొలగింపుతో పనులు పునఃప్రారంభం!

Konaseema: కోర్టు కేసులు తొలగిపోవడంతో కోనసీమ రైల్వే లైన్ పనుల్లో కదలిక వచ్చింది. కొత్త అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ ప్రక్రియ ఊపందుకుంది.

Konaseema: కోనసీమ వాసులకు గుడ్ న్యూస్‌. అప్పుడెప్పుడో 2000లో ప్రారంభమైన ప్రాజెక్టు ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. కోర్టు కేసులు ఇతర సమస్యలతో మూలనపడిన రైల్వే ప్రాజెక్టు ఇప్పుడు వేగంగా సాగుతందని ప్రజలు భావిస్తున్నారు. కోనసీమ రైల్వేలైన్‌ నిర్మాణానికి 2000లో శంకుస్థాపన చేశారు. కాకినాడ నుంచి కోటిపల్లి, అమలాపురం, రాజోలు, సిద్ధాంతం మీదుగా నర్సాపురం వరకు ఈ కోస్తా రైల్వే లైన్ నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం భావించింది. తొలి అలైన్‌మెంట్‌ 2001లో వచ్చింది. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు పనులు కూడా మొదలయ్యాయి. వివిధ కారణాలతో అక్కడి నుంచి ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు కోర్టు కేసులు క్లియర్ కావడంతో ప్రక్రియ ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

రైల్వేలైన్‌ భూసేకరణ, రీ అలైన్‌మెంట్‌ సర్వేల విషయంలో చాలా మంది రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో తక్కువ పరిహారం ఇచ్చారని మరింత కావాలంటూ కోర్టుల్లో పిటిషన్లు వేశారు. పరిహారంలో జరిగిన అన్యాయాన్ని సరి చేయాలని పాతికేళ్లుగా పోరాడుతున్నారు. దీంతో పనులపై ఇన్ని రోజులు కోర్టులు స్టే విధించాయి. ఇన్ని రోజులు విచారణ తర్వాత కోర్టులు ఆ స్టేలను ఎత్తివేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా పోయింది. 

Image

102.507 కిలోమీటర్ల పొడవుతో రైల్వేలైన్‌ నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇందులో కాకినాడ నుంచి కోటిపల్లి వరకు అంటే దాదాపు 45కిలోమీటర్ల నిర్మాణం పూర్తి అయింది. ఇంకా యాభై కిలోమీటర్లకు పైగా లైన్ నిర్మించాల్సి ఉంది. కోటిపల్లి నుంచి నర్సాపురం ఉన్న భూసేకరణ సమస్యతో పనులకు ఆటంకం ఏర్పడింది. కోటిపల్లి నుంచి భట్నవిల్లి వరకు భూసేకరణ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడి నుంచి నర్సాపురం వరకు చేపట్టాల్సిన భూసేకరణే ఈ ప్రాజెక్టుకు అడ్డంకిగా మారింది.  

ఏదోలా చేసి పనులు పూర్తి చేయాలని 2016 నుంచి జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. పదేళ్లుగా గోదావరి మూడు నదీపాయలపై పిల్లర్ల పనులు పూర్తి చేశారు. మిగతా పనులకు టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. కానీ పనుల్లో మాత్రం వేగం కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం ఈ రైల్వేలైన్‌ కోసం కావాల్సిన భూసేకరణకు చర్యలు చేపట్టింది. 2024 ఫిబ్రవరిలో 50 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసింది. అమలాపురం, మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాలలో భూసర్వే కూడా చేపట్టారు. కానీ పనుల్లో పురోగతి కనిపించలేదు. 

కోర్టు కేసులతోపాటు అలైన్‌మెంట్‌లో వచ్చిన సమస్యలు కూడా పనులు జాప్యానికి కారణంగా చెప్పవచ్చు. 216 బైపాస్‌ నిర్మాణం కారణంగా రైల్వే ట్రాక్‌కు ఆనుకొని రోడ్డు వెళ్తోంది. దీని వల్ల రైల్వేట్రాక్ నిర్మాణం సరికాదని నిపుణులు అభిప్రాయపడ్డారు. రోడ్డు దిగిన వెంటనే ట్రాక్ దాటాల్సి ఉందని ఇది భవిష్యత్‌లో ప్రమాదాలకు కారణమవుతుందని కూడా తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని అంచనా వేశారు. 
ఈ సమస్యలు గుర్తించి అలైన్మెంట్ మార్చారు. బైపాస్‌ స్టార్ట్ కాక మందే రైల్వేలైన్ వెళ్లేలా ప్లాన్ చేశారు. దీని ప్రకారం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టారు. ఈ ప్లాన్ ప్రకారం రెండు చోట్ల మాత్రమే 216 జాతీయ రహదారి మీదుగా రైల్వేలైన్ వెళ్తుంది. 

ఇప్పుడు కొత్త అలైన్మెంట్‌కు ఆమోదం, కోర్టు కేసులో ఎత్తివేయడంతో అధికారులు పనులు వేగం పెంచారు.  భూసేకరణ ప్రక్రియ వేగం పెంచారు. ఈ సేకరణ పూర్తి అయితే పెండింగ్ పనులు పూర్తి కావడానికి ఎంతో సమయం పట్టదని అధికారులు అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget