అన్వేషించండి

Rajahmundry Railway Station Works : రాజమండ్రి రైల్వే స్టేషన్ పనులు ఎంత వరకు వచ్చాయి? పుష్కరాల నాటికి లక్ష్యం పూర్తి అవుతుందా?

Rajahmundry Railway Station Works : రాజమండ్రి రైల్వేస్టేషన్‌ను ఆధునిక హంగులతో భారీ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించారు. నిధులు కూడా కేంద్రం కేటాయించింది.

Rajahmundry Railway Station Works : గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఘాట్‌లను సుందరీకరిస్తున్నారు. ప్రజలు వచ్చి పుణ్య స్నానాలు చేసి సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు రహదారులను కూడా విస్తరిస్తున్నారు. అయితే అన్నింటి కంటే ముఖ్యమైన రైల్వే స్టేషన్ పునఃనిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అధునాత సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం నుంచి నిధులు మంజూరు అయినప్పటికీ వర్క్స్‌ మాత్రం టెండర్ దశ దాటి వెళ్లడం లేదు. 

రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని కేంద్రం భావించింది. అందుకే అమృత్‌ భారత్‌స్టేషన్‌ పథకంలో చేర్చారు. గతంలో ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా పనులకు శంకుస్థాపన చేశారు. అయితే భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని మరికొన్ని విస్తరణ పనులు చేస్తే ప్రయోజనం ఉంటుందని స్థానిక నాయకులు చెప్పడంతో పనులను రీడిజైన్ చేశారు. దీంతో మొత్తానికి పనులు ఆగిపోయాయి. 

Image

స్టేషన్‌ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే రైల్వే మంత్రిత్వ శాఖ 271.43 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడంతో పనులు ఊపందుకుంటాయని అంతా అనుకున్నారు కానీ టెండర్లు దశ దాటి వెళ్లడం లేదు. పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని ఈ మధ్య రైల్వే అధికారులను రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి కలిసి రిక్వస్ట్ చేశారు. టెండర్లు ఖరారు చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుతం రోజుకు 35 వేల మంది ఈ స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే గంటలకు దాదాపు పది వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 

పశ్చిమ భాగంలో కొత్తగా జీ +3 బిల్డింగ్ నిర్మించాలి. తూర్పు వైపు కూడా జీ+5 భవన నిర్మించారు. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాల్సి ఉంది. 17 ఎస్కలేటర్లు, ఏడు లిప్టుల నిర్మాణం జరగాల్సి ఉంది. ఫుడ్‌ ప్లాజాలు, ఇతర దుకాణాలకు నిర్మాణాలు చేపట్టాలి. రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి కట్టాలి. పార్కింగ్‌ సౌకర్యాలు అభివృద్ధి చేయాలి. ఇలా చాలా పనులు చేపట్టాల్సి ఉంది. ఇప్పటి నుంచి వీటిని ప్రారంభించకుంటే పుష్కరాల కాలం నాటికి పూర్తి కావని స్థానిక ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు. అందుకే కచ్చితంగా  ప్రారంభించేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Arunachalam Giri Pradakshina: అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
అరుణాచల గిరిప్రదక్షిణలో విషాదం.. మోక్షమార్గంలో చిక్కుకుని ఏపీ భక్తుడు మృతి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget