అన్వేషించండి

Pawan Kalyan: నేనే వచ్చి కలుస్తాను, నాకు బొకేలు, శాలువాలు తేవొద్దు - పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు

Pawan Kalyan Message : ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు బొకేలు, శాలువాలు తేవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని బహిరంగ లేఖ రాశారు.

Pawan Kalyan:  తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  ఏపీలో  టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. జూన్ 12న నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), మంత్రులుగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)  తో సహా తదితరులు ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ ఎన్నికల గెలుపులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. అంతేకాదు పోటీ చేసిన అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఆ పార్టీ 100 శాతం స్ట్రైయిక్ రేట్ నమోదు చేసింది.  చంద్రబాబు కేబినెట్లో జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించారు. జనసేన అధినేతకు డిప్యూటీ సీఎం పోస్టు ఖరారైంది. దాంతో పాటు  ఇంకా ఏ శాఖలు కేటాయిస్తారో అన్న దాని పై స్పష్టత వచ్చింది. పవన్ కోరిక మేరకు  కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

అభినందనల వెల్లువ
రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్‌ కల్యాణ్‌కు సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అభినందనల వర్షం కురుస్తోంది.  భారీ మెజార్టీతో గెలవడంతో పాటు మంత్రి పదవి దక్కడంతో ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఆయనను ఓ సారి చూడాలని ప్రయత్నిస్తున్నారు. దీనిపై తాజాగా పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. త్వరలోనే తనే స్వయంగా జిల్లాలవారీగా వచ్చి పార్టీ శ్రేణులు, అభిమానులను కలుస్తానంటూ ప్రకటించారు. 

ధన్యవాదాలు తెలుపుతూ లేఖ
తనను పిఠాపురం నియోజకవర్గం నుంచి 70వేల భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు, గెలిచిన తర్వాత.. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభినందనలు చెబుతున్న వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు. ‘‘ప్రజా జీవితంలో ఉన్న  మేధావులు, నాయకులు, నిపుణులు, సినీరంగం ప్రముఖులు, యువత, రైతులు ఇలా అందరూ నాకు అభినందనలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలోనే జిల్లాల వారీగా పర్యటించి అందరినీ కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని పవన్‌ కళ్యాణ్ లేఖలో పేర్కొన్నారు.  

20న పిఠాపురంలో పర్యటన
తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 20న నియోజకవర్గంలో పర్యటిస్తానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానన్నారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానంటూ చెప్పుకొచ్చారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
పార్టీ మారడం లేదన్న మాజీ మంత్రి మల్లారెడ్డి.. కేక్ కట్ చేసి కేటీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget