అన్వేషించండి

Konaseema latest News: ఈనెల 31న కోన‌సీమ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పర్యటన

Konaseema latest News: ప‌లు సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు ఈనెల 31న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అంబేడ్క‌ర్ కోనసీమ జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు.

Konaseema latest News: ఈనెల 31న అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్య‌టించనున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక కోన‌సీమ ప్రాంతానికి ఇది రెండోసారి వస్తున్నారు.  ఈసారి ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని చెయ్యేరు గ్రామంలో జ‌ర‌గ‌నున్న బంగారు కుటుంబం (పీ4) కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్ మ‌హేష్‌కుమార్ సార‌థ్యంలో  అధికారులు శ‌ర‌వేగంగా నిర్వ‌హిస్తున్నారు. 

అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం...

ఈనెల 31వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు వారు ముమ్మిడివరం కాట్రేనికోన మండలాల‌లో పర్యటించనున్న నేప‌థ్యంలో  జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు త‌దిత‌ర అధికారులు ముంద‌స్తు ఏర్పాట్ల‌పై ప‌లు శాఖ‌ల అధికారుల‌తో ఆప్రాంతాన్ని ప‌రిశీలించి ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేసేదిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 31న ముఖ్యమంత్రివర్యులు చెయ్యేరు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రూ 9. 88 లక్షలతో చేపట్టిన చెరువు పూడికతీత పనులు పరిశీలించి స్థానికంగా  పింఛన్ లబ్ధిదారులకు ఒక రోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేస్తారని తెలిపారు.

ప్రజా వేదిక వద్ద ప్రభుత్వ, దాతలు, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన ( పి4) పథకం బంగారు కుటుంబం లబ్ధిదారులు, మార్గదర్శకులను ముఖ్యమంత్రి వర్యులు ఆప్యాయంగా మర్యాదపూర్వకంగా పలకరించి ముచ్చటిస్తూ కోనసీమ జిల్లాలో (పి4) పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలుత ముఖ్యమంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులను మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని తదుపరి చెరువు పూడికతీత పనులు పరిశీలించి స్థానికంగానే పింఛన్లు లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తారు. తదుపరి ప్రజావేదిక చేరుకుని పి4 పథకాన్ని ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.

 వేదిక వద్దే పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతారన్నారు. ముఖ్య మంత్రి వర్యుల పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయని, సీఎంఓ కార్యాలయ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారని వీరి పర్యటన అనంతరం పర్యటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ ప్రోగ్రాం ఫైనలైజ్  అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి డిఆర్ఓ రాజకుమారి డ్వామా పథక సంచాలకులు ఎస్ మధుసూదన్ ఆర్డీవోలు పి శ్రీకర్ కే మాధవి డిఎల్డివో రాజేశ్వరరావు సీఎమ్ఓ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కోన‌సీమ‌కు రెండోసారి..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు ఇది రెండోసారి.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ‌హించిన గ్రామ‌స‌భ‌ల కార్య‌క్ర‌మంలో భాగంగా  కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో వాన‌ప‌ల్లి గ్రామస‌భ‌లో ఆయన పాల్గొన్నారు. తాజాగా ప్ర‌భుత్వం, దాత‌లు, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో రూప‌క‌ల్ప‌న చేసిన పీ4 ప‌థ‌క బంగారు కుటుంబం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి పాల్గొన‌నున్నారు.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం
AP Matsyakara Bharosa 2026 : మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!
మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల ఖాతాల్లో నగదు! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget