అన్వేషించండి

Perni Nani: చంద్రబాబు అరెస్ట్‌తో న్యాయం, ధర్మం గెలిచింది - పేర్ని నాని

Perni Nani: చంద్రబాబు అరెస్ట్‌తో న్యాయం, ధర్మం గెలిచిందని తెలుగు ప్రజల్లో ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

Perni Nani: చంద్రబాబు అరెస్ట్‌తో న్యాయం, ధర్మం గెలిచిందని తెలుగు ప్రజల్లో ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. 1977 నుంచి చంద్రబాబు ఎన్నో స్కాములు, ఎంతో అవినీతికి పాల్పడ్డారని నాని విమర్శించారు. వాటిపై ప్రభుత్వాలు, వ్యవస్థలోని వ్యక్తులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు నాయుడు కుయుక్తులు, నక్క జిత్తుల మారితనంతో పట్టుబడకుండా స్టేల మీద ఏమార్చుకుంటూ 45 ఏళ్లుగా చక్రం తిప్పారని అన్నారు.

ఇన్నేళ్లకు పాపం పండింది
నూరు గొడ్లను తిన్న రాబందు, ఒక తుఫాన్‌కు నేల కూలినట్లు, గంధం చెట్ల వీరుడు వీరప్పన్ కూడా ఎన్నో ఏళ్లు ఎవరికి చిక్కుండా హీరోలా ఉన్నాడని, కానీ ఒక్క నిజాయితీపరుడైన అధికారికి చిక్కారని అన్నారు. ప్రతివ్యవస్థలో తాను ఏర్పచుకున్న స్లీపర్ సెల్స్ ద్వారా దొరకకుండా నీతులు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచం ఇస్తూ దొరికిపోయి అమరావతి పారిపోయి వచ్చారని అన్నారు. ఇన్నేళ్లకు పాపం పండిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 371 కోట్ల రూపాయలను దోచేశారని, ఈ కేసు కేవలం తీగ మాత్రమే అన్నారు. దాని పట్టుకుని లాగితే డొంక అంతా కదులుతుందన్నారు.

చంద్రబాబును కాపాడడానికి అందరూ పోరాటం
చంద్రబాబును కాపాడానికి యత్నిస్తున్న ఎల్లో మీడియా, పవన్ కల్యాణ్, వామపక్షాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పోటీ పడుతున్నారని అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనకు ముందే సమాచారం ఉందని, అందుకే కాలువ శ్రీనివాసులు, ఎల్లో మీడియాను రాత్రంతా గొట్టాలు పెట్టి అక్కడే కాచుకు కూర్చుందన్నారు. జగన్ అరెస్ట్ అయినప్పుడు ఈనాడు రామోజీ రావు  ఏ 1 ముద్దాయి లోపలికి అని రాశారని, కానీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాశారని అన్నారు. కులపిచ్చితో రామోజీ రోత రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు చంద్రబాబును హెలికాఫ్టర్‌లో వెళ్దామంటే కావాలనే కారులో వెళ్లారని  విమర్శించారు.

సానుకూలంగానే సీఐడీ అధికారుల స్పందన
చంద్రబాబుకు చెందిన ప్రతి విషయంలో సీఐడీ అధికారులు సానుకూలంగానే స్పందించారని అన్నారు. దారి మధ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలను కలవడానికి అవకాశం ఇచ్చారని అన్నారు. సీఐడీ కార్యాలయంలో కుటుంబ సభ్యులు భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, బాలకృష్ణను కలిసేందుకు అంగీకరించారని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు చెప్పిన సమాధానాలు వింటే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. పలు సార్లు చంద్రబాబుకు అధికారులు విశ్రాంతి ఇచ్చారని అన్నారు. ఆస్పత్రిలో  పరీక్షలకు ఒప్పుకోలేదని, తనకు వైద్య పరీక్షలు అవసరం లేదని చెప్పిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జైలులో ప్రత్యేక వసతులు కల్పనకు ప్రభుత్వం, సీఐడీ తరఫున అధికారులు అభ్యంతరం కూడా చెప్పలేదన్నారు.

వాళ్లు ఎందుకు పారిపోయారో చెప్పండి
చంద్రబాబు నిజాయితీ పరుడైతే సీఐడీ నోటీసులు ఇవ్వగానే ఆయనకు లంచాలు ఇచ్చిన ఇద్దరు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిసినప్పుడు 5 చార్టెడ్ విమానాలు ఏర్పాటు చేశారని, అవి ఎలా వచ్చాయని అడిగారు. ఢిల్లీలో రోజుకు 1.5 కోట్లు తీసుకునే వ్యక్తి సిద్ధార్థ్ లూధ్రాను లాయర్‌గా పెట్టుకున్నారని, వివేకానంద కేసులో సైతం లూధ్రాకు చంద్రబాబు ఫీజు కడుతున్నారని ఆరోపించారు.  నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుటి నుంచి రాజమండ్రి జైలులో ప్రత్యేక రూమ్ కల్పించినంత వరకు అధికారులు చంద్రబాబుకు ఎంతో మర్యాద ఇచ్చారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై నెల్లూరు కోటంరెడ్డి బ్రదర్స్ యాక్షన్ కామెడీగా ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబుపై కక్ష లేదన్నారు. కేవలం మర్యాద, గౌరవం ఉందన్నారు. అవినీతికి పాల్పడడంతోనే ఆయన అరెస్ట్ జరిగిందన్నారు. 

అవినీతి సొమ్ములో పవన్‌కు వాటా
ఉత్త పుత్రుడి కంటే దత్త పుత్రుడు ఓవర్ యాక్షన్ చేశాడని, చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు రోడ్డుపై పొర్లాడాడని నాని విమర్శించారు. జనసేన సిద్ధాంతాలు నేతి బీరకాయలో నెయ్యి లెక్కలో ఉంటాయన్నారు. పవన్ సినిమా డైరెక్టర్లు, రచయితలతో మాటలు రాయించుకుంటే బాగుంటుందని, కానీ సొంతంగా తీస్తే అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. నిన్న పవన్ ప్రెస్ మీట్‌కు స్క్రిప్ట్ రాయడానికి ఎవరు దొరికి ఉండరని, అందుకే  నోటికి వచ్చిందంతా మాట్లాడారని విమర్శించారు. ఇండ్ల రామసుబ్బారెడ్డి వద్ద పవన్ మానసిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును పవన్ నిలదీయాల్సింది పోయి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. అవినీతి సొమ్ములో పవన్‌కు వాటాలు ఉన్నాయని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
AP Ration Shops: ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ఏపీలో రేషన్ షాపుల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీ.. గ్యాస్ కొరతతో ప్రభుత్వం నిర్ణయం
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget