అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కల్యాణ్ దృష్టిలో పడితే జెట్ స్పీడే - సోషల్ మీడియాలో పిల్లల పోస్టు చూసి రోడ్ మంజూరు

Nellore: సోషల్ మీడియాలో పిల్లలు తమ ఊరి రోడ్డు కోసం విజ్ఞప్తి చేయడంతో పవన్ వెంటనే మంజూరు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందిస్తుందో డిప్యూటీ సీఎం మరోసారి చూపించారు.

Deputy CM Pawan Reaction:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థులు వ్యక్తం చేసిన ఆవేదనకు స్పందించి, తక్షణమే రోడ్డు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలపై ఎంత వేగంగా స్పందిస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
  
విద్యార్థుల పిలుపు.. పవన్ కళ్యాణ్ స్పందన 

"పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ నెల్లూరు జిల్లా గజ్జలవారిపల్లి విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. బురద రోడ్డులో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు చిన్నారి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయారు. తక్షణమే స్పందించిన పవన్ కళ్యాణ్, సంబంధిత అధికారులతో మాట్లాడి గజ్జలవారిపల్లి గ్రామ సమస్యపై పూర్తి వివరాలు సేకరించారు. ఆ విద్యార్థుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మంజూరు 

ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో నెల్లూరు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ అధికారులు రంగంలోకి దిగారు. గజ్జలవారిపల్లి నుంచి స్కూలుకు వెళ్లే 1.6 కిలోమీటర్ల మేర ఉన్న బురద రోడ్డును బాగు చేసేందుకు రూ. 86 లక్షలతో అంచనాలను రూపొందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ నిధులకు సంబంధించిన పరిపాలన అనుమతులు  మంజూరయ్యాయి. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులతో పాటు, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి రవాణా కష్టాలు తీరనున్నాయి.

ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి వెల్లువ 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం రోడ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే 'పల్లె పండుగ' 1.0 ,  2.0 కార్యక్రమాల కింద సుమారు రూ. 55 కోట్ల నిధులతో 641 రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా 437 రోడ్ల పనులు తుది దశకు చేరుకోగా, మరో 200 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటికి అదనంగా సాస్కీ  నిధుల నుంచి రూ. 9 కోట్లతో దుత్తలూరు, కొండాపురం, సీతారాంపురం , వింజమూరు మండలాల్లోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నారు.

 ప్రజా ప్రభుత్వం - తక్షణ పరిష్కారం 

సాధారణంగా ప్రభుత్వ పనులు మంజూరు కావడానికి నెలల సమయం పడుతుంది, కానీ గజ్జలవారిపల్లి ఘటనలో పవన్ కళ్యాణ్ చూపిన చొరవతో అది ఒక్కరోజులోనే సాధ్యమైంది. సమస్య ఏదైనా, అది ప్రజల నుంచి వస్తే తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఈ ఘటనతో స్పష్టమైంది. తమ అభ్యర్థనపై స్పందించి రోడ్డు మంజూరు చేసినందుకు గజ్జలవారిపల్లి గ్రామస్తులు , విద్యార్థులు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.                                 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
క్యాట్‌లో ఐపీఎస్ సునీల్ కుమార్‌కు ఎదురుదెబ్బ.. సస్పెన్షన్ రద్దు పిటిషన్ కొట్టివేత!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Embed widget