అన్వేషించండి

మంత్రులు కాదు, జోకర్లు- సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమరావతి యాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతి చలించిందని మండిపడ్డారు సోమిరెడ్డి. ఆనాడు అందరు నేతలు అమరావతికి మద్దతిచ్చారని, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు.

రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి రైతులు హైకోర్టు నుంచి తిరుమలకు యాత్ర చేపట్టారు. అయితే ఆ యాత్ర మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది. ఆ క్రమంలో యాత్ర విజయవంతం అయిందంటూ రైతులు ఉత్సాహంగా వెెళ్లారు. ఇప్పుడు మరోసారి రైతులు అమరావతి టు అరసవెల్లి యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఉత్తరాంధ్రకు చేరక ముందే గొడవలు మొదలవుతున్నాయి. యాత్ర చేస్తున్న వారిని తరిమి కొట్టాలంటూ వైసీపీ నేతలు ఇస్తున్న పిలుపులు కలకలం సృష్టిస్తున్నాయి. 

అమరావతి యాత్రకు వస్తున్న స్పందన చూసి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మతి చలించిందని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆనాడు జగన్ సహా అందరు నేతలు అమరావతికి మద్దతిచ్చారని, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల్ని అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు సోమిరెడ్డి. మంత్రులంతా జోకర్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలు రాజీనామా చేయాలని సవాల్ విసిరారాయన. రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి, పరిశ్రమల్ని తరిమి కొడుతున్నారని మండిపడ్డారు సోమిరెడ్డి.

సాక్షాత్తు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతిపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు సోమిరెడ్డి. అమరావతిలో రాజధాని కడతామంటేనే రైతులు భూములిచ్చారని, అలాంటి వారిని అవమానిస్తారా అని ప్రశ్నించారు. అమరావతికి అధికార, ప్రతిపక్షలుండే నిండు సభలో ఒప్పుకుంటేనే రైతులు భూములివ్వడానికి అంగీకరించారని గుర్తు చేశారు. అమరావతిలో రాజధాని కడతామని చెప్పి కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఎక్కువ సీట్లలో గెలిచిందని అన్నారు. అప్పుడు అమరావతికి జై అన్న నేతలే ఇప్పుడు నై అనడం సరికాదన్నారు. 

కరణం ధర్మశ్రీ ఒక్కరే రాజీనామా చేస్తే సరిపోదని, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులను రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ పయాంలో విశాఖలో సగానికి పైగా పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. దమ్ముంటే 30 మందికిపైగా ఉన్న లోక్‌సభ, రాజ్యసభ వైసీపీ ఎంపీలు కలిసి విశాఖలో రైల్వే జోన్ తీసుకురండి అని సవాల్ విసిరారు. మూడు రాజధానులు ఉన్న సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులు చూసి, ఏపీ గురించి మాట్లాడాలని హితబోధ చేశారు. రైతుల పాదయాత్ర పై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని చెప్పారు సోమిరెడ్డి. 

కుప్పంలో కట్టారా ఏంటి..?

కుప్పంలోనో, నారావారిపల్లిలోనో చంద్రబాబు రాజధాని పెట్టుకుంటే వైసీపీ నేతలు ఏడవాలని, కానీ ఆయన రాజధాని అమరావతిని రాష్ట్ర నడిబొడ్డులో నిర్మించాలనుకున్నారని, దానికి వైసీపీ నేతలకు వచ్చిన కష్టమేంటని ప్రశ్నించారు. అమరావతికి అభివృద్ధికి సంబంధం లేదని, అమెరికాలోని పరిస్థితులే అందుకు నిదర్శనం అని చెప్పారు సోమిరెడ్డి. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన 10 కేంద్ర సంస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. విశాఖలో భూకుంభకోణంలో 40 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే మేలు అన్నట్టుగా పాలన జరుగుతోందని మండిపడ్డారు. మంత్రులు రాజీనామా చేసి విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవాలని సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget