అన్వేషించండి

Breaking News Telugu Live Updates: మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

LIVE

Key Events
PSLV-C55 launch AP Telangana Breaking News Telugu Live updates on 22 April 2023 Breaking News Telugu Live Updates: మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్

Background

18:25 PM (IST)  •  22 Apr 2023

మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో భాగంగా తాను ఎవరితోనూ డబ్బులు తీసుకోలేదన్నారు. డబ్బులు పంచం, చుక్క మందు కూడా పోయం అని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. అదే విధంగా ఎన్నికల్లో పోరాడామన్నారు. కానీ బీజేపీ నేతలు ఈడీ, సీబీఐలు తమ వద్దే ఉన్నా, ఈటల రాజేందర్ ఇష్టరీతిన మునుగోడు ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, పాల్వాయి స్రవంతికి బీఆర్ఎస్ నుంచి నగదు సహాయం లభించిందని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేవు కనుక ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదని, ప్రమాణం చేయలేదన్నారు.

18:24 PM (IST)  •  22 Apr 2023

తాను ఎవరినీ కించపరచలేదన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల

తాను ఎవరినీ కించపరచలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వ్యక్తిగతంగా ఎవర్నీ టార్గెట్ చేయలేదని, ఆత్మసాక్షిగానే ప్రమాణం చేశానన్నారు ఈటల. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. 

18:18 PM (IST)  •  22 Apr 2023

భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ఆరోపణలు చేశారు. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా వచ్చి ప్రమాణం చేయాలని ఈటలకు సవాల్ విసిరారు రేవంత్. చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. కానీ ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదు.

18:07 PM (IST)  •  22 Apr 2023

భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. చెప్పినట్లుగానే ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నుంచి రూ.25 కోట్లు తీసుకోలేదని తాను ప్రమాణం చేసి, ఈటల ఆరోపణలపై మాట్లాడతానన్నారు. అయితే రేవంత్ విసిరిన సవాల్ కు ఈటల స్పందించలేదు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎమ్మెల్యే ఈటల రాలేదు. ప్రమాణాల సవాల్ నేపథ్యంలో చార్మినార్, భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

17:25 PM (IST)  •  22 Apr 2023

ప్రమాణానికి సై - భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరిన రేవంత్ రెడ్డి

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు. సీఎం కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేస్తానని, బీజేపీ ఎమ్మెల్యే ఈటల కూడా ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను చేసిన సవాల్ లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రేవంత్ రెడ్డి బయలుదేరారు. మరికాసేపట్లో అక్కడికి చేరుకుని ప్రమాణం చేయనున్నారు రేవంత్ రెడ్డి. అయితే బీజేపీ నేత ఈటల ఎక్కడున్నారు, ఆయన కూడా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notificication: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP DesamSanjiv Goenka Scolding Rishabh Pant | DC vs LSG మ్యాచ్ ఓడిపోగానే పంత్ కు తిట్లు | ABP DesamAshutosh Sharma 66 Runs DC vs LSG Match Highlights | అశుతోష్ శర్మ మాస్ బ్యాటింగ్ చూశారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notificication: నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
నిరుద్యోగులకు శుభవార్త, మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
SLBC Tunnel Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
Kakani Govardhan Reddy: మైనింగ్ అక్రమాలు, మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు
LRS In Telangana: ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు లేదు, ఈ 31లోగా చెల్లించే వారికే రాయితీ వర్తింపు: మంత్రి పొంగులేటి
Polavaram Banakacherla Interlinking Project : 81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
81,900 కోట్లతో పోలవరం-బనకచర్ల అనుసంధానానికి ప్లాన్, ఖజానాపై భారం పడకుండా పూర్తి చేయాలంటున్న చంద్రబాబు
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Rishabh Pant Trolls: స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. రూ.27 కోట్ల ప్లేయర్ రిషబ్ పంత్ డకౌట్ పై ట్రోలింగ్ మామూలుగా లేదు
Crime News: యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
యూపీలో మరో దారుణం, పెళ్లయిన 15 రోజులకే భర్తను హత్య చేయించిన భార్య
Embed widget