అన్వేషించండి

AP Petrol Price Fact Check: ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువని పురంధేశ్వరి ట్వీట్ - ఏపీ సర్కార్ రియాక్షన్ ఇదీ

Taxes on petroleum high in Andhra Pradesh: ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం పలుమార్తు ఇంధన ధరలను సవరించినప్పటికీ రాష్ట్రం ఎందుకు తగ్గించదని ప్రశ్నించారు

Taxes on petroleum high in Andhra Pradesh:

ఆంధ్రప్రదేశ్ లో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేంద్రం పలుమార్తు ఇంధన ధరలను సవరించినప్పటికీ రాష్ట్రం మాత్రం ఎందుకు తగ్గించదని ఆమె ప్రశ్నించారు.

పెట్రోలియం ధరలపై పురంధేశ్వరి పోస్ట్...
 ఆంధ్రప్రదేశ్ లో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఎందుకు అలా జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలియం ధరలపై కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పన్ను తగ్గించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు ధరల పై మాట్లాడదని నిలదీశారు. ప్రజలకు ఊరట నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ఆమె ప్రశ్నించారు. భారత్ దేశ మ్యాప్ లో ఎ రాష్ట్రంలో పెట్రోలియం ధరలు ఎంత ఉన్నాయని, వెల్లడిస్తూ ఏర్పాటు చేసిన పోస్ట్ ను ఆమె ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు.

కేంద్రం గ్యాస్ ధరలను తగ్గించింది...
కేంద్ర ప్రభుత్వం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్ల పై రూ.400 తగ్గించిందని దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పన్నులు విధిస్తూ, వసూళ్ళు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అభివృద్ధి ఎక్కడ అని ఆమె ప్రశ్నించారు. పెట్రోలియం ధరలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ గా ఎందుకు ఉన్నాయి అని  ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వానికి లేదా అని అడిగారు. కేంద్రం సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నుల బాదుడులో ఇస్టానుసారంగా వ్యవహరించటం పై ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుందని పురంధేశ్వరి అన్నారు. 

AP Petrol Price Fact Check: ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువని పురంధేశ్వరి ట్వీట్ - ఏపీ సర్కార్ రియాక్షన్  ఇదీ

అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ఉందన్న సర్కార్...
ఇంధన ధరల వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఫాక్ట్ చెక్ లో వివరణ ఇచ్చింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా ముడిచమురు ధరలు, వాటి ప్రభావం దేశం మీద, మన రాష్ట్రం మీద పడిందన్న విషయం అందరికీ తెలిసిందేనని సర్కార్ వెల్లడించింది. పెట్రోలు, డీజిలు ధరలు అధికంగా ఈ ప్రభుత్వంలో మాత్రమే ఉన్నట్టుగా ప్రచారం జరగటం సరికాదని , పెట్రోలు, డీజిలు ధరల పై అదనంగా వ్యాట్ ను మోపింది గతంలో ఉన్న తెలుగుదేశం సర్కార్ అని వెల్లడించింది.  2015, ఫిబ్రవరికి ముందు పెట్రోలు పై 31శాతం వ్యాట్, డీజిలు పై 22.5 శాతం వ్యాట్ ఉండేదని, గత ప్రభుత్వం ఈ రేట్లను పూర్తిగా మార్చి, పెంచిందని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. అప్పుడున్న రేట్లకు అదనంగా పెట్రోలుపై లీటరకు రూ.4లు చొప్పున, డీజిలు పై లీటరుకు రూ.4లు చొప్పున ధరలు పెంచింది గత ప్రభుత్వమే అని వెల్లడించారు.  

వైఎస్ఆర్ సీపీ అదికారంలోకి వచ్చాక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, అయితే కోవిడ్ మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేసిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఏడాదికి రూ.30వేల కోట్ల రూపాయలు కోల్పోవాల్సి వచ్చిందని, మరో వైపు గత ప్రభుత్వం క్రమం తప్పకుండా చేయాల్సిన  రోడ్ల మరమ్మతులను గాలికి వదిలేయడంతో పాటు, ఈ నాలుగు సీజన్ల పాటు కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ తీవ్రంగా పాడయ్యాయని, ఒకేసారి అన్ని రోడ్లూ మరమ్మతులు చేయాల్సి వచ్చిందని ఫ్యాక్ట్ చెక్ లో పేర్కొన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రూపాయిని లీటరు పెట్రోలు, డీజీలుపై పెంచిందని స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget