Case Filed against RGV: రాజమండ్రిలో ఆర్జీవీపై కేసు, యాంకర్ స్వప్న కూడా ఇరుక్కున్నారు! అసలు కారణం ఏంటి?
దర్శకుడు రామ్గోపాల్ వర్మపై రాజమండ్రిలో కేసు నమోదయ్యింది.. ఆర్జీవీ, యాంకర్ స్వప్నపైన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

రామ్గోపాల్ వర్మ అనగానే సంచలనం.. లేదా వివాదస్పదం.. ఆయన కేరాఫ్ అడ్రస్గా ఎవ్వరిని అడిగినా ఇదే చెబుతారు.. ఓ డిజిటల్ ఛానెల్లో యాంకర్ స్వప్న దర్శకుడు రామ్గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వూ ఇప్పడు వివాదం రేపుతోంది.. ఈ ఇంటర్యూలో ఆర్జీవీ హిందూ దేవుళ్లపైన, ఇండియన్ ఆర్మీ పైనా కించ పరుస్తూ మాట్లాడారంటూ దానికి ఊతమిచ్చే విధంగా యాంకర్ స్వప్న ప్రశ్నలు ఉన్నాయని, ఆర్జీవీ సమాధానాలకు మౌనంగా ఉన్నారంటూ రాజమహేంద్రవరంకు చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 487/2025, U/s 196 (1), 197(1) 353, 354,299 R/w (3) Bns Act, కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీడియో ఆధారంగా ఫిర్యాదు..
రాము ఇజం పేరుతో ఓ డిజిటల్ ఛానెల్లో యాంకర్ స్వప్న రామ్గోపాల్ వర్మతో చాలా ఇంటర్వ్యూలు చేసింది.. ఇందులో పలు ఇంటర్వూలలో భారతీయ హిందూ ఇతిహాసాలు మహాభారతం, రామాయణం తదితర అంశాలపై రామ్గోపాల్ వర్మ చాలా సందర్భాలు చెబుతూ పలు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, ఆంధ్రులను కించ పరిచేవిధంగా ఆయన వ్యాఖ్యలున్నాయని రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము ఇజం పేరుతో ఈ ఇంటర్వ్యూ చేసి చాలా కాలం కూడా అయ్యింది..
దర్శకుడు ఆర్జీవీ, యాంకర్ స్వప్నలపై కేసు నమోదు
దర్శకుడు రామ్గోపాల్ వర్మ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపణ చేస్తోన్నటువంటి ఫిర్యాది మేడా శ్రీనివాస్ ఇటువంటి మాటలు సమాజంలో మతపరమైన, ప్రాంతీయ విద్వేషాలను పెంచుతాయని ఫిర్యాదిలో పేర్కొన్నారు. ఇక ఇంటర్వ్యూ నిర్వహించిన యాంకర్గా స్వప్న మౌనంగా ఉండి, ఆ వ్యాఖ్యలకు పాలుపంచుకున్నపరిస్థితి ఆ ఇంటర్వ్యూలో కనిపించిందని అందుకే ఆమెపై కూడా కేసు పెట్టినట్టు ఆయన వెల్లడించారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ఫిర్యాదు చేసిన మేడా శ్రీనివాస్ ఫిర్యాదుతో పాటు సోషల్ మీడియా (ఫేస్బుక్, యూట్యూబ్)లో అప్లోడ్ అయిన ఇంటర్వ్యూ వీడియోలు, ఆటోగ్రాఫ్ పోస్టులను ఆధారాలుగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ గా సమర్పించారు. బిఎన్ఎస్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) యాక్టు కింద కేసు నంబర్ 487/2025, సెక్షన్లు 196(1), 197(1), 353, 354, 299 (అభిప్రాయ వ్యక్తీకరణలు, మత విద్వేషాలు, పబ్లిక్ ట్రాన్క్విలిటీ డిస్టర్బెన్స్కు సంబంధించినవి) కింద నమోదు చేశారు.




















