By: ABP Desam | Updated at : 31 Jan 2023 01:12 PM (IST)
కోడికత్తి దాడిలో జగన్ కూడా కోర్టుకు రావాల్సిందే - మరోసారి ఎన్ఐఏ కోర్టు ఆదేశం !
NIA Court Today : ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై జరిగిన కోడి కత్తి దాడికి సంబంధించిన కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు విచారణ ప్రారంభించిది. తొలి సాక్షిగా విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ హాజరు కావాల్సి ఉంది. ఈయన ప్రత్యక్ష సాక్షి. అయితే విచారణకు గైర్హాజర్ అయ్యారు. లఆయన తండ్రి చనిపోవడంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని దినేష్ తరపు న్యాయవాది ఎన్ఐఏ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తదుపరి విచారణను ఫిబ్రవరి పదిహేనో తేదీకి ఎన్ఐఏ కోర్టు వాయిదా వేసింది.
బాధితుడు కూడా కోర్టుకు రావాలన్న న్యాయమూర్తి
ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో... ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు... ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. దాడి జరిగిన నాలుగేళ్లు.. ఎన్ఐఏ చార్జిషీటు దాఖలు చేసిన చాలా కాలం తర్వాత విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును పోలీసులు కోర్టుు తీసుకు వచ్చారు. కేసు వాయిదా పడిన తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. బాధితుడు జగన్మోహన్ రెడ్డి సైతం హాజరు కావాలని గతంలోనే ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఢిల్లీలో పెట్టుబడుల సన్నాహక సమావేశం ఉండటంతో జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు.
కోడికత్తి కేసులో అసలేం జరిగిందంటే ?
2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్ జగన్ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్లో ఉండగా.. వెయిటర్..సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. అతను వస్తూనే.. వైఎస్ జగన్పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. ఆ ఆస్పత్రి వైద్యులు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. ఇది పెద్ద సంచలనం అయింది.
2019లోనే చార్జిషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తు మీద తమకు అనుమానాలు ఉన్నాయని హైకోర్టులో వైసీపీ నేతలు పిటిషన్ వేయడంతో కేసును కోర్టు ఎన్ఐఏకు ఇచ్చింది. విచారణ జరిపిన ఎన్ఐఏ 2019లోనే చార్జిషీటు దాఖలుచేసింది. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా జనిపల్లి శ్రీనివాసరావును పేర్కొన్నారు. చార్జిషీటుతో పాటు నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైల్లో రాసుకున్న 22పేజీల లేఖను కూడా కోర్టుకు అందజేశారు. ఈ కేసును రహస్యంగా విచారించాలని… విచారణకు సంబంధించిన వివరాలు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని.. మీడియా కూడా విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించకూడదని అప్పట్లో ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 20 గంటల సమయం
America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!
Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు, మూడ్రోజులు వానలు - వాతావరణ కేంద్రం ఇంకా ఏం చెప్పిందంటే?
YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్సీపీలో అంతర్మథనం !
Sajjala On Mlc Results : టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలెవరో తెలుసు, డబ్బులు ఆశచూపి ప్రలోభపెట్టారు- సజ్జల
రేవంత్ హౌస్ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు
TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు
Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ