అన్వేషించండి

Kakinada Latest News: కాల్చి పడేస్తా! గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్  

Kakinada Latest News: గంజాయి స్మగ్లర్లకు కాకినాడ ఎస్పీ బింధు మాధవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి వేషాలు వేస్తే కాల్చిపడేస్తానంటూ హెచ్చరించారు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Kakinada Latest News: అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై కాకినాడ పోలీసులు గట్టి దెబ్బ కొట్టారు. ఇతర్రాష్ట్రాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నముఠాను పోలీసులు పట్టుకున్నారు.  ఒక లగ్జరీ కారు, అందులో లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ స్మగ్లింగ్ దందా ఏ స్థాయిలో విస్తరించిందో, వారికి లభించే లాభాలు ఎంత భారీగా ఉంటాయో స్పష్టం చేస్తున్నాయి. అధికార వర్గాలు అందించిన ప్రాథమిక సమాచారం మేరకు, ఈ కేసులో నలుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, మిగిలిన ముగ్గురు రాజస్థాన్‌కు చెందినవారు. ఈ అంతర్రాష్ట్ర బంధాన్ని ఛేదించేందుకు పోలీసు బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.  

క్రిస్టా వాహనంలో క్రిమినల్స్- లగ్జరీ కార్ల వెనుక దందా

ఈ కేసులో చిక్కిన వాహనం సాధారణమైనది కాదు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనం ఇన్నోవా క్రిస్టా. లగ్జరీ ఎస్‌యూవీగా పేరుగాంచిన ఈ వాహనం, సాధారణంగా అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారంటే, ఈ ముఠా ఎంత పకడ్బందీగా కార్యకలాపాలను నిర్వహించారో అర్థమవుతుంది. పోలీసులు అంచనా ప్రకారం, ఈ ఇన్నోవా క్రిస్టా వాహనం విలువ సుమారుగా రూ. 25 లక్షలు ఉంటుంది. కేవలం వాహనం విలువ ఇంత భారీగా ఉండటం చూస్తుంటే, ఈ రవాణాలో ఎంత పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారుతుందో తెలుస్తోంది. 

గంజాయి రవాణాకు ఉపయోగిస్తున్న ఈ వాహనం రాజస్థాన్ రిజిస్ట్రేషన్‌తో ఉంది.  ఈ నెంబర్‌ అంతర్రాష్ట్ర లింక్‌ను మరింత బలోపేతం చేస్తోంది. విచారణలో నిందితులు పేర్కొన్నదాని ప్రకారం, చిక్కిన సరకు విలువ దాదాపు రూ. 30 లక్షలు. అయితే, రూ. 25 లక్షల విలువైన వాహనాన్ని రవాణా కోసం వినియోగించారంటే, అసలు సరకు విలువ చాలా ఎక్కువగా ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే, అధిక విలువ గల వాహనాలను ఉపయోగించడం ద్వారా తనిఖీలను తప్పించుకోవచ్చని, లేదా వేగంగా గమ్యాన్ని చేరుకోవచ్చని స్మగ్లర్లు భావిస్తారు. ఈ ఇన్నోవా క్రిస్టా వినియోగం ఈ ముఠా ఆపరేషనల్ స్టైల్, రిస్క్ తీసుకునే స్వభావాన్ని తెలియజేస్తుంది.

10 రెట్లు పెరిగే లాభం 

ఈ కేసులో అత్యంత ముఖ్యమైన, పరిశోధనకు దారితీస్తున్న అంశం, రవాణా జరిగే ప్రాంతాన్ని బట్టి సరుకు విలువలో వచ్చే భారీ తేడా. అక్రమ సరకు లభించే ప్రాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు విలువ చాలా తక్కువగా ఉంటుందని, కానీ అదే సరకును రాజస్థాన్ వంటి సుదూర ప్రాంతానికి తరలిస్తే దాని విలువ ఏకంగా 10 రెట్లు పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, రూ. 30 లక్షలు విలువ చేసే సరుకును గనుక రాజస్థాన్ వరకు చేర్చగలిగితే, దాని మార్కెట్ విలువ రూ.3 కోట్లకుపైగా పెరుగుతుంది. ఒక్క ట్రిప్‌తో పది రెట్లు లాభం పొందవచ్చనే ఈ ఆర్థిక ప్రలోభం కారణంగానే, ఈ అంతర్రాష్ట్ర ముఠాలు అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన రవాణా మార్గాలను ఎంచుకుంటున్నాయి. 

గంజాయి డిమాండ్ ఉన్న ప్రాంతాలకు రాజస్థాన్, ఉత్తర భారత రాష్ట్రాలకు తరలించినప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఈ భారీ లాభాల కోసమే హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఈ నెట్‌వర్క్‌లలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందినవాడు కావడం, ఈ నెట్‌వర్క్ తెలంగాణ రాజధానిలో కూడా వేళ్లూనుకుందని అనుమానించడానికి దారితీస్తోంది. అరెస్ట్ చేయాల్సిన వ్యక్తి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పాటు రాజస్థాన్‌కు చెందిన మరో ముగ్గురు నిందితులపై కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. అరెస్టులు పూర్తయ్యే వరకు నిందితుల పూర్తి వివరాలు, వారి బ్యాక్‌గ్రౌండ్‌ తెలియజేయలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో కీలకమైన అరెస్టులు జరిగితే తప్ప, ఈ నెట్‌వర్క్ గురించి సరైన, పూర్తి సమాచారం బయటకు రాదని వారు అభిప్రాయపడ్డారు. అందుకే, వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు, హైదరాబాద్, రాజస్థాన్‌కు ప్రత్యేక టీమ్‌లను పంపించాయి. ఈ టీమ్‌లు ఫర్దర్ అరెస్ట్‌లను  ప్రభావితం చేసే అవకాశం ఉందని, తద్వారా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తిస్థాయి సూత్రధారులను పట్టుకోగలమని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతే కాకుండా మీడియాతో మాట్లాడిన కాకినాడ ఎస్పీ బింధు మాధవ్‌ స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి అక్రమ రవాణా తప్పని ఇలాంటి పనులు చేయొద్దని సూచించారు. పోలీసులు హెచ్చరికలు కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పడేస్తామన్నారు. అలాంటి రైట్‌ చట్టమే తమకు ఇచ్చిందని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దని వార్నింగ్ ఇచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Konaseema News: పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
పూలనపాన్పులా కోనసీమ రహదారులు! తిప్పుకోలేని సుందర దృశ్యాలు! మైమరిపిస్తున్న ట్రంపెట్ చెట్ల అందాలు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతి! అసెంబ్లీలో శాశ్వత చట్టబద్ధత తీర్మానం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత! అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానం,కేంద్ర చట్ట సవరణ దిశగా రాష్ట్ర కీలక అడుగు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Embed widget