అన్వేషించండి

MP Margani Bharath: పవన్‌ కల్యాణ్ కు విలువలు, విశ్వసనీయత లేవు - ఉంటే పడిగాపులు కాయరు

MP Margani Bharath: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎంపీ మార్గాని భరత్ తీవ్ర విమర్శలు చేశారు. జనసేనానికి విలువలు, విశ్వసనీయత లేదని అన్నారు.

MP Margani Bharath: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విలువలు, విశ్వనసీయత లేవని.. అవే ఉంటే ఢీల్లీ పెద్దలు కలిసేవారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. నేతలను కలిసేందుకు వెళ్లి పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అజెండా మోయడానికే జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారనే విషయం ప్రజలకు అర్ధమవుతుందన్నారు. నేతల అపాయిట్‌మెంట్‌ దొరక్క మూడు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నారున్నారని వైసీపీ ఎంపీ విమర్శించారు.

పవన్‌ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. బీజేపీ పెద్దలను గతంలో పాచిపోయిన లడ్డూలని, అవి మాకు అవసరం లేదని చెబుతూ జనసేనాని బయటకు వచ్చారని గుర్తు చేశారు. ఏ సఖ్యత కుదిరిందని బీజేపీతో పవన్‌ కల్యాణ్ కలిశారని ప్రశ్నించారు. అలాగే గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మోసం చేశాడని పవన్ కల్యాణ్ దుమ్మెత్తిపోశారని.. మరి ఇప్పుడెలా స్నేహం కుదిరిందని జనసేనానిని ఎంపీ భరత్ ప్రశ్నించారు. 

చంద్రబాబు అజెండా మోయడమే పని.. 
టీడీపీ అధినేత చంద్రబాబు అజెండా మోయడమే పనిగా పెట్టుకున్న పవన్‌ కల్యాణ్ ఆయన్ను కలుస్తూ ఉన్నారని ఎంపీ భరత్‌ విమర్శించారు. వైసీపీ దగ్గర ముసుగులో గుద్దులాటలు ఉండవన్నారు. ఏదైనా చేస్తామని చెప్పామంటే చేస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా చెబుతా ఉన్నామని అన్నారు. గతంలో రైతు రుణమాఫీ చేయలేమని చెప్పామని.. చంద్రబాబు చేస్తానని చెప్పి చేయలేకపోయాడని గుర్తు చేశారు. విశ్వసనీయతకు, విలువలకు నిలువుటద్దం జగన్ మోహన్‌ రెడ్డి అని ఎంపీ భరత్ వివరించారు. ఈ పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు మాట్లాడే మాటకు రేపు మాట్లాడే మాటకు ఏమాత్రం పొంతన ఉండదంటూ ఎద్దేవా చేశారు. విశ్వసనీయత అనే పదం చంద్రబాబుకు కానీ, పవన్‌ కల్యాణ్‌కు కానీ మచ్చుకైనా కనబడడం లేదని విమర్శించారు.

మిత్రధర్మాన్ని పవన్ విస్మరించారు.. 
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు మిత్రపక్షమని చెబుతున్నారు. అక్కడ మాధవ్‌ అని సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మళ్లీ పోటీ చేస్తే మిత్రపక్షం కింద ఉన్న జనసేన మిత్ర ధర్మం పాటించాల్సింది పోయి కనీసం పట్టించుకోలేదని అన్నారు. పవన్‌ కల్యాణ్ షూటింగ్‌ ల బిజీ అయితే కనీసం కార్యకర్తల ద్వారా అయినా మద్దతు తెలపాలని చెప్పుకొచ్చారు. అది కూడా చేయలేదని స్వయంగా మాధవ్‌ బాధపడిన సందర్భం ఉందని తెలిపారు. ఢిల్లీ వెళ్తున్న పవన్‌ కల్యాణ్ కు విశ్వసనీయత అనేది లేదని, అందుకే ఢిల్లీలో బీజేపీ పెద్దలు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని చెప్పారు. మీ వెనుక తిరుగుతున్న ఫ్యాన్స్‌ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పవన్‌ కల్యాణ్ చేస్తున్న పనులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. విలువలు విశ్వసనీయత లేకపోతే ఢిల్లీ పెద్దలు కూడా ఎందుకు మీకు విలువ ఇస్తారన్నారని ప్రశ్నించారు. మిత్రధర్మం అలియన్స్‌లో ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించాలని సూచించారు. తెలుగోడిగా ఢిల్లీలో పడిగాపులు కాస్తుంటే మీ ఫ్యాన్స్‌ పరువు తీస్తున్నారని ప్రజలకు అనిపిస్తుందని విమర్శించారు. అది గమనించుకుంటే మంచిదని ఎంపీ భరత్‌ హితవు పలికారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Director Shankar : డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
డిఫరెంట్​గా ఉన్నా ఎంజాయ్ చేశా, ‘గేమ్ ఛేంజర్‘ గురించి కీలక అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్
Rahul Gandhi: లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం - స్పీకర్ ఆదేశాలతో ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
Sharmila : విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
Embed widget