అన్వేషించండి

Pariksha Pe Charcha: 'పరీక్ష పే చర్చ'లో ఏపీ టీచర్ ప్రశ్న - ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

Andhra Pradesh News: ప్రధాని మోదీ 'పరీక్షా పే చర్చ'లో అనకాపల్లి జిల్లాకు చెందిన టీచర్, విద్యార్థి పాల్గొన్నారు. టీచర్ అడిగిన ప్రశ్నకు ప్రధాని మోదీ ఆసక్తికర సమాధానం చెప్పారు.

PM Modi Answer to AP Teacher Question in Pariksha Pe Charcha: పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ ఢిల్లీ ప్రగతి మైదాన్ లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్ హాల్ లో సోమవారం 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఏపీకి చెందిన టీచర్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా ఉప్పరపల్లి జడ్పీ హైస్కూల్ సంగీతం టీచర్ సి.సంపత్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'పరీక్షల టైంలో విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన పూర్తిగా తొలగించాలన్నదే నా లక్ష్యం. అందుకు మార్గనిర్దేశం చేయండి.' అంటూ విజ్ఞప్తి చేయగా.. ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. 'టీచర్, విద్యార్థి మధ్య బంధం కేవలం పరీక్షల వరకే పరిమితం కాకూడదు. తమకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు విద్యార్థులు ధైర్యంగా టీచర్లకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. అలాంటప్పుడే పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని జయించగలుగుతారు. విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబరిచినప్పుడు టీచర్లు వారి ఇళ్లకు వెళ్లి మీ పిల్లలు బాగా రాణిస్తున్నారని తల్లిదండ్రులతో చెబితే మొత్తం వాతావరణమే మారిపోతుంది.' అంటూ సమాధానం ఇచ్చారు. 

కార్యక్రమంలో ఏపీ విద్యార్థి

అటు, ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా చీడికాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కొంచా అనిల్ కుమార్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో చదువుకునేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపాడు.

మోదీ ఇంకా ఏం చెప్పారంటే.?

  • పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదన్నారు. విద్యార్థులు తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నారని ఒత్తిడికి లోనవుతారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమంగా మీ పనితీరును మెరుగుపరుచుకోవాలి. తద్వారా పరీక్షలు బాగా రాయగలరు.
  • మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు. అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది. ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు, టీచర్లు, బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంట్రీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనల్లోకి వెళ్తారు. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
  • తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తమ సొంత విజిటింగ్ కార్డ్‌గా భావిస్తున్నారు. ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెబుతారు. అది సరైన విధానం కాదు.
  • ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు. విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి. విద్యార్థులపై తోటి స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల వల్ల, స్వీయ ప్రేరేపితంగా ఒత్తిళ్లు ఉంటుంది. వీటిని అధిగమించాలి. పోటీ, సవాళ్లు మన జీవితంలో ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ విషయంలోనూ పక్క వాళ్లతో పోటీ పడొద్దు. మీతో మీరే పోటీపడండి.
  • విద్యార్థులే దేశ భవిష్యత్తు రూపకర్తలు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ 'పరీక్షా పే చర్చ కార్యక్రమం' నాకూ పరీక్ష లాంటిది.
  • ఇళ్లలో గ్యాడ్జెట్స్ వాడకాన్ని తగ్గించండి. కుటుంబ సభ్యులతో హాయిగా గడపండి. టెక్నాలజీ మీ మధ్య దూరం పెంచకూడదు. గ్యాడ్జెట్స్‌ని రీఛార్జ్ చేస్తున్నాం. మరి మన శరీరానికీ ఇలాంటి రీఛార్జ్ అవసరమే కదా. మొబైల్స్‌ని పక్కన పెట్టి కంటినిండా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అవసరం. మీరు మీ కుటుంబ సభ్యులతో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవసరం ఏముంటుంది..? మీరు మాట్లాడుకోడానికి అవి అవసరం లేదు. నేరుగా మాట్లాడుకోండి. 
  • విద్యార్థులు ఒత్తిడిని జయించి మనసును ఉల్లాసంగా ఉంచుకుంటూ పరీక్షలు రాసి విజయం సాధించాలి.

Also Read: Sharmila District Tours: ఫిబ్రవరి నుంచి జనాల్లోకి షర్మిల-మడకశిర నుంచే జిల్లాల పర్యటన ప్రారంభం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
అమెరికా గ్రేట్‌ ఇమిగ్రెంట్స్ జాబితా.. హైదరాబాద్ శాస్త్రవేత్తతో పాటు నలుగురు భారతీయులు
Pawan Kalyan On Social Media: సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!
సోషల్ మీడియాలో విమర్శలపై పవన్ సీరియస్‌! ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Prakash Raj: ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!
ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డి! జర్నలిస్టుల అరెస్టులపై ఏపీలో మొదలైన కొత్త పొలిటికల్ వార్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget