అన్వేషించండి

Nadendla Manohar: వివేకా హ‌త్య‌కేసు - మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కేసులో సాక్షుల వ‌రుస మ‌ర‌ణం అనుమాన‌స్పందంగా ఉంద‌ని, దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేయిస్తామ‌ని మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

YS Viveka Murder Case | వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య‌కేసులో నిందితులు, సాక్షులు వ‌రుస మ‌ర‌ణాలు అనుమాన‌స్ప‌దంగా ఉంద‌ని, కుట్ర‌కోణం దాగిఉందా అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయ‌ని ఏపీ సివిల్ స‌ప్లై శాఖ మంత్రి, జ‌న‌సేన పీఏసీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై ద‌ర్యాప్తు చేస్తామ‌ని ఆయ‌న అన్నారు.  ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ఆయ‌న‌ అన్నారు. శనివారం రాత్రి జగ్గంపేటలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభ విజయవంతం చేయడంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

గ్రావెల్ పై సంపాదన గురించి వైసీపీ నాయకులు

వైసీపీ నాయకులు గత ఐదేళ్లు దుర్మార్గంగా పాలించారు. సొంత ఆస్తులను పెంచుకోవడానికి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ ను ఏ విధంగా దోచుకున్నారో...   గ్రావెల్ కోసం శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకున్నారో మనందరం చూశాం. స్థానిక వైసీపీ నాయకులు గ్రావెల్ పై వచ్చిన సంపాదన గురించి ఆలోచించారు తప్ప ... యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన చేయలేదని  మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.  రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఎలా విధులు నిర్వర్తిస్తున్నారో మనం చూశాం. గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడైనా పల్లెల్లో పండగ వాతావరణం చూశామా..? ప‌వ‌న్‌ కళ్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ ఎనిమిది నెలల కాలంలో గ్రామాల్లో 3300 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారు. ఒకే రోజు 13371 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి. ప్రజల పక్షాన బలమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.. 

వివేకా హత్య కేసులో సాక్షుల మరణం అనుమానాస్పదం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఒక వైపు విచారణ కొనసాగుతుంటే... మరో వైపు ఆ హత్యకు సంబంధించిన సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణిస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తాం. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్ ను చంపి డోర్ డెలివరి చేశాడు. ఐదేళ్లు దౌర్జన్యంగా వ్యవహరించిన ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యం, పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఎప్పుడు విలువలతో కూడిన రాజకీయమే చేస్తుంది. అన్నవరంలో వారాహి యాత్ర మొదలైనప్పుడు ప్రజలకు అండగా ఉంటామని మాట ఇచ్చాం. మాటకు కట్టుబడి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిపెడుతున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇప్పటి వరకు రూ. 900 కోట్లు ఖర్చు చేసి 96 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించాం. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేమని గత ప్రభుత్వం అంటే... వాలంటీర్లు లేకపోయినా కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీనే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అందిస్తోంది. గత ప్రభుత్వం రైతులకు రూ.1674 కోట్ల ధాన్యం బకాయిలు పెండింగ్ పెడితే ... కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే బకాయిల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొన్న 24 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. ఒక్క ఖరీఫ్ సీజన్ లోనే రూ. 7800 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు చేశాం. రూ. 7752 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమచేశాం అని తెలిపారు. 

మీ అందరి కష్టంతోనే మాకు పదవులు 

జనసేన పార్టీ ప్రస్థానం మొదలైనప్పుడు ఎవరూ పదవుల కోసం ఆలోచన చేయలేదు. ఈ రోజు మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులుగా అసెంబ్లీలో కూర్చున్నాం అంటే దానికి ప్రధాన కారణం జన సైనికులు, వీర మహిళలు క్షేత్రస్థాయిలో పడిన కష్టం. మీరు లేనిదే మేము లేము. మీరందరూ క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసి మేము గెలిచేలా చేశారు. పార్టీలో నాయకులు ఉన్నా లేకపోయినా జనసేన జెండా పట్టుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. మీలాంటి జన సైనికులు, వీరమహిళలకు కృతజ్ఞతలు చెప్పడానికే ఈ సభ.  పండగ వాతావరణంతో సభను నిర్వహిద్దాం. మన అధినాయకుడు ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో ఈ సభను నిర్వహిస్తున్నాం.  ఊరూవాడ అంతా సభకు తరలి వచ్చేలా చూసి సభను జయప్రదం చేద్దామన్నారు.  
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఛైర్మన్  తుమ్మల బాబు, జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జి  తుమ్మలపల్లి రమేష్, మండపేట నియోజక వర్గ ఇంఛార్జి వేగుళ్ళ లీలాకృష్ణ, ఆవిర్భావ సభ జగ్గంపేట నియోజక వర్గ సమన్వయకర్తలు అక్కల గాంధీ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget