అన్వేషించండి

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంటపొలాలన్నీ ధ్వంసం!

అర్ధరాత్రి 25 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి మరీ పక్క జిల్లాలోనికి వచ్చాయి నాలుగు ఏనుగులు. అంతేకాదు పంటపొలాలన్నింటిని పూర్తిగా నాశనం చేసేశాయి.  

 పార్వతీపురం మన్యం జిల్లా  పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలం వెంగాపురం  గ్రామంలో నాలుగు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలన్నీ నాశనం చేశాయి. విజయనగరం జిల్లా రాజాం మండలంలో ఉన్న ఈ ఏనుగురు అర్ధరాత్రి 25 కిలోమీట్లర మేర ప్రయాణం చేసి వెంగాపురం గ్రామ సమీపంలోని పంటపొలాలపై పడి పరుగులు పెట్టాయి. తొక్కి తొక్కి నాశనం చేశాయి. ఏనుగుర అరుపులతో విషయం గుర్తించిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చేతికి వచ్చిన పంటను నాశనం చేయడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇప్పటికే భారీగా కురిసిన వర్షాల వల్ల పంట నాశనం కాగా.. ఇప్పుడు ఏనుగుల వల్ల పూర్తిగా నాశనం అయిందని వాపోతున్నారు. ఏనుగుల నుండి తమని, తమ పంటల్ని రక్షించాలని కోరుతున్నారు. 

నాలుగు నెలల క్రితం తిరుమల ఘాట్ రోడ్డులో..

తిరుమల కొండపై ఏనుగుల సంచారం భక్తులను కలవరపెడుతుంది. కొన్ని రోజులుగా తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు సంచరిస్తుండడంతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఆదివారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని ఎలిఫాంట్ ఆర్చ్ వద్ద 11 పెద్ద ఏనుగులు, మూడు చిన్న ఏనుగుల గుంపును చూసిన వాహనదారులు భయంతో వాహనాలను నిలిపివేసి అటవీ శాఖా అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోనికి తరిమే ప్రయత్నం చేస్తున్నారు. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అటవీ శాఖ అధికారులు తెలిపారు. 

ఒంటరి ఏనుగు హల్ చల్ 

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఒంటరి ఏనుగు గురువారం కలకలం రేపింది. గురువారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఘాట్ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. ఒంటరి ఏనుగు ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఒంటరి ఏనుగు చూసిన వాహన చోదకులు వాహనాలు నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఒంటరి‌ ఏనుగును అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ అదే‌ ప్రాంతంలో ఏనుగులు సంచరించడం గమనార్హం.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడద 

చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం అధికమవుతోంది. ఏనుగుల పంట పొలాలు ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు విస్తుపోతున్నారు. గత కొంత కాలంగా జిల్లాలో‌ పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపు గ్రామాలపైకి వస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. చిత్తూరు జిల్లా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉండడంతో ఏనుగులు గుంపులు తరచూ అటవీ సమీప గ్రామాల్లోకి వచ్చి పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా, రైతులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల సదుం మండలం గొల్లపల్లికి చెందిన యల్లప్ప రాత్రి సమయంలో పొలం వద్ద కాపలా ఉండగా ఒక్కసారిగా ఏనుగు దాడి చేసింది. ఈ దాడిలో యల్లప్ప మృతి చెందాడు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డీటీఓ వెంకన్న మరణం వెనుక మాఫియా కుట్ర? విచారణకు హరీష్ రావు డిమాండ్
డీటీఓ వెంకన్న మరణం వెనుక మాఫియా కుట్ర? విచారణకు హరీష్ రావు డిమాండ్
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
YS Jagan Supporting Accused: జగన్ పొలిటికల్ వ్యూహం రివర్స్? లిక్కర్ స్కామ్‌లో సైలెన్స్.. ఆ నిందితులకు భరోసా! ఎందుకలా?
జగన్ పొలిటికల్ వ్యూహం రివర్స్? లిక్కర్ స్కామ్‌లో సైలెన్స్.. ఆ నిందితులకు భరోసా! ఎందుకలా?
Pawan Kalyan Political Graph AP: అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?
అటైనా .. ఇటైనా పవనే సెంటర్ పాయింట్ - ఏపీ రాజకీయాల్లో అసలైన పవర్ స్టార్ - జగన్ టార్గెట్ చేయడమే లాభిస్తోందా?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JD Vance: అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
అమెరికా, ఇరాన్ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అవమానం.. అయినా కొనసాగిన భేటీ
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Doctor Vikrant Singh Diet : డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
డాక్టర్ విక్రాంత్ సింగ్ 6 ఏళ్లుగా ఫాలో అవుతున్న డైట్ ఇదే.. బీపీ, ప్రీడయాబెటిస్ రివర్స్ అయిందట, మరి నిపుణుల సలహా ఏంటి?
Team India Chances: సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
సౌతాఫ్రికా చేతిలో దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ సేన.. సెమీస్ రేసు కాస్త సంక్లిష్టం..  క్వాలిఫై లెక్క‌లు ఇవే!
కొత్త లుక్‌లో Aprilia SR 125, SR 175- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధర, ఫీచర్ల వివరాలు
Aprilia SR 125, SR 175 బుకింగ్స్ ప్రారంభం- హైదరాబాద్‌లో మిలిటరీ ఎడిషన్ స్కూటీల ధరలివే
Embed widget