అన్వేషించండి

Pawan Hindutva Tour: పవన్ కల్యాణ్ మిషన్ దక్షిణాది స్టార్ట్ - ఆలయాల సందర్శన ఎప్పటి నుంచంటే ?

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హిందూత్వ ఎజెండాతో దక్షిణాది పర్యటన ప్రారంభిస్తున్నారు. కేరళ, తమిళనాడులో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు.

Pawan Kalyan  schedule to visit temples in South has been finalized: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ఈ నెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పర్యటించనున్నట్లుగా జనసేన వర్గాలు ప్రకటించాయి. మొత్తం నాలుగు రోజుల పర్యటన ఉంటుంది.   అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్యజీవసమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు.  

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కల్యాణ్ ఆలయాల పర్యటన                  

సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటన ఉంటుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడినప్పుడు.. ఆయన దక్షిణాదిలో హిందూత్వ లీడర్ గా ఆవిర్భవించేందుకు అవసరమైన కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారని రాజకీయవర్గాలు అంచనా వేశాయి. కానీ  పవన్ ఎప్పుడూ అలాంటి రాజకీయ టార్గెట్లు తనకు ఉన్నాయని చెప్పలేదు. కానీ ఇప్పుడు మెల్లగా తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు. మొదటగా ఆయన కేరళ వెళ్తున్నారు. ఆయన పర్యటన ఖచ్చితంగా రాజకీయం అవుతుంది.  పవన్ కల్యాణ్ రాజకీయం లేదని.. చెప్పవచ్చు.  కానీ జరుగుతున్న రాజకీయంలో భాగంగానే పర్యటనలు అని మీడియా ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది.

తమిళనాడులో పవన్ పర్యటన రాజకీయ దుమారం రేపే చాన్స్

కేరళ తర్వాత పవన్ తమిళనాడు వెళ్లేలా షెడ్యూల్ ఖరారు అయింది.  తమిళనాడులో అధికారం అందుకోవడం  బీజేపీ  దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఒకటి.  అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తనదైన ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది. అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా  హిందూత్వవాదం, దేశభక్తి నినాదంతో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే అనుకున్నంతగా ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు. గతంలో ఉదయనిధి చేసిన సనాతన ధర్మ వ్యతిరేకత వ్యాఖ్యలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకయారన్న అభిప్రాయం ఉంది.  హిందూ వర్గాల్లో కదలిక తీసుకువచ్చి అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావాలనుకుంటున్నారు.  ఇప్పుడు ఆ బాధ్యతను పవన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.                              

దక్షిణాది హిందూత్వ లీడర్ గా పవన్ కల్యాణ్ నిలుస్తారా ?          

ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పవన్ విమర్శలు చేశారు.  తమిళనాడులో పవన్ చేసే పర్యటన అక్కడి రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.   కర్ణాటక. తెలంగాణలోనూ పవన్ ఆలయాల సందర్శన ఉంటుంది. ఇదంతా ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతుందని..    ఈ వర్యటనలతో  పవన్ కల్యాణ్.. దక్షిణాదిన పూర్తి స్థాయి హిందూత్వ లీడర్ గా అవతారం ఎత్తుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget