అన్వేషించండి

Nidadavolu: ఎర్రకాలువ ముంపునకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల

Andhra Pradesh News | నిడదవోలులో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.

తూర్పు గోదావరి జిల్లా లోని నిడదవోలు సమీపంలోని ఎర్ర కాలువ వర్షాకాలం వచ్చింది అంటే చాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత ఏడాది అంటే 2024 జూలై  నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల ధాటికి నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన 4,631 మంది రైతులకు రూ.5.22 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ  అందించినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్  వెల్లడించారు.  

చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు

ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ చొరవతో తమకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కావడంపై నియోజకవర్గ బాధిత రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలపడమే గాక, సమస్యల పరిష్కారంలో చూపిన చొరవను ప్రశంసించారు. 

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2024 జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ పొంగిపొర్లి, పలు గ్రామాల్లో పంటలు ముంపుకు లోనయ్యాయన్నారు. ఆ పరిస్థితులను తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి పేర్కొన్నారు. అనేక ప్రాంతాల్లో  3,071.41 హెక్టార్లలో పంటలు నష్టపోయి రైతులు ఆర్థికంగా  ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను గమనించి సమస్యను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి 4,631 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 5 కోట్ల 22 లక్షల 919 వేల పంట నష్టపరిహార సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడం, నాట్లు వేస్తున్న సమయంలో ఈ ఇన్ పుట్ సబ్సిడీ సాయం అందడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు.

ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వం ఎర్రకాలువ వరద నియంత్రణకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం ఏ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రతి సంవత్సరం రైతులు నష్టాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎర్రకాలువ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఎర్రకాలువ ముంపు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని వెల్లడించారు.

ఎర్ర కాలువ వరద అంటేనే రైతుల గుండెల్లో భయం

నిన్నా మొన్నటి వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే నిడదవోలు తదితర ప్రాంతాల గుండా  ఎర్ర కాలువ ప్రవహింస్తుంది. అక్కడ వ్యవసాయానికి ఈ కాలువ చాలా అవసరం. కానీ దీని గట్లు సరిగా ఉండకపోవడం వల్ల వర్షాలు గట్టిగా కురిస్తే  చుట్టుపక్కల వ్యవసాయ భూములు జలమయమైపోతాయి. ఒకప్పుడు అయితే ఈ కాలువ వరద దెబ్బకి  రైలు కూడా నిలిపేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైల్వే ట్రాక్ ఎత్తు పెంచడం  ఎర్రకాలువ గట్లను ఆ ప్రాంతం లో విశాలం చేయడంతో  ఎర్రకాలువ వరద వల్ల రైళ్లకు ప్రాబ్లం ఉండట్లేదు.

నిడదవోలు నియోజకవర్గానికి చెందిన ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ఎర్ర కాలువ వరద బారిన తరచు పడుతున్నాయి. ఎర్ర కాలువ గట్లను వెడల్పు చేసి  వాటి ఎత్తు పెంచితే  వరద ముంపు నుంచి పొలాలు   తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీనిపై ఎప్పటినుంచో డిమాండ్ అయితే ఉంది. దీని ని త్వరలోనే నెరవేరుస్తామని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కందుల దొరికేసి అంటున్నారు. మరి ఎంత త్వరగా  ఆ హామీ నెరవేరుద్దో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
India vs Australia second T20I : భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
Embed widget