News
News
X

Kakinada Tiger News: పెద్దపులి ఏమైంది? 3 రోజులుగా జాడలేని బెంగాల్ టైగర్, ఈ ప్రాంతాల్లో మరింత భయం

రాయల్ బెంగాల్ టైగర్‌ను వేటాడేందుకు మహారాష్ట్ర నుంచి తడోబా బృందాన్ని రప్పిస్తున్నట్లు ఫారెస్ట్ ఉన్నతాధికారులైతే వెల్లడించారు కానీ ఇంకా వారు శరభవరం ప్రాంతానికి చేరుకోలేదు.

FOLLOW US: 
Share:

మూడు రోజులుగా బెంగాల్ టైగర్ జాడ కనిపించడంలేదు. పులి పాదముద్రలు కూడా అటవీశాఖ అధికారులకు లభ్యం కాలేదు. నాలుగు రోజుల క్రితం పశువులపై దాడి చేసిన గ్రామమైన శరభవరంలో మాత్రం పులి టెన్షన్ స్థానిక ప్రజలలో కనిపిస్తోంది. ఎవ్వరిని కదిపినా అది ఎక్కడికీ పోలేదని, ఏ సమయంలోనైనా దాడిచేసే అవకాశం లేకపోలేదని అందుకే భయం భయంగా బతుకుతున్నామని చెబుతున్నారు. పెద్దపులి అసలు శరభవరంలోనే ఉందా.. లేక మరో ప్రాంతానికి మకాం మార్చిందా అన్న సందిగ్ధత పలువురి నుంచి వ్యక్తమవుతోంది. అటవీశాఖ అధికారులు రెండు రోజులుగా ఈప్రాంతంలో సరిగ్గా కనిపించకపోగా కేవలం దిగువ స్తాయి అధికారులు, సిబ్బంది మాత్రమే పులి కదలికలపై ఓ వాహనం ది ద్వారా పరిశీలన చేస్తున్నారు. 

నాలుగు రోజుల క్రితం పులి దాడిలో గాయపడ్డ ఆవు దూడ బతికే అవకాశాలు లేవని వెటర్నిటీ డాక్టర్లు చెబుతున్నారు. పులి పంజా దెబ్బకు ఆవుదూడ మెడభాగం బాగా దెబ్బతినగా తల భాగం నిలబెట్టలేకపోతోంది. మేత తినడం కూడా మానేసిందని రైతు చెబుతున్నాడు. పశువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక మనుషులపై దాడిచేస్తే పరిస్థితి ఏంటని తీవ్ర కలత చెందుతున్నారు.

దాదాపు పంట పొలాలన్నీ ఖాళీ.. 
తొలకరి పంట సమయం ఆసన్నమయ్యింది. మరోపక్క తొలకరి వర్షాలు కూడా ప్రారంభం కావడంతో ప్రత్తిపాడు, శంఖవరం, ఏలేశ్వరం మండలాల పరిధిలో పొలాల్లో రైతు లతో సందడి వాతావరణం కనిపించేది.. అయితే ఇప్పుడు పెద్దపులి భయంతో ఆ పరిస్థితి పూర్తిగా కనిపించడంలేదు.. జనావాసాలకు సమీపంలో ఉన్న పొలాల్లో మాత్రమే భయం భయంగా పనులు చేసు కుంటున్నారు రైతులు.. అది కూడా ఎండ కాస్తేనే ... వాతావరణం చల్లబడితే ఆ ప్రయత్నం మానుకుంటున్నారు.

ఇంకా చేరుకోని మహారాష్ట్ర బృందం..
రాయల్ బెంగాల్ టైగర్‌ను వేటాడేందుకు మహారాష్ట్ర నుంచి తడోబా బృందాన్ని రప్పిస్తున్నట్లు ఫారెస్ట్ ఉన్నతాధికారులైతే వెల్లడించారు కానీ ఇంకా వారు శరభవరం ప్రాంతానికి చేరుకోలేదు. శరభవరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో బస ఏర్పాటు చేసుకున్నటువంటి అటవీశాఖ అధికారులు అక్కడే తమ వాహనాలను పెట్టుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఉన్నతాధికారులెవరూ రాలేదని, కేవలం కొంత మంది సిబ్బంది మాత్రం ఓ వాహనంలో తిరుగుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా అయితే పులిని పట్టుకోవడం వీరి తరం కాదని, కేవలం పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు ప్రజలే గుర్తించి వారికి సమాచారం ఇస్తుంటే అది నిర్ధారించుకోవడానికి వస్తున్నారు కానీ పులి ఎక్కడ సంచరిస్తుందో గుర్తించడానికి ప్రయత్నించడంలేదని విమర్శిస్తున్నారు. పులిభయం ప్రారంభమై ఇప్పటికి 28 రోజులు దాటిందని, ఇంతకాలం కేవలం అధికారుల వైఫల్యం వల్లనే మూడు మండలాల పరిధిలోని గ్రామాల్లో రైతులు పంటలు వేసుకోలేకపోయారని మండిపడుతున్నారు.

ఆగ్రామాల్లోనే తిష్టవేసిందని అనుమానం.. 
స్థానికులు మాత్రం పులి ఎక్కడికీ వెళ్లలేదని, కొండ అవతల అడవిలో పాగా వేసిందని చెబుతున్నారు. దానికి పశువుల అలికిడి వినిపిస్తే వెంటనే ఇటువైపుగా దూసుకువస్తుందంటున్నారు. ప్రత్తిపాడు మండల పరిధిలో శరభవరం, పొదురుపాక, పాండవులపాలెం, ఉత్తరకంచి. పెద్దిపాలెం, బావురువాక శంఖవరం మండల పరిధిలో వజ్రకూటం, నెల్లిపూడి తదితర గ్రామాలు, ఏలేశ్వరం మండల పరిధిలో పెద్దశంకర్లపూడి, చినశంకర్లపూడి తదితర గ్రామాల్లో పులిభయం నీడలా వెంటాడుతుంది.

Published at : 19 Jun 2022 01:04 PM (IST) Tags: Bengal Tiger news kakinada tiger news tiger news updates kakinada Forest news

సంబంధిత కథనాలు

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPSC Group 4 Hall Tickets: ఏపీపీఎస్సీ-గ్రూప్‌ 4 హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం

Pan-Aadhaar: పాన్-ఆధార్ లింక్‌ గడువును పొడిగించే ఛాన్స్‌, మరో 3 నెలలు అవకాశం