అన్వేషించండి

Cell Phones Recovery : సెల్ ఫోన్ మిస్సైందా? చాట్ బాట్ కు హాయ్ చెబితే దొరికేస్తుంది!

Cell Phones Recovery : చోరీకి గురైన, మిస్సైన సెల్ ఫోన్ల రికవరీ కోసం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు చాట్ బాట్ సేవలు ప్రారంభించారు. తాజాగా మరో 170 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు.

Cell Phones Recovery : చోరీకి గురైన, పోగొట్టుకున్న 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి శనివారం ఆ ఫోన్లను బాధితులకు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం చాట్ బాట్( CHAT BOT) సేవలను ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ల మిస్సింగ్ కేసులు ఎక్కువైనందున, పోగొట్టుకున్న మొబైల్స్ ను బాధితులకు అందజేసేందుకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా మిస్సింగ్ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేస్తున్నామన్నారు.  

మొత్తం 220 ఫోన్స్ రికవరీ 

మొదటి విడత "CHAT BOT" సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే సుమారు రూ. 22,30,500/- విలువ చేసే 120 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు వారి ఫోన్లను అందజేశామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. రెండో విడత గా సుమారు 28 రోజుల వ్యవధిలోనే "CHAT BOT" సేవల ద్వారా సుమారు రూ.36,00,000/- విలువ చేసే 170 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి చేతికందడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. "CHAT BOT" సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు Rs.58,30,500/- విలువ చేసే 220 మొబైల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ తెలిపారు. 

దొరికిన ఫోన్ వాడుకోవద్దు 

ఫోన్ చోరీకి గురైనా, మిస్ అయిన వారు “CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. వాట్సాప్ నంబర్ 9493206459కు HI లేదా HELP అని మెసేజీ పంపాలన్నారు.  ఇలాంటి సేవలతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం పరుచుకొని పోగొట్టుకున్న మొబైల్స్ ను పొందవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఎవరికైనా సెల్ ఫోన్ దొరికితే సొంతానికి వాడుకోవడం కానీ, గుర్తు తెలియని వ్యక్తులు ద్వారా బిల్లులు లేని సెల్ ఫోన్ లను కొనడం కాని చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు. మీకు దొరికిన సెల్ ఫోన్ లను దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి అందజేయాలని కోరుతున్నారు. 

"సెల్ ఫోన్ రికవరీ కోసం చాట్ బాట్ సేవలు ప్రారంభించాం. గతంలో 500 ఫిర్యాదులు వచ్చాయి. వాటిల్లో మాగ్జిమన్ ట్రేస్ చేసి రికవరీ చేసి ఓనర్స్ కి తిరిగి ఇచ్చాం. మళ్లీ 500 కంప్లైంట్స్ వచ్చాయి. వాటిని కూడా ఎనలైజ్ చేసి చాలా వరకు సెల్ ఫోన్లను రికవరీ చేశాం.  170 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ తిరిగి ఇచ్చాం. రూ.50 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసి వాటిని ఓనర్స్ కు తిరిగి ఇచ్చాం. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ ట్రేసింగ్ టీమ్ ను ఫామ్ చేశాం. వీళ్లు రెగ్యులర్ గా ఇదే పనిలో ఉండి మొబైల్స్ ట్రేస్ చేసి ఇస్తున్నాం." - ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Grok AI: 'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
'X'కు నోటీసు పంపిన కేంద్రం! గ్రోక్ ఏఐ నుంచి అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం! 72 గంటల గడువు
What Indians Ate On New Year: సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
సెకనుకు 1300 కిలోల బిర్యానీ ఆర్డర్ అమ్మేశారు... ఆన్‌లైన్‌లో న్యూ ఇయర్‌కు ఇంకేం ఆర్డర్ చేశారో తెలుసా?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
IIT హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి 25 కోట్ల ప్యాకేజీ! ఈ స్థాయి జీతం ఇస్తున్న కంపెనీ ఏదీ?
Best Foods to Eat Raw : ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
ఈ 9 ఆహారాలు పచ్చిగానే తినాలి.. పొరపాటున వండితే పోషకాలు తగ్గిపోతాయట
Embed widget