అన్వేషించండి

Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Mahanadu 2022 : జిల్లాల విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజనను పునః సమీక్షిస్తామన్నారు. బుల్లెట్ లా దూసుకొచ్చి గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు.

Mahanadu 2022 :  వైసీపీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్‌ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. క్విట్‌ జగన్‌-సేవ్‌ ఏపీ అని ఐదు కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. మహానాడుకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందన్నారు. పోలీసులు ప్రజల వాహనాలను అడ్డుకున్నారని, కారు టైర్లలో గాలి కూడా తీశారని ఆరోపించారు. టీడీపీ వెంట ప్రజలు ఉంటే, వైసీపీ వెంట బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజల కోసం పోరాడుతామన్న చంద్రబాబు, కొండనైనా బద్దలు కొట్టే శక్తి టీడీపీకి ఉందన్నారు. బాదుడే బాదుడుకు పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని పెట్టారని, గడప గడపకు వెళ్లిన మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు. 

Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మూడేళ్ల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లకు చేరిందని చంద్రబాబు అన్నారు. సంక్షేమ పథకాలతో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమం అంటే టీడీపీ అన్నారు. రూ.8 లక్షల కోట్ల అప్పును జగన్‌ చెల్లిస్తారా అని ప్రశ్నించారు. క్వార్టర్‌ బాటిల్‌ ధర రూ.9 ఉండేదని, వైసీపీ ప్రభుత్వం రూ.21 చేసిందన్నారు. ఇందులో రూ.12 జగన్‌ జేబులోకి వెళ్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ మద్యం షాపులో కూడా బిల్లు ఇవ్వడం లేదన్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ అమలుచేయరన్నారు. లిక్కర్‌ ద్వారా ఏటా జగన్‌ ఆదాయం రూ.5 వేల కోట్లు అని చంద్రబాబు ఆరోపించారు. బద్వేలులో 8 వేల ఎకరాలు కబ్జా చేశారన్న చంద్రబాబు, బెదిరించి అన్ని పరిశ్రమలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారన్నారు. మూడేళ్ల పాలనలో రూ.1.75 లక్షల కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. బాలయ్య ప్రజలపై నమ్మకం ఉంచి సినిమా విడుదల చేశారని, అది సక్సెస్ అయిందన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? అని ప్రశ్నించారు. 

Mahanadu 2022 : జిల్లా విభజనను పునః సమీక్షిస్తా, బుల్లెట్లా దూసుకెళ్తా- మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

బుల్లెట్లా దూసుకెళ్తా 

" "సినిమా విడుదల చేయాలంటే మీ పర్మిషన్ కావాలా?. రేపు జగన్ కంపెనీ భారతీ సిమెంట్స్ కు పర్మిషన్ ఇచ్చేది నేనే. ఈ ప్రభుత్వం ఛార్జీలన్నీ పెరిగాయి. వీరబాదుడు బాదేస్తున్నారు.ప్రజలు అడగలేరనే ధైర్యం. ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల తరపున మేం పోరాడుతోంటే.. మాపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు. మేం భయపడేదే లేదు. బుల్లెట్లా దూసుకెళ్తాను. ఎన్ని కేసులైనా పెట్టుకో. మమ్మల్ని ఇబ్బందులు పెడితే వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలి గుర్తుంచుకోండి. రౌడీలను గూండాలను వదిలి పెట్టేదే లేదు. వైసీపీ మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది. సంక్షేమం పథకాలు మొదలు పెట్టిందే ఎన్టీఆర్. చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు." "
-- చంద్రబాబు, టీడీపీ అధినేత 

జిల్లాల విభజనపై 

జిల్లాల విభజనపై చంద్రబాబు కీలక కామెంట్స్ చేశారు. అధికారంలోకి రాగానే జిల్లాల విభజనపై పునః సమీక్షిస్తామన్నారు. ప్రజల డిమాండ్లు,  అభిప్రాయాల మేరకు జిల్లాల విభజనపై అడుగులేస్తామన్నారు. మార్కాపురం జిల్లా డిమాండ్ ఉందని, దాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల ప్రజలు ప్రకాశం జిల్లాలోనే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వంపై యుద్దం ప్రకటించామన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో ఓ ఎకరం అమ్మిన డబ్బుతో ఏపీలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చన్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
YS Jagan: మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
మీడియాపై జగన్ వ్యాఖ్యలు 'గురివింద గింజ' సామెతను గుర్తుచేస్తున్నాయి: ఐజేయూ
Akividu issue: చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?
చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?

వీడియోలు

TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
Virat Kohli Nags Interview RCB IPL 2026 | ఐపీఎల్ రూల్స్ విరుద్ధంగా ఆడేస్తున్న ఆర్సీబీ | ABP Desam
Priyansh Arya 39 vs CSK IPL 2026 | పవర్ ప్లే లో రఫ్పాడించి మ్యాచ్ ను పంజాబ్ వైపు తిప్పేశాడు | ABP Desam
Sanju Samson Failures CSK IPL 2026 | తొలి రెండు మ్యాచుల్లోనూ సంజూ విఫలం | ABP Desam
CSK vs PBKS Match Highlights IPL 2026 | సీఎస్కేపై 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SRH vs LSG: సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
సన్‌రైజర్స్, లక్నో మధ్య హోరాహోరీ తప్పదా? ఉప్పల్ స్టేడియంలో మరో హై స్కోరింగ్‌ మ్యాచ్!
Iran-US War: అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
అమెరికా దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్లు హతం.. రెండో US పైలట్ సేఫ్: డొనాల్డ్ ట్రంప్
Nirmal Crime News: నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిర్మల్ జిల్లాలో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరి మృతి.. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Macherla Honor Killing: మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
మాచర్ల పరువుహత్య కేసు.. బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐపై సస్పెన్షన్ వేటు
Rayavalasa: అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
అమ్మ దర్శకత్వంలో కొడుకు... 'రాయవలస' లుక్ చూశారా? జానర్ ఏమిటంటే?
AP High Court on Temples: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయ ప్రవేశం నిషిద్ధం: ఏపీ హైకోర్టు
Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Who is Ashok Sharma: ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బాల్ వేసిన అశోక్ శర్మ.. ఎవరీ కొత్త బౌలింగ్ సంచలనం
Embed widget