By: ABP Desam | Updated at : 23 Mar 2022 02:51 PM (IST)
అనకాపల్లి ఎమ్మెల్యేలపై ఏబీవీ పరువు నష్టం దావా !
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ( Gudivada Amarnath ) చేసిన వ్యాఖ్యలను తాను వేయబోయే పరువు నష్టం కేసులో పొందు పరుస్తానని సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ( AB Venkateswar Rao) ప్రకటించారు. గుడివాడ అమర్నాథ్ మంగళవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన హోంగార్డుగా కూడా పనికి రారన్నారు. అలాగే ఆయన ఐపీఎస్ ( IPS ) కాదని ... ఇజ్రాయెలీ పెగాసస్ సర్వీసెస్ అని విమర్శించారు. ఆయన కుమారుడి కంపనీతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. తనపై చేసిన ఆరోపణలన్నింటికీ ఆయన వద్ద ఆధారాలుంటే ప్రభుత్వానికి ఇవ్వవొచ్చని ..ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవచ్చని విడుదల చేసిన ప్రెస్నోట్లో ( Press Note ) పేర్కొన్నారు. అదే సమయంలో తనపై చేసిన వ్యాఖ్యలను తాను దాఖలు చేయబోయే పరువు నష్టం కేసులో పొందు పరుస్తానన్నారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను తాము నిబంధనలకు లోబడి వినియోగిస్తున్నామని గుడివాడ అమర్నాథ్ చెప్పిన విషయం ఈనాడులో వచ్చిందని గుర్తు చేశారు .
వైఎస్ఆర్సీపీ ( YSRCP ) నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారందరిపై పరువు నష్టం కేసులు దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీ వెంకటేశ్వరరావు దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన సర్వీసులో ఉన్నారు. ఆయనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉంది. ఇలా ఉద్యోగి హోదాలో ఎవరిపైనైనా న్యాయపోరాటం చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అందుకే ఆయన సీఎస్ ( Chief Secratary ) పర్మిషన్ అడిగారు. అయితే ఆయనపై ఆరోపణలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ నేతలు కావడంతో ప్రభుత్వం కూడా వారిదే కావడంతో ఆయనకు అనుమతి లభించడం కష్టమేనని భావిస్తున్నారు. అయితే తనపై ఇష్టం వచ్చినట్లుగా తప్పుడు ప్రచారాలు చేసి.. దాన్ని తప్పు అని చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని ఏబీవీ ప్రశ్నిస్తున్నారు.
ఏబీవీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్గా ( Inteligence Chief ) పని చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయనను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఏబీవీకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. చాలా కాలం తర్వాత ఆయనపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది. ఇటీవల ఆయనను సర్వీస్ నుంటి టెర్మినేట్ చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ లేఖ రాసింది. ఆయనపై ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల విచారణ ఇంకా సుప్రీంకోర్టులోనే పెండింగ్లో ఉంది.
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Anantapur: సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ట్రైనీ జేసీ తనిఖీలు - పోలీసులు అరెస్టు చేయడంతో కి‘లేడీ’ ట్విస్ట్
MLC Suspend YSRCP : ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్ - కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్సీపీ !
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!