అన్వేషించండి

Odisha Train Accident: "క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తాం, అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేస్తాం"

Odisha Train Accident: రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వాళ్లు ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే వీరందరి వివరాల కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.  

Odisha Train Accident: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్థలానికి ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందంతో పాటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెళ్లారు. అయితే ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైలు ప్రమాదంలో 178 మంది తెలుగు వాళ్లు ఉన్నారని తెలిపారు. మృతులు, గాయపడిన వారు, మిస్సైన వారి వివరాల కోసం అధికారులు చాలా కష్టపడుతున్నారని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అవసరం అనుకుంటే ఎయిర్ లిఫ్ట్ చేయమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదేశించారని వివరించారు. రాష్ట్రానికి చెందిన వైద్యుల బృందాన్ని క్షతగాత్రులకు చికిత్స అందించడానికి పంపామని చెప్పారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు పని చేస్తున్నాయని వివరించారు. విజయవాడలో దిగాల్సిన 39 మందిలో 23 మంది కాంటాక్ట్ లోకి వచ్చారని తెలిపారు. మిగిలిన ఐదుగురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ లో ఉన్నాయని, మరో ఇద్దరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయన్నారు. మొబైల్ ఫోన్లకు స్పందించని ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.  

అలాగే జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాని తెలిపారు. శ్రీకాకుళం పరిసర జిల్లాలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అంబులెన్సులను ఘటనా స్థలానికి పంపించాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడబోమని సీఎం చెప్పారన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 104, 108 వాహనాలతో పాటు వైద్యులను కూడా తరలిస్తున్నామని వివరించారు. 

హోంమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

మరోవైపు ఒడిశా రైలు ప్రమాద ఘటన పై రాష్ట్ర హోం మంత్రి  డాక్టర్ తానేటి వనిత  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరం, బాధాకర అయిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వివరించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అలాగే క్షేత్ర స్థాయిలో సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని బృందాలను ఘటనాస్థలికి పంపామమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణీకుల సంబంధించిన వివరాలను అధికారుల బృందాలు సేకరిస్తున్నాయన్నారు.  పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారుల ముమ్మర చర్యలు చేపట్టారన్నారు. 

జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశామని మంత్రి తానేటి వనిత అన్నారు. రైలు ప్రమాదంలోని క్షతగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ రాష్ట్ర స్థాయి అత్యవసర ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ ఎర్పాటు చేసిందని తెలిపారు. అలాగే ఆ నెంబర్లు - 1070, 112, 18004250101 గురించి కూడా వెల్లడించారు. మీ బంధువులో స్నేహితులో కనిపించకుండా పోతే సమాచారం కోసం 8333905022 నెంబర్ కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేయమని సూచించారు. ఎప్పటికప్పుడు పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని ప్రజలకు వివరాలు వెల్లడిస్తామని హోమంత్రి తానేటి వనిత వెల్లడించారు. 

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget