అన్వేషించండి

Andhra Pradesh News : కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ను నియమించే ఛాన్స్‌- నేడు అధికారిక ఉత్తర్వులు

AP NEW CS: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ముందే ఉన్నతాధికారుల నియామకాలు చేపట్టనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, విజయానంద్‌లో ఒకరిని నియమించనున్నారు

Andhra Pradesh News: ఏపీ నూతన ప్రభుత్వ ప్రధాన(C.S) కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌(Neerabh Kumar Prasad)ను నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎస్‌ జవహర్‌రెడ్డి(Jawahar Reddy) సెలవుపై వెళ్లిపోగా...ఆయన స్థానంలో నీరబ్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. నేడు అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. 
 
ఏపీలో ప్రభుత్వం మారడంతో ప్రభుత్వ అధికారుల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆడించినట్టు ఆడారని కొందరు అధికారులను కనీసం కలిసేందుకు కూడా చంద్రబాబు(Chandra Babu) నిరాకరిస్తున్నారు.  ఈనేపథ్యంలో జగన్‌(Jagan)కు అత్యంత సన్నిహితంగా మెలిగిన సీఎస్ జవహర్‌రెడ్డి(Jawahar Reddy) స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. జగన్‌ హయాంలో నీరబ్‌కుమార్(Neerabh Kumar Prasad) ఇన్‌ఛార్జి సీఎస్‌గా  కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం నీరబ్‌కుమార్‌కే అవకాశం దక్కనుంది.
 
1987 బ్యాచ్‌కు చెందిన నీరబ్‌కుమార్‌ ప్రస్తుతం ఆయన అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఏపీ కేడర్‌కే చెందిన ఆయన పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. అయితే నీరబ్‌కుమార్‌ ఈనెలాఖరుకు పదవీవిరమణ చేయనున్నారు. చివరిలో అత్యుత్తమ పదవిలో ఉండి పదవీవిరమణ చేసే అవకాశం కల్పించాలని నీరబ్‌కుమార్‌ చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగా  హామీ ఇచ్చినట్లు సమాచారం. ..
 
కేవలం 20 రోజుల కోసమే కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ను నియమించడం ఎందుకని చంద్రబాబు భావిస్తే....ఆయన తర్వాత సీనియారిటీ ప్రకారం ఇందనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న విజయానంద్‌(Vijayanadh) ముందు వరుసలో ఉన్నారు. పది, 20 రోజుల కోసం సీఎస్‌లను మార్చడం ఎందుకని...పూర్తిస్థాయిలో ఒకేసారి కొత్త సీఎస్‌(C.S)ను నియమించాలని చంద్రబాబు అనుకుంటే విజయానంద్‌ను సీఎస్‌ పదవి వరించనుంది. వైసీపీ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా వ్యవహరించిన ప్రస్తుత సీఎస్‌ జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా కొత్తగా ఏర్పడే ప్రభుత్వం ఆదేశించడంతో ఆయన గురువారమే సెలవుపెట్టి వెళ్లిపోయారు. దీంతో నేడు కొత్త సీఎస్‌ నియామకంపై ఉత్తర్వులు వెలువడనున్నాయి.
 
ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర(Muddada Ravichandra)ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. గురువారం మర్యాదపూర్వకంగా చంద్రబాబును రవిచంద్రను కలిసిన సందర్భంగా... సీఎంవోలోకి రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. దీనికి రవిచంద్ర సైతం అంగీకరించడంతో ఆయన్ను సీఎం ముఖ్యకార్యదర్శింగా నియమించినట్లు తెలిసింది. శనివారం లేదా ఆదివారం ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వంతో క్లోజ్‌గా ఉన్న అధికారులు, సిబ్బందిని పూర్తిగా మార్చివేయనున్నారు. ఇన్నాళ్లు ఇష్టానుసారం వ్యవహరించి ఇప్పుడు తప్పించుకునేందుకు యత్నిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. అందుకే ఉన్నతాధికారులు ఎవ్వరికీ సెలవులు మంజూరు చేయవద్దని ఆయన గట్టిగా ఆదేశించారు. అటు మంత్రుల పేషీలో పనిచేసిన పీఏలు, పీఎస్‌లు ఇతర ఉద్యోగులను మాతృసంస్థకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ప్రభుత్వ సలహాదారులు 40 మందిని తొలగిస్తూ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎంవోతో సహా ముఖ్యమైన కార్యాలయాల్లో ఉన్నతాధికారులు మారనున్నారు. చంద్రబాబు హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు మళ్లీ వెలుగులోకి రానున్నారు.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget