అన్వేషించండి

Polavaram Floods : పోలవరం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

Polavaram Floods : పోలవరం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుంది. గంటకు 25 సెం.మీటర్ల చొప్పున నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Polavaram Floods : పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మిక భారీ వరద పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. పోలవరం స్పిల్ వే దగ్గర 30.1 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ అర్ధ రాత్రికి 6 ల‌క్షలు రేపు ఉద‌యానికి 12 ల‌క్షల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌స్తుంద‌ని అంచనా వేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మికంగా గోదావరికి వరద పెరిగింది. గతంలో జులై నెలలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చేది.  

గంటకు 25 సెం.మీ పెరుగుతోన్న నీటిమట్టం  

ఆకస్మికంగా వరదలు రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దిగువ కాఫర్ డ్యామ్ దగ్గర గోదావరి నీటి మట్టం 19.5 మీటర్లు ఉంది. దిగువ కాఫర్ డ్యామ్ 21 మీ ఎత్తు పూర్తైంది. గంటకు 25 సెంమీ చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. అర్ధరాత్రికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహంతో దిగువ కాఫర్ డ్యా్మ్, గ్యాప్-2 పనులు పూర్తిగా నిలిచిపోయే అవ‌కాశం ఉంది. గోదావరి వరద ఉద్ధృతికి దాచారం కుక్కునూరు మధ్యలో రోడ్డు మునిగిపోయింది. 

4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు 

ఎగువ నుంచి గోదావరిలోకి వరద జోరుగా ప్రవహిస్తుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజి తలుపులు అన్నీ ఎత్తి 4 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని శనివారం దిగువకు వదిలారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద అంతా పోలవరానికే వస్తుంది. ఎగువ నుంచి ప్రవాహాలు ఎక్కువే ఉండడంతో  పోలవరం స్పిల్‌ వే గేట్లు తాత్కాలికంగా మూసి పనులు చేయాలనే ఆలోచనకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా పునరావాసం పనులను పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా వందల కుటుంబాలను అక్కడి నుంచి తరలింపు జరగలేదు. పోలవరం వద్ద గోదావరి వరద వేగంగా పెరుగుతోంది. ఎగువ కాఫర్‌ డ్యాం 42.5  మీటర్ల ఎత్తుకు నిర్మించడంతో స్పిల్‌ వే మీదుగా నీటిని వదిలేసినా ఎగువ కాఫర్‌ డ్యాంపై ప్రభావం ఉంటుంది. పునరావాస కాలనీల నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడం వల్ల నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
Advertisement

వీడియోలు

Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Zohran Mamdani won Newyork Mayor Election |  న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam
పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar Election 2025:  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం 121 స్థానాల్లో పోలింగ్; బరిలో 16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు
Andhra ACB Raids: ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
ఒకే సారి 120 చోట్ల ఏసీబీ రెయిడ్స్ -ఏపీలో భారీ ఆపరేషన్ -సంచలన వివరాలు
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan:  అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ -  కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
అవనిగడ్డ ఎదురుమొండి దీవుల ప్రజల చిరకాల కోరిక తీరుస్తున్న పవన్ - కృష్ణా నదిపై హై లెవల్ వంతెన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
YSRCP Leader Roja: తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
తమిళ సినిమాల్లో బిజీ అవుతున్న రోజా - టీవీ షోలు కూడా - రాజకీయాలకు దూరమేనా?
Mexican president kiss: మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
మెక్సికో అధ్యక్షురాలికి చేదు అనుభవం - ప్రజల కష్టాలు తెలుసుకుంటూంటే హత్తుకుని ముద్దుపెట్టుకున్న వ్యక్తి !
India Test Team Against South Africa : దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ జట్టును ప్రకటించిన BCCI, టీంలోకి వచ్చిన రిషబ్ పంత్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Embed widget