అన్వేషించండి

Janasena Party Structure Restructuring: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ - నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకం.. జనసైనికులే కాబోయే నాయకులు!

Janasena Membership Drive Sadhaks: కింది స్థాయిలో కష్టపడే జనసైనికులకే అవకాశాలు కల్పించాలని పవన్ భావిస్తున్నారు. అందుకే సమాచార సేకరణ కమిటీల్ని నియమించారు.

Pawan Kalyan Janasena Information Committees: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో భారీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. కేడర్ ఆధారిత బలమైన నాయకత్వ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా, రాష్ట్రవ్యాప్తంగా  జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల  నియామకాన్ని చేపట్టారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, దశాబ్ద కాలంగా జెండా మోస్తున్న సామాన్య జనసైనికుల నుంచే భవిష్యత్ రాజకీయ నాయకత్వాన్ని తీర్చిదిద్దే బృహత్తర వ్యూహంతో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ సరికొత్త ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సంస్థాగత మార్పుల్లో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అత్యంత పకడ్బందీగా ఈ సమాచార సేకరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో కూడిన ఒక జంబో కమిటీ బాధ్యతలను చూస్తుంది. ఈ కమిటీల కూర్పులో ప్రతి పార్లమెంట్‌కు ఒక సీనియర్ పరిశీలకుడు, స్థానిక అంశాలపై పూర్తి అవగాహన ఉన్న ముగ్గురు సీనియర్ నాయకులు ఉంటారు. వీరితో పాటు ఏటా నిలకడగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న ముగ్గురు 'సాధక్స్'ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కనీసం ముగ్గురు సాధక్స్‌ను ఇందులో భాగస్వామ్యం చేశారు. వీరికి తగిన సాంకేతిక, పరిపాలనా సహకారం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరపున ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు.

ఈ కమిటీల ప్రధాన విధి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కోసం అంకితభావంతో, నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధక్స్ , వీరమహిళల  సమగ్ర సమాచారాన్ని సేకరించడం. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించి, క్షేత్రస్థాయిలో వారి పనితీరు, ప్రజాదరణ, అంకితభావం మరియు నాయకత్వ లక్షణాలపై ఈ కమిటీలు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తాయి. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుండి ఎన్నో కష్టనష్టాల నెదుర్కొని జనసేన జెండాను భుజాన మోస్తున్న అసలైన జనసైనికులను గుర్తించి, వారిని చట్టసభలకు వెళ్లే నాయకులుగా తీర్చిదిద్దడమే ఈ భారీ రాజకీయ కసరత్తు   ముఖ్య ఉద్దేశం.   

పార్లమెంట్ స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు, అలాగే పార్టీలోని వివిధ అనుబంధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారిని వారి నైపుణ్యాల ఆధారంగా గుర్తించనున్నారు. నాయకులు, కార్యకర్తల ఆసక్తి ,  క్షేత్రస్థాయి సామర్థ్యానికి తగిన విధంగానే భవిష్యత్తులో వారికి పార్టీ పదవులు మరియు ప్రభుత్వ అనుబంధ బాధ్యతలు కేటాయించబడతాయి. కమిటీలు క్షేత్రస్థాయి నుంచి సేకరించి అందించే పూర్తి సమాచారాన్ని, నివేదికలను కూలంకషంగా పరిశీలించిన అనంతరం మాత్రమే వివిధ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తీసుకుంటారు. 
 
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేవలం అధికారానికే పరిమితం కాకుండా.. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ కమిటీల ద్వారా గ్రౌండ్ లెవల్‌లో కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, తగిన ప్రాధాన్యత కల్పించేలా పారదర్శక విధానాన్ని అవలంబిస్తున్నారు. అర్హత, నిబద్ధత మాత్రమే ప్రామాణికంగా సాగుతున్న ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget