అన్వేషించండి

YS Jagan Tour: వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత- టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి 

YS Jagan Tour: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని పొదిలిలో జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు.

YS Jagan Tour: వైఎస్‌ఆర్‌సీపీ చీఫ్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. ఈ పర్యటన వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను కించపరిచేలా నాయకులను ప్రోత్సహించిస్తున్న జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కొందరు నేతలు ఆయనకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని, నల్లబెలూన్‌లతో నిరసన తెలియజేశారు. గోబ్యాక్ జగన్ మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. 

జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అటు నుంచి అదే స్థాయిలో రిప్లై వచ్చింది. ఇలా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసురుకున్నారు. దీంతో జగన్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. 

పొదిలిలో పరిస్థితి అదుపు చేసేందుకు యత్నించిన పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. రెండు పార్టీలు విసిరిసిన రాళ్లు, చెప్పులు పోలీసులపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు అయ్యాయి. వారందర్నీ సహచరులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనలో ఇరు వర్గాల కార్యకర్తలు కూడా గాయపడ్డారు. 

శాంతియుతంగా నిరసన తెలియజేసే మహిళలపై దాడులు చేయించడం ఏంటని జగన్ మోహన్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పొదిలిలో జరిగిన ఘటనపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. రౌడీలను గౌరవించినంతా మహిళలను గౌరవించడం జగన్ మోహన్ రెడ్డికి రాదని ఎద్దేవా చేశారు. "పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైకాపా సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తాం. జగన్ రెడ్డి మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేశారు. తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చారు. సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన మీరు మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే. మహిళలపై వైకాపా నేతలు ఒళ్లు బలిసి మాట్లాడుతున్న మాటలకు, పొదిలిలో మహిళలపై వైకాపా చేసిన దాడికి జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." అని లోకేష్ డిమాండ్ చేశారు. 

ఈ పర్యటనలో మాట్లాడిన జగన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రైతు సమస్యలపై స్పందించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని అన్నారు. మరోవైపు లోకేష్ స్పందించిన తీరుపై వైసీపీ మండిపడింది. జగన్ టూర్‌కు ఎక్కువమంది జనాలు వచ్చారనే ఆక్రోశంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని " లోకేష్‌ నీ ఆక్రోశం, ఏడుపు ఎందుకో ప్రజలకు అర్థమైంది. ధరలు లేక నానా ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతుల పరామర్శకు జగన్‌ ప్రకాశం జిల్లా పొదిలి వెళ్తే ప్రజలు ఒక ప్రవాహంలా కదిలి వచ్చారు. ఆ దృశ్యాలను చూసిన తర్వాత నీకు స్వతహాగానే కడుపుమంట వస్తుంది. మీ దుర్మార్గపు పాలనపై ప్రజలు ఇచ్చిన సంకేతం అది. అందుకే జగన్‌ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి, కొంతమంది మహిళలను పోగుచేసి, నిరసన అనే ముసుగు తొడిగి వారితోనూ, వారి వెనక నుంచి నీ కార్యకర్తలతోనూ దాడులు చేయించి, హింసను రాజేసే పథకం వేశావు. కాని ప్రజలు నీ కుట్రలను గమనించి సంయమనంతో వ్యవహరించారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నీ తండ్రికి, నీకు అలవాటే. ఎన్టీఆర్‌ని దించడానికి ఏకంగా ఆయన సతీమణిపైనే తప్పుడు ప్రచారం చేసి వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. మీ కుట్రలు, మీ వేషాలు ప్రజలకు తెలియనివి కావు."అని విమర్శలు చేస్తూ వైసీపీ సోషల్ మీడియా హ్యండిల్‌లో పోస్టు పెట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget