By: ABP Desam | Updated at : 23 Mar 2022 03:45 PM (IST)
విజయవాడ ఎక్సైజ్ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్
నాటు సారా మరణాలు, కల్తీ మద్యం బ్రాండ్లపై ప్రభుత్వ వైఖరిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కార్యాలంయలో వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవాని, బెందాళం అశోక్, మరికొంత మంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే వారు వస్తున్న సమాచరం తెలుసుకున్న పోలసులు ముందుగానే పెద్ద ఎత్తున మోహరించారు.
విరెడ్డి అసెంబ్లీలో ఎందుకలా చేస్తున్నారు? సెంటిమెంటా? భక్తా?
టీడీపీ కార్యకర్తలెవరూ అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలువస్తున్న బస్సును కూడా అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నడుచుకుంటూ ఎక్పైజ్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో అక్కడ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి తారస్థాయికి చేరడంతో ప్రసాదంపాడు వద్ద పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
బ్యాంకుల్లో పని ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి.. లేకపోతే మళ్లీ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లోనే.. !
ఎక్సైజ్ కమిషనర్కు వినతిపత్రం ఇస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించారు. శాంతియుత నిరసనను అడ్డుకోవడం దారుణని.. అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. కల్తీ సారా మరణాలు, కల్తీ మద్యం అమ్మకాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతీ రోజూ టీడీపీ సభ్యులు నోటీసులు ఇస్తున్నారు. అయితే చర్చకు అనుమతించడం లేదు. దీంతో వారు ఆందోళన చేస్తున్నారు. స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. ఈ కారణంగా టీడీపీ సభ్యులు సభకు హాజరవుతున్నారు కానీ వెంటనే సస్పెండ్ అవుతున్నారు. ఈ కారణంగా సభలో వారి వాయిస్ వినిపించడం లేదు.
గుడివాడ అమర్నాథ్పై పరువు నష్టం దావా - ఆరోపణలకు ఆధారాలు చూపించాలన్న మాజీ నిఘా చీఫ్ !
ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ సారా, కల్తీ మద్యంపై చర్చకు అనుమతిస్తే నిజాలేంటో బయటకు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అమ్ముతున్న బ్రాండ్లకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర సందర్భాల్లో చెబుతున్నారు కానీ చర్చకు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోరాటం కొనసాగిస్తున్నారు. కల్తీ సారా, కల్తీ మద్యం బ్రాండ్లపై పోరాటమే ఎజెండాగా పెట్టుకున్నారు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్
Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
Andhra News: 'తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు అందించాలి' - సీఎం రైతుల బాధలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం
Rajahmundry Airport: రూ.347 కోట్లతో రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులు: మార్గాని భరత్
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
/body>